అన్నమయ్య కీర్తన : "ఉయ్యాల బాలునూచెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు"



విరహవేదనలో ఉన్న పద్మినికి రేడియో లో "ప్రీతమ్ ఆన్ మిలో...ప్రీతమ్ ఆన్ మిలో దుఖియా జియా బులాయే ప్రీతమ్ ఆన్ మిలో' అనే పాట వినిపిస్తూ ఉంటుంది. నేను ఎప్పుడో చూసిన అలనాటి 'కాజల్' సినిమాలో దృశ్యం ఇది. ఆ సన్నివేశానికి, ఆమె మానసి కి స్థితికి అద్దం పట్టినట్టు ఉంటుంది ఆ పాట. అంతవరకూ ఆ పాట గురించి నాకు తెలియదు. మిత్రుని సహకారం తో తెలుసుకున్నాను ఈ పాట పాడింది సి. హెచ్.ఆత్మ అని, స్వరపరచింది ఓ. పి. నయ్యర్ అని, ఈ పాట రచించినది ఓ పి నయ్యర్ భార్య అని !! అయితే అప్పటికి ఓ.పి. నయ్యర్ గురించి చాలామందికి తెలియదు. ఇదొక ప్రైవేట్ రికార్డు. అయితే ఈ పాటని ఆ దృశ్యానికి వాడుకోవడం దర్శకుని సృజనాత్మకత అని చెప్పుకోక తప్పదు. ఈ పాట ఎంత జనాదరణ పొందింది అంటే ఇదే పాటని గురుదత్ తన చిత్రం 'Mr . and Mrs 55' లో ఓ.పి. నయ్యర్ సంగీత దరకత్వం లోనే గీతాదత్ చేత పాడించారు. ఆ సన్నివేశం కూడా అద్భుతంగా ఉంటుంది.
వారం వారం అన్నమయ్య -- 'త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీజన్నాధ..
My Pencil sketch
రాజసులోచన (ఆగష్టు 15, 1935 - మార్చి 5, 2013) అలనాటి తెలుగు సినిమా నటి, కూచిపూడి, భరత నాట్య నర్తకి. తెలుగు సినిమా దర్శకుడు చిత్తజల్లు శ్రీనివాసరావు భార్య. ఈమె విజయవాడలో సాంప్రదాయ కుటుంబంలో జన్మించింది, కానీ విద్యాభ్యాసం అంతా తమిళనాడులో జరిగింది.
రాజసులోచన తండ్రి భక్తవత్సలం నాయుడుకు మద్రాసుకు బదలీ కావడంతో, రాజసులోచన చిన్న వయసులోనే అక్కడకు వెళ్ళిపోయారు. చెన్నైలోని ట్రిప్లికేన్ ప్రాంతంలో ఆమె బాల్యం గడిచింది. అక్కడి తోపు వెంకటాచలం చెట్టి వీధిలో 1939లో స్థాపించిన ప్రసిద్ధ శ్రీసరస్వతీ గాన నిలయంలో ఆమె నాట్యం నేర్చుకున్నది. కష్టపడి తల్లిదండ్రుల్ని ఒప్పించి సరస్వతీ గాన నిలయంలో నాట్యం
నేర్చుకున్నది. ఈమె 1963లో పుష్పాంజలి నృత్య కళాకేంద్రం అనే శాస్త్రీయ నృత్య పాఠశాల ప్రారంభించింది. అది ఇప్పటికీ నడుస్తున్నది.
స్టేజీ మీద రాజసులోచన నాట్య ప్రదర్శన చూసి కొందరు నిర్మాతలు సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చారు. రాజసులోచన 1953లో కన్నడ చిత్రం 'గుణసాగరి' ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. కన్నతల్లి చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. అంతకు ముందు 'గుణసాగరి' అనే కన్నడ చిత్రంతో పాటు 'సత్యశోధనై' అనే తమిళ చిత్రంలో నటించారు. తొలిసారి హీరోయిన్ గా ఎన్.టి.ఆర్. సరసన ఘంటసాల నిర్మించిన సొంతవూరు (1956) చిత్రంలో నటించింది. తన చిత్రాలకు నృత్య దర్శకులైన పసుమర్తి కృష్ణమూర్తి, వెంపటి పెదసత్యం, వెంపటి చినసత్యం, జగన్నాథశర్మ మొదలైన వారి వద్ద కూచిపూడి నృత్యంలోని మెళకువలు నేర్చుకున్నారు. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో కలిపి దాదాపు 275 చిత్రాల దాకా అందరు మేటి నటుల సరసన నటించారు[1]. ప్రతి భాషలోను తన పాత్రకు స్వయంగా డైలాగ్స్ చెప్పుకునేవారు.
మద్రాసు నగరంలో 1963 సంవత్సరంలో 'పుష్పాంజలి నృత్య కళాకేంద్రం' స్థాపించారు. దీని ద్వారా విభిన్న నృత్యరీతుల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలను మన దేశంలోను, వివిధ దేశాల్లో ప్రదర్శించారు. ముఖ్యంగా విదేశాల్లో జరిగే ఫిల్మోత్సవ్ లలో వీరి ప్రదర్శనలు విరివిగా జరిగాయి. ఈ ప్రదర్శనలలో భామా కలాపం, అర్థనారీశ్వరుడు, శ్రీనివాస కళ్యాణం, అష్టలక్ష్మీ వైభవం లాంటి ఐటమ్ లకు మంచి ఆదరణ, ప్రశంసలు లభించాయి. వీరు అమెరికా, జపాన్, చైనా, శ్రీలంక, రష్యా, సింగపూర్ తదితర దేశాల్లో నాట్య ప్రదర్శనలనిచ్చారు.
(courtesy : Wikipedia)
మిత్రులు శ్రీ మురళి పొన్నాడ గారు నా చిత్రానికి రచించిన కవిత. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముగ్ధ కన్నుల్లో ఎదురుచూపుల వాలు, భగ...