13, ఫిబ్రవరి 2024, మంగళవారం

మైలవరపు గోపి - గీత రచయిత


మైలవరపు గోపి - నా charcoal pencil చిత్రం

మైలవరపు గోపి (ఆగస్టు 151949 - సెప్టెంబర్ 81996) తెలుగు సినిమా రంగంలో ఒక ఉత్తమమైన భావాలున్న రచయిత. వీరి పూర్తిపేరు మైలవరపు లక్ష్మీ గోపాలకృష్ణమూర్తి 

తెలుగు సినిమా రంగంలో ఉత్తమమైన భావాలున్న ఒక రచయిత గోపి. ఆత్రేయ అంతేవాసి, మరో మనసు కవి. మూడు దశాబ్దాలపాటు (1966-1996) విలువైన సినీసాహిత్యాన్ని సృజించాడు. ఆత్రేయ, రాజశ్రీ ల దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాడు. 1965లో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ఆడిషన్‌ టెస్టులో ఎన్నికై కన్యాశుల్కం నాటకంలో గిరీశం శిష్యుడు వెంకటేశం పాత్రను పోషించాడు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గోపి 1966 నుండే మంచి మిత్రులు. తొలినాళ్లలో ఇద్దరూ కలిసి, ఒకే గదిలో ఉండేవారు. గోపి ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయాడు. ఇతడు మొత్తం 200 సినిమాలకుగాను 1500 పాటలు వ్రాశాడు. ఇరవై సినిమాలకు సంభాషణలు రచించాడు. మనసా కవ్వించకే అనే సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు రాయడంతో పాటు దర్శకత్వం కూడా నిర్వహించాడు.


మరిన్ని వివరాలు వికీపీడియాలో చూడగలరు. అయితే వీరి ఫోటో వికీపీడియాలో లేదు. వేరొకచోట లభిస్తే చూసే నా charcoal pencil తో చిత్రీకరించాను. 

కామెంట్‌లు లేవు:

'కళాప్రపూర్ణ" రావూరు వెంకటసత్యనారాయణ రావు

ఇతడు  కృష్ణా జిల్లా ,  ముచ్చిలిగుంట  గ్రామంలో జన్మించాడు. ఇతడు  కృష్ణా పత్రికలోను ,  ఆంధ్రప్రభ  దినపత్రికలోను పాత్రికేయుడిగా పనిచేశాడు. కృష్...