చరిత్ర సృష్టించిన అలనాటి మహానటుడు, దర్శకుడు
రాజ్ కపూర్ కి తెలుగు వారితో కూడా అనుబంధం వుంది. వీరు నిర్మించిన ‘ఆహ్’
చిత్రం తెలుగులో ‘ప్రేమలేఖలు’ పేరుతొ అనువదించారు. ఈ చిత్రం
తెలుగులో ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో పాటలు ‘ఎకాంతమో సాయంత్రమో’, ‘పందిట్లో
పెళ్లవుతున్నది’ ‘పాడు జీవితమో యవ్వనం’
వంటి పాటలు తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ చిత్రానికి శంకర్
జైకిషన్ సంగీతం సమకూర్చారు. ఆ రోజుల్లో కూడా సినీ కవులకి పారితోషకం ఎగవెయ్యడంలో
కొందరు నిర్మాతలు సిద్ధహస్తులు. కాని రాజ్ కపూర్ గారు ఈ పాటలు వ్రాసిన
ఆరుద్రగారికి తన స్వహస్తాలతో చెక్కు రూపేణ కొంచెం
పెద్ద మొత్తానికే పారితోషకం అందించి కృతజ్ఞతలు తెలుపుకున్నారట! రాజ్ కాపూర్
గారి ఔదార్యం గురించి ప్రస్తావిస్తూ ప్రముఖ రచయిత్రి, ఆరుద్ర గారి సతీమణి కే. రామలక్ష్మి గారు ఒక వ్యాసం లో
తెలియబరిచారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...
-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...
-
అన్నమయ్య కీర్తన "ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు" _డా. Umadevi Prasadarao Jandhyala గారి వివరణతో చిత్రం : పొన్నాడ ...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి