తెలుగు వెలుగు
19, ఫిబ్రవరి 2021, శుక్రవారం
కనులు కనులు ఊసులాడే
కళాతపస్వి శ్రీ కే. విశ్వనాథ్
(My pencil sketch)
భారతీయ సంస్కృతి,
హిందూ సాంప్రదాయంలో దేవాలయాలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.కుగ్రామంలో కూడా దేవాలయం మానవజీవన ధర్మానికి వేదమంత్రమైంది.ప్రాణవాయువులా సేదతీర్చే ఉత్కృష్టమైన మహిమ దేవాలయానికి వుంది.అటువంటి దేవాలయంలేని ఊరు పాడుబడిన ఊరుతో సమానం..
అలాగే తెలుగు సినీ చరిత్రలో మన ముందుతరంవారు సమాజవికాసానికి తీసిన చిత్రాలు మహోజ్వలంగా ప్రేక్షకుల హృదయాలను ప్రకాశవంతంచేశాయి అనటంలో ఏమాత్రం సందేహంలేదు...కానీ రాను రాను తెలుగు సినిమా రూపురేఖలు మారిపోతూ ప్రేక్షకుడికి భారతీయత,తెలుగుదనం అంటే ఇదేనా అని ప్రశ్నార్ధకంగా నిల్చి కలవరపెట్టాయి..తెలుగు సినిమాకు తిరోగమనం మొదలయ్యింది,దేవాలయంలేని ఊరులా ఒక ఉనికిని పవిత్రతను కోల్పోతోంది అని కలవరపెడుతున్న తరుణంలో...
అదిగో అప్పుడే విశ్వనాధుడి నవశకం"సిరిసిరిమువ్వలతో"సవ్వడి చేస్తూ కళలకు ఆరాధ్యదైవమైన శంకరుడికి ఆభరణాల వంటి సినిమాల పరంపరతో మొదలయింది..
ఒక జాతి చరిత్రను తెలిపే కళల సమాహారమయినాయి ఆయన చిత్రాలు..
అసలు ఇటువంటి కళాత్మక చిత్రాలకు ఆయన తొలిచిత్రం *ఆత్మగౌరవం*లోనే సూచనప్రాయంగా అంకురార్పణ చేశారు..
భారతీయ ఆత్మ రూపురేఖలకు మూలస్థంభాలు మనో వికాసానికి దోహదపడే కళలు, ఆధ్యాత్మికత, సంస్కృతి సంప్రదాయాలు,నాగరికత మొ...
ఇక కళలనేవి వెండితెర మీద రూపుదిద్దుకోవటంతో నవశకం ప్రారంభమైంది అని భావిస్తే విశ్వనాథుని ప్రవేశంతో
స్వాతి కిరణాలతో ప్రకాశించింది.
ఈ శకానికి కళాతపస్వి..
విశ్వనాధ్ తెలుగుజాతికి పరిచయం చేసిన కవులు ఇద్దరు.సాహిత్య సరస్వతి ఉఛ్చ్వాస నిశ్వాసాలల ఒక వేటూరి,ఒక సీతారామ శాస్త్రీ.వారికలాల వెలుగుతో సినీ సాహిత్య వనాన్ని తమరచనా సౌరభాలతో నింపారు.ఆయన చిత్రాల్లోని గీతాలు ప్రణవనాదంలా ధ్వనించాయి.
ఎన్నో ప్రయోగాలకు,ఎన్నో అభ్యుదయభావాలకు ఆయన సినిమాలు తార్కాణంగా నిలిచాయి.ఎన్నో అవార్డులు,మరెన్నో పురస్కారాలు ఆయన కీర్తి కిరీటంలో సగౌరవంగా సగర్వంగా నర్తించాయి...
తెలుగుజాతి అదృష్టం విశ్వనాథుడు,
తెలుగుజాతి గౌరవం విశ్వనాథుడు,
తెలుగుజాతి గర్వము విశ్వనాథుడు
అంతెందుకు తెలుగుజాతి కీర్తిపతాక మన కాశీనాధుని విశ్వనాథుడు...
ఒక్క మాటలో చెప్పాలంటే యావత్ భారతజాతికి కాశీలోని విశ్వనాధుడు ఒక్కడే,అలాగే తెలుగు సినిమారంగానికి మంచి సినిమాలతో కీర్తిప్రతిష్టలను సాధించిన"కాశీనాధుని విశ్వనాధుడూ"ఒక్కడే...
ఈరోజు ఆయన పుట్టినరోజు...ఆయన ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఆనందంగా హాయిగా ఉండాలని ఆకాంక్షిస్తూ...
విశ్వనాథ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు...( చక్కని విశ్లేషణ ఇచ్చిన ప్రముఖ విశ్లేషకరాలు శ్రీమతి విజయదుర్గ గారికి ధన్యవాదాలు)
మిత్రులు శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ గారు నా చిత్రానికి ఇచ్చిన పద్య స్పందన. వారికి ధన్యవాదాలు.
18, ఫిబ్రవరి 2021, గురువారం
మధుబాల - The Venus of India
11, ఫిబ్రవరి 2021, గురువారం
డా. సి. ఆనందారామం.. నివాళి
ఆనందరామం ఇకలేరు!
ప్రముఖ రచయిత్రి సి.ఆనందరామం ఇవాళ ఉదయం హైదరాబాద్ లో గుండెపోటుతో కనుమూశారు. ఆమె అసలు పేరు ఆనంద లక్ష్మి. భర్త రామం పేరు తన పేరు చివర జోడించి రచయిత్రి సి.ఆనందారామంగా తెలుగు సాహిత్య లోకం లో రాణించారు. ఆగస్టు 20వ తేదీ 1935వ సంవత్సరం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. 60 నవలలు, 100కు పైగా కథలు, కొన్ని విమర్శనా గ్రంథాలు రాశారు. ఆమె రాసిన నవల ఆత్మబలి ...సంసార బంధం సినిమాగా, అదే నవల జీవన తరంగాలు టీవీ సీరియల్గా వచ్చింది. జాగృతి నవలను త్రిశూలం సినిమాగా, మమతల కోవెల నవలను జ్యోతి సినిమా గా తీశారు. ఏలూరులోని ఈదర వెంకట రామారెడ్డి స్కూలులో ప్రాథమిక విద్యను అభ్యసించి, ఇంటర్ వరకు చదివి బి.ఏ. ప్రైవేటుగా పూర్తి చేశారు. సి.ఆర్.ఆర్.కాలేజీలో తెలుగు ట్యూటర్గా కొన్నాళ్లు పనిచేశారు. 1957లో వివాహం అయ్యాక హైదరాబాదుకు మకాంమార్చారు .1958-'60లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ. తెలుగు చేశారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి గైడ్ గా పి.హెచ్.డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. హోం సైన్స్ కాలేజీలోను, నవజీవన్ కాలేజీలోను కొంతకాలం పనిచేశాక 1972లో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చేరి ప్రొఫెసర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. సుమారు 30మంది విద్యార్థులు ఈమె ఆధ్వర్యంలో పి.హెచ్.డి చేశారు. 2000లో పదవీ విరమణ పొందారు.
గృహలక్ష్మి స్వర్ణకంకణము - 1972
మాలతీ చందూర్ స్మారక అవార్డు -2013, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు - 1979 (తుఫాన్ నవలకు), మాదిరెడ్డి సులోచన బంగారు పతకం - 1997, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు - రెండు పర్యాయాలు, సుశీలా నారాయణరెడ్డి పురస్కారం,
గోపీచంద్ పురస్కారం,
అమృతలత జీవన సాఫల్య పురస్కారాలు ఆమెను వరించాయి! ఆమె మృతితో ఒక శకం ముగిసింది! శాశ్వతంగా గుర్తుండిపోయే రచనలు చేసిన ఆనందరామం గారికి అశ్రు నివాళి🙏
- డాక్టర్ మహ్మద్ రఫీ
రావి కొండలరావు.. నివాళి
ప్రముఖ నటుడు , దర్శకుడు, రచయిత, నాటకం.. సినీమా.. టీవీ.. పత్రికలు.. ఇలా అన్ని రంగాలలోనూ విశేష అనుభవం కలిగిన రావి కొండలరావు జయంతి సందర్బంగా నా చిత్ర నివాళి. (Pencil sketch). వీరి గురించి నేను సోషల్ మీడియాలో సేకరించిన మరిన్ని వివరాలు. :
7, ఫిబ్రవరి 2021, ఆదివారం
విజయనగరం సంగీత కళాశాల.. ఘంటసాల
విజయనగరం సంగీత కళాశాల ప్రాంగణంలో నాడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారు విద్యార్థి దశలో పచ్చడి రుబ్బుకోవటం కోసం ఉపయోగించిన రుబ్బుడు రాయి (గుంట). ఎంతో జాగ్రత్తగా, పవిత్రంగా పదిలపరిచి కళాశాల శతాబ్ది(2019) సంవత్సర వేడుకలలో వారి అభిమానులకు, సందర్శకులకు దర్శన బాగ్యం కల్పించేరు ఉత్సవ రధసారధులు. The Golden Heritage of Vizianagaram సౌజన్యం తో..
4, ఫిబ్రవరి 2021, గురువారం
మదిగదిలో వలపు రేపి మౌనిలాగ మరలిపోకు
🌹ముషాయిరా గజల్🌹
@@**@@
మదిగదిలో వలపు రేపి మౌనిలాగ మరలిపోకు!
గుబులు బుగులు తోడునిచ్చి వింతగ నను వీడిపోకు!
కనులెందుకు భారమాయె, కలత నలక రాలిపోదె
ఓ మానిస పదేపదే తపనల దరి కుమిలిపోకు!
చిత్తడిమడి మనసంతా, చిన్నబోయి చివికి పోయె
కమ్ముకున్న కారుమబ్బు కసిదీరా కురిసిపోకు!
తిరిగి రాని కాలమింక నిలదీసే వగపేలని
నన్ను నాకు మిగల్చనీ స్నేహితమా మరచిపోకు!
గుండెగోస తీరనిదే, ఎవరికెవరు చివరివరకు
రంగుహంగు జీవితమా క్రుంగిపోయి ఆగిపోకు !
గుప్పెడంత గుండెలోన అల్లుకున్న ఆత్మీయత
తడిమిబోవు తరంగాల ఉప్పెనవై ముంచిపోకు!
జ్ఞాపకాల సమాధిపై నిదురించకు చెంగలువా
చిలకరించు తలపులతో చిరునగవా వీగిపోకు!
✍️...#పద్మజ_చెంగల్వల
PC : Pvr Murty garu
కనులు కనులు ఊసులాడే
🌹 కనులు కనులే ఊసులాడే కాముడేదో చేసెనే మనసుపొరలో అలజడేదో తీపిగాయం చేసెనే 🌹 పలుకు వినకే క్షణము యుగమై వేచిచూసే మౌనమే దరికిచేరగ...

-
Ponnada Sketches @ Drawings: Dilip Kumar - Pencil sketch Dilip Kumar, the living legend of Hindi cinema, a veteran actor, is my most favou...
-
స్మృత్యంజలి : ప్రఖ్యాత తెలుగు మహిళా కార్టూనిస్ట్ 'రాగతి పండరి' (నా pencil చిత్రం) నవ్వించడమనేది ఓ అద్భుతమైన కళ. సమయానుకూలంగా, ...
-
తెలుగు చిత్రసీమను ఏలిన ఇద్దరు మహానటులు. వారి గురించి ఓ చక్కని వ్యాసం 'సాక్షి' దినపత్రిక సౌజన్యంతో, ఈ క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి...
