16, జనవరి 2019, బుధవారం

జతగూడిన ఇరు తనువులు - కవిత


నా చిత్రానికి శ్రీమతి పుచ్చా గాయత్రీదేవి గారి కవిత. వారికి నా ధన్యవాదాలు.

జతగూడిన ఇరు తనువులు 
అనురాగపు సంగమములు
మధురమైన జ్ఞాపకాలు 
నవజీవన సంగతులు 

ఉహించని మన కలయిక
వలపుల శ్రీ రాగ మాలిక.
ఇరు మనసుల చేరిక
శృతిలయల జోడిక.
హంసధ్వని రాగములో
ఆహ్వానపు గీతమునై.
మనజీవిత రంగములో
రసగానము వినిపించన.

శుకపికముల కిలకిలలే
వేదమంత్ర ధ్వనులుగ.
నీ మాటల పొందికలే
తలంబ్రాల వేడుకగా.
నీ చుంబన గురుతులే
మట్టెలు మరి సూత్రములుగా.
జరిగేనోయి మన పరిణయం
మన ఆత్మలే సాక్షిగా.
పి. గాయత్రిదేవి. 

కామెంట్‌లు లేవు:

యామిజాల పద్మనాభస్వామి - బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు

నా పెన్సిల్ చిత్రం - (స్పష్టత లేని పురాతన  ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం) యామిజాల పద్మనాభస్వామి  బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితు...