15, మార్చి 2019, శుక్రవారం

K. V. Mahadevan - కే . వి. మహాదేవన్


K. V. Mahadevan - నా పెన్సిల్ చిత్రం 


*సినిమా పాట మొదట ప్రజలను ఆకర్షించాలంటే....అందరూ పాడుకునేందుకు వీలుగా ఉండాలి. అంటే...అదీ ఫోక్ స్టైల్ అయితే...ఈజీగా జనాల్లోకి వెళ్తుందని గ్రహించిన మహదేవన్...శాస్త్రీయ సంగీతం క్షుణ్ణం గా వచ్చినా...జానపదాల శైలి కలబోసి...అద్భుతమైన బాణీలను అందించేవాడు!*

మాతృభాష తమిళమే అయినా తెలుగు సినిమాకి ఆయన స్వరపరచిన బాణీలు అజరామరంగా నిలిచాయి. 1958 వ సంవత్సరంలో ప్రతిభా సంస్థ నిర్మించిన "దొంగలున్నారు జాగ్రత్త" అను సినిమాకు తొలిసారిగా తెలుగులో స్వరాలు అందించారు. అదే సంవత్సరంలో విడుదలైన "ముందడుగు'" సినిమాతో మహాదేవన్ ప్రతిభ బయటపడింది. 1962 లో విడుదలైన "మంచి మనసులు" కేవలం పాటల వల్లే సినిమా హిట్టయిందన్నవారు కూడా ఉన్నారు. ఇది నూటికి నూరు పాళ్లు నిజం. ముఖ్యంగా "మావా...మావా " పాట బాగా జనాదరణ పొందింది. అప్పటి నుంచి మహాదేవన్ ను "మామ" అని పిలవడం మొదలుపెట్టారు. 1963లో వచ్చిన "మూగ మనసులు" మామను తిరుగులేని స్థానానికి చేర్చాయి.
ఇక పోటీ ఎక్కడైనా ఉంటుంది. ఎం.ఎస్.విశ్వనాథన్, ఎస్.రాజేశ్వరరావు, పెండ్యాల, టి.వి.రాజు, టి.చలపతి రావు, చక్రవర్తి, ఇళయరాజా....ఎందరో మహానుభావులు. ఎవరిశైలి వారిది!*
*షుమారు దగ్గర దగ్గర 50 సంవత్సరాలు...సంగీత ప్రపంచంలో విఖ్యాతి గాంచడం......4 భాషలలో కలిపి...600 చిత్రాలకు పైగా...స్వరరచన చేయడం...అంత సులభం కాదు...ముఖ్యం గా పోటీ తీవ్రత ఎక్కువగా ఉండే సంగీత ప్రపంచాన!*
*వీరాభిమన్యు, మంచిమనసులు, మూగ మనసులు, తేనె మనసులు, కన్నె మనసులు,అంతస్తులు,అడవిరాముడు, శంకరాభరణం, సప్తపది, శుభోదయం,గోరంత దీపం, ముత్యాలముగ్గు, సిరివెన్నెల,శృతిలయలు, పెళ్ళిపుస్తకం,వంశవృక్షం, స్వాతి కిరణం.....ఎన్నని పేర్కొనాలి! ఆ లిస్ట్ కు అంతం ఉన్నా...ఇక్కడ స్పేస్ సరిపోదు మరి!*
కీ.శే.పుహళేంది గారి పేరు చెప్పనిదే...మామ మహదేవన్ గారి చరిత్ర సంపూర్ణం కాదు. పూవుకు...తావిలా...మామకు పుహళేంది! మామ గారి మౌనాన్ని,సైగలను..సంకేతాలను...సంగీతం గా మలచడం లో పుహళేంది గారి కృషి...మరువలేనిది.
మామ తెలుగు సినిమా సంగీతంలో ఓ కొత్త బాణీకి ఊపిరిపోశారు. కాని ఈయనకు తెలుగు రాదు. అయినా సంగీతానికి "భాష" అనే ఎల్లలు లేవు అని నిరూపించిన వారిలో మహాదేవన్ ఒకరు. ఈయన కవి పాట రాశాక దానికి స్వరాలను అద్దేవారు. చివరి వరకు ఆయన ఇదే పద్ధతిని అనుసరించారు. మనం బాణీ చేసి ఇస్తే అందులో మాటలు పట్టక కవి ఇబ్బంది పడతాడు. అందుకే ఆ పద్ధతి వద్దు అని సున్నితంగా తిరస్కరించేవారు. పాటలోని సాహిత్యాన్ని అధిగమించకుండా స్వరాలను అల్లేవారు. ఒక్కోసారి సాహిత్యం కోసం బాణీల్లో మార్పులూ చేర్పులూ చేసేవారు. తెలుగు తెలియకపోయిన కవి రాసిన సాహిత్యం అర్ధం అవ్వకపోయినా అడిగి మరీ దానర్ధం తెలుసుకొని సందర్భానుసారం స్వరాలను అందించేవారు.

14 March, 1918 సంవత్సరంలో జన్మించి 2 జాతీయ అవార్డులు, 3 నందులు,ఫిలింఫేర్ అవార్డులు...ఎన్ని అందుకున్నా...ప్రజల హృదయాల్లో 'మామ' గా నిలిచిపోయిన కృష్ణన్ కోయిల్ వెంకటాచలం మహదేవన్...నాలుగు దశాబ్ధాలకు పైగా...సినీ సంగీతాన్ని ఏలి.....21..జూన్ 2001 న ఇంద్రసభకు మరలి పోయారు!

(సేకరణ : ఇక్కడా అక్కడా)

కామెంట్‌లు లేవు:

యామిజాల పద్మనాభస్వామి - బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు

నా పెన్సిల్ చిత్రం - (స్పష్టత లేని పురాతన  ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం) యామిజాల పద్మనాభస్వామి  బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితు...