21, జులై 2022, గురువారం

అరియకుడి రామానుజ అయ్యంగార్ - కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు

Charcoal pencil sketch


అరియకుడి రామానుజ అయ్యంగార్ (19 మే 1890– 23 జనవరి 1967 --  కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు. ఇతడు పాడటంలో సరికొత్త శైలిని అభివృద్ధి చేశాడు. దానిని అరియకుడి సంప్రదాయంగా అతని శిష్యులు అనుసరిస్తున్నారు. ఇతడు కర్ణాటక సంగీత కచేరీలలో నూతన పద్ధతులను స్థిరపరిచాడు.

1954లో ఇతనికి సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ లభించింది. 1958లో భారత ప్రభుత్వం ఇతనికి పద్మభూష్గణ్ పురస్కారం  ఇచ్చి సత్కరించింది.


ఇతడు తమిళనాడు రాష్ట్రంలోని కరైక్కుడి జిల్లా (ప్రస్తుతం శివగంగై జిల్లా) అరియకుడి పట్టణంలో 1980, మే 19 న జన్మించాడు.  ఇతడు మొదట పుదుక్కోటై మలయప్ప అయ్యర్, నమక్కల్ నరసింహ అయ్యర్‌ల వద్ద విద్యనభ్యసించాడు. తరువాత పెక్కు సంవత్సరాలు పట్నం సుబ్రమణ్య అయ్యరు శిష్యుడు పూచి శ్రీనివాస అయ్యంగార్ వద్ద శిక్షణ పొందాడు


ఇతడు తన మొదటి ప్రదర్శన 1918లో త్యాగరాయ ఆరాధనోత్సవాలలో ఇచ్చాడు.

కర్ణాటక సంగీత దిగ్గజం సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ ఇతని గురించి ఇలా పేర్కొన్నాడు. "నేను అరియకుడి రామానుజ అయ్యర్ చేత చాలా ప్రభావితమయ్యాను. నేను ఇతనిలా పాడగలిగితే చాలు. నాకు ఇక పునర్జన్మ అక్కరలేదు". మరొక విద్వాంసుడు జి.ఎన్.బాలసుబ్రమణియన్ ఇతడు ఎదురు పడితే భక్తితో సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసేవాడు. ఇతడు మృదంగ కళాకారుడు పాలఘాట్ మణి అయ్యర్‌తో కలిసి అనేక కచేరీలు చేశాడు. ఇరువురికీ ఒకరి పట్ల మరొకరికి గాఢమైన స్నేహంతో పాటుగా గౌరవం ఉండేది. చెంబై వైద్యనాథ భాగవతార్అరియకుడి రామానుజ అయ్యంగార్ ఇద్దరూ తన రెండు కళ్ళని పాలఘాట్ మణి అయ్యర్ చెబుతుండేవాడు.


(సౌజన్యం ః వికీపీడియా)

 

కామెంట్‌లు లేవు:

'కళాప్రపూర్ణ" రావూరు వెంకటసత్యనారాయణ రావు

ఇతడు  కృష్ణా జిల్లా ,  ముచ్చిలిగుంట  గ్రామంలో జన్మించాడు. ఇతడు  కృష్ణా పత్రికలోను ,  ఆంధ్రప్రభ  దినపత్రికలోను పాత్రికేయుడిగా పనిచేశాడు. కృష్...