1, సెప్టెంబర్ 2019, ఆదివారం

నాతో నేను - కవిత



శ్రీమతి ఝాన్సీ మంతిన గారి కవిత కి నా చిత్రం
నాతో నేను

నాతో నేను మాట్లాడి ఎంత కాలమైందని
చిన్నప్పుడెప్పుడో నా మాట నేను వినేదాన్ని
నాతో నేను ఎంతో సంతోషంగా మాట్లాడేదాన్ని
లొపలొకటి బయట ఒకటి లేదు
అంతా ఒకటే నేను కేవలం నేనే
ఎప్పుడు ఎలా మొదలైందో తెలియదు మరి
క్రమంగా నాలో నుండి నేను విడిపోవడం
నాతో నేను మాట్లాడడానికి భయపడడం
నాతో నేను మాట్లాడడం మరచి పోయానుక్రమంగా
హడావిడి బతుకులో నేను నాలోనుండి విడిపోయాను
కొన్నాళ్ళ దాకా తెలియక పోయినా
నాలో నెమ్మదిగా దిగులు
ఏదో పోగొట్టుకుంటున్నానన్న తికమక
చేతులోని మంచు ముక్కలా తెలియకుండానే
కరిగిపోయే రాత్రులు, .పగళ్ళు, రోజులు , నెలలు, సంవత్సరాలు
ఎలా గడిచి పోయాయో,
కాలం గడుస్తున్న కొద్దిి ఏదో తెలియని దిగులు
నా మాట నేను వినకుండా కాలం తో పోటీ పడి పెట్టిన పరుగుల ఫలితం
వేగంగా పెరుగుతూ తగ్గుతూ గాజుగొట్టం లో పాదరసమ్ చూపించే 120/80 ని దాటిపోయిన సంఖ్యలు
వైద్యుడిని చూస్తే గాని తగ్గని గుండెలోని గాభరా
యోగ చేయండి, ధ్యానం చేయండి వైద్యుడి సలహా
అదిగో అప్పుడు గుర్తొచ్చింది నాతో నేను మాట్లాడి ఎన్నో ఏళ్లు గడిచాయని
నెమ్మదిగా నేను నేను గా మారడానికి ప్రయత్నం మొదలుపెట్టా
కొంత నయం కానీ చిన్నప్పుడంత బాగా నాతో నేను మాట్లాడడానికి ఎంతకాలం పడుతుందో మరి.

కామెంట్‌లు లేవు:

యామిజాల పద్మనాభస్వామి - బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు

నా పెన్సిల్ చిత్రం - (స్పష్టత లేని పురాతన  ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం) యామిజాల పద్మనాభస్వామి  బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితు...