18, జనవరి 2017, బుధవారం

భీష్మ - ఎన్టీఆర్

Ponnada Lakshmi
మహాభారత యుద్ధం లో శ్రీకృష్ణ పరమాత్మ తనకేమీ తెలియదని అంపశయ్య మీద ఉన్న భీష్మునితో అంటాడు. అప్పుడు మృత్యుముఖంలో ఉన్న భీష్ముడు చిన్న నవ్వు నవ్వి “తెలిసినా తెలిసినట్లు ఉంటావా పరమాత్మా” ఈ నాటకమంతా నీదే అన్న భావంతో అంటాడు. ‘భీష్మ’ చిత్రంలో ఈ సన్నివేశంలో శ్రీ రామారావు గారు అద్భుతమైన నటన ప్రదర్శించారు. ఆ సన్నివేశంలో ఆయన నటన, వాచకం మరఛి పోలేము. అసలు భీష్మ పాత్రలో పూర్తిగా పరకాయ ప్రవేశం చేశారు. మంచి వయసులో ఉన్నఆయన నూనూగు మీసాల నవ యువకుడిగా, తరువాత కురువంశ భారము మోసే మధ్యవయస్కుడిగా, చివరన వయోవ్రుద్దుడిగా ఆయన నటన అద్వితీయం. చారిత్రాత్మక పాత్రలలో, పౌరాణిక పాత్రలలో ఆయన అభినయం, ఆహార్యం నభూతో నభవిష్యతి.. నాయకుడి పాత్రలే కాక, ప్రతినాయకుడి పాత్రలు కూడా అంత అద్భుతంగా నటింఛి ఆ పాత్రల మీద కూడా అభిమానం కలిగేలా చేసారు. ఆ మహానటుడుకి ఇదే నా ఘన నివాళి.

కామెంట్‌లు లేవు:

యామిజాల పద్మనాభస్వామి - బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు

నా పెన్సిల్ చిత్రం - (స్పష్టత లేని పురాతన  ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం) యామిజాల పద్మనాభస్వామి  బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితు...