31, మే 2021, సోమవారం

మహానటి నర్గీస్ - Nargis



Nargis - My pencil sketch


భారతీయ చలనచిత్ర రంగంలో చరిత్ర సృష్టించిన ఓ మహా నటి నర్గీస్ ఆమె గురించి నేను సేకరించిన వివరాలు క్లుప్తంగా :

నర్గిస్ జూన్ 1, 1929 న బ్రిటిష్ ఇండియాలోని రావల్పిండిలో ఫాతిమా రషీద్ గా జన్మించింది , జద్దన్బాయి మరియు ఉత్తమ్చంద్ మోహన్చంద్ ల కుమార్తె. ఈమె తండ్రి మాజీ హిందూ మొహయల్ బ్రాహ్మణుడు, ఇస్లాం మతంలోకి అబ్దుల్ రషీద్ గా మారారు. ఆమె తల్లి సుప్రసిద్ధ నృత్యకారిణి, గాయకురాలు, నటి, స్వరకర్త మరియు దర్శకురాలు. ఫాతిమా 1935 లోనే చైల్డ్ ఆర్టిస్ట్ (బేబీ నర్గిస్) గా మారడానికి ఇదే మార్గం సుగమం చేసింది. బాలీవుడ్ నటులు అన్వర్ హుస్సేన్ మరియు అక్తర్ హుస్సేన్ లకు ఆమె సోదరి.

నర్గిస్ మరియు నటుడు రాజ్ కపూర్ జంటగా నటించిన చిత్రాలు అఖండ విజయం సాధించాయి. వీరి off screen romance అందరికీ తెలిసిందే. అప్పటికే వివాహితుడైన రాజ్ కపూర్ తన భార్యకు విడాకులిచ్చి ఈమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. విశ్వవ్తాప్తంగా బహుప్రశంసలు పొందిన 'మదర్ ఇండియా' చిత్రంలొ ఈమె, సునీల్ దత్ తల్లీ కొడుకులుగా నటించారు. ఈ చిత్రం షూటింగ్ లో మంటలు సన్నివేశంలో నర్గీస్ ని రక్షించి సునీల్ దత గాయలకు పాలయ్యాడు. అప్పుడు నర్గీస్ సునీల్ దత్ కి శుశ్రూషలు చేసింది. ఈ విధంగా వారి మధ్య ప్రేమ చిగురించింది. వీరిద్దరూ అప్పుడు వివాహం చేసుకున్నారు. ప్రఖ్యాత నటుడు సంజయ్ దత్ వీరి కుమారుడే!

ఎన్నో సంవత్సరాల తర్వాత నర్గీస్ 'రాత్ ఔర్ దిన్' చిత్రంలో ఓ విలక్షణమైన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో ఆమె నటనకుగాను అప్పుడే ప్రవేశపెట్టిన తొలి "ఊర్వశి" పురస్కారాన్ని స్వంతం చేసుకుంది. నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం 'పద్మశ్రీ' పొందిన తొలి నటి కూడా ఈమే. ఇంకా ఎన్నో పురస్కారాలు ఈమె స్వంతమయ్యాయి.

Pancreatic cancer తో మే 3, 1981 సంవత్సరంలో నర్గీస్ మృతి చెందారు.


28, మే 2021, శుక్రవారం

మేలుకో శృంగారరాయ మేటి మదన గోపాలా - అన్నమయ్య కీర్తన




(నా చిత్రంతో అన్నమయ్య కీర్తన)

మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల
మేలుకోవె నాపాల ముంచిన నిధానమా

సందడించే గోపికల జవ్వనవనములోన
కందువదిరిగే మదగజమవు
యిందుముఖి సత్యభామ హృదయపద్మములోని
గంధము మరిగినట్టి గండు తుమ్మెద

గతిగూడి రుక్మిణికౌగిట పంజరములో
రతిముద్దు గురిసేటి రాచిలుకా
సతుల పదారువేల జంట కన్నులఁ గలువలు
కితమై పొదిమిన నా యిందు బింబమ

వరుసంగొలనిలోని వారి చన్నుఁగొండలపై
నిరతివాలిన నా నీలమేఘమా
శిరనురమున మోచి శ్రీవేంకటాద్రి మీద
గరిమ వరాలిచ్చే కల్పతరువా

ఈ కీర్తనని శ్రీ బాలకృష్ణప్రసాద్ గారు అద్భుతంగా పాడారు. ఈ క్రింది లింక్ క్లిక్ చేసి వినండి.

25, మే 2021, మంగళవారం

విరసముగ మారి విరహము - కంద పద్యం


 

నా pencil చిత్రానికి శ్రీమతి పద్మజ మంత్రాల రచించిన ఓ చక్కని కంద పద్యం.

చిత్రకారులు శ్రీ పొన్నాడ మూర్తి గారికి ధన్యవాదాలతో...

🙏
#కందము#
విరసముగ మారి విరహము
నరనరమును తోడుచుండి నలిగులి చేయన్...
వరమో మరి శాపమ్మో
కరిగిన కలలన్ని మెదిలె కలికి మనమునన్!

23, మే 2021, ఆదివారం

రామ్-లక్షణ్, SP బాలసుబ్రహ్మణ్యం అనుబంధం






 

నిన్న స్వర్గస్తులైన ప్రఖ్యాత సంగీత దర్శకుడు 'రామ్లక్ష్మణ్' కు నా నివాళి. వీరి ఫోటో ప్రక్కన బాలు గారి చిత్రం (నా pencil drawing) ఎందుకని మీరు సందేహించవచ్చు.
ఈ సంగీత దర్శకుని అసలు పేరు 'విజయ్ పాటిల్'. మరొక సంగీత దర్శకుడు సురేంద్ర తో కలిసి 'రామ్-లక్షణ్' అన్న పేరుతో పలు విజయవంతమైన హిందీ, మరాఠీ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. మన గాన గాంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు లక్ష్మీకాంత్ ప్యారేలాల్ దర్శకత్వంలో హిందీ తెరకి పరిచయమయినా, వీరికి మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన పాటలు రామ్-లక్ష్మణ్ సంగీత దర్శకత్వంలో వచ్చిన Maine Pyar kiya, Ham aap ke hain koun, Hum saath saath చిత్రాలే. ఈ మూడు చిత్రాలు రాజశ్రీ banner పై వచ్చిన చిత్రాలే. ఈ చిత్రాల్లొ Salman Khan కి గొంతు ఇచ్చింది బాలూ గారే. Salman Khan కి బాలు గారి గొంతు అతికినట్లు సరిపోయింది. బారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఈ పాటలు అజరామరంగా నిలిచిపోయాయి. బాలు గారు జీవించి ఉంటే రామ్-లక్ష్మణ్ మృతి పట్ల చాలా విచారించి ఉండేవారు.


22, మే 2021, శనివారం

సాహిర్ లూఢియాన్వీ - Sahir Ludhianvi


My pencil art work of Sahir Ludhianvi

సాహిర్ లుధియాన్వీ (1921-1980), సుప్రసిద్ధ ఉర్దూ కవి, ఎన్నో హిందీ సినిమాల గేయరచయిత. ఇతడి పేరు "అబ్దుల్ హయీ", కలంపేరు "సాహిర్", లూధియానాకు చెందినవాడు కాబట్టి లుధియానవి అయ్యాడు. సాహిర్ అనగా 'మాంత్రికుడు' (జాదూ చేసేవాడు), సాహితీ ప్రపంచంలో ఇలాంటి కలంపేర్లు పెట్టుకోవడం ఓ ఆనవాయితీ. రెండు సార్లు ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నాడు.

బాలీవుడ్ లో తన ప్రస్థానం మొదలెట్టి, అంచెలంచెలుగా ఎదిగి, ఓ రెండు దశాబ్దాలుగా వెలుగొందాడు. హిట్టయిన ప్రతిచిత్రం ఇతడి రచించిన పాటలు కలిగివుండేది.


  • కభీ కభీ చిత్రంలోని పాట;
"మైఁ పల్ దో పల్ కా షాయర్ హూఁ, పల్ దో పల్ మెరీ కహానీ హై

  • ప్యాసా చిత్రంలోని ఈ పాట అప్పటి ప్రధానమంత్రియైన జవహర్లాల్ నెహ్రూను సైతం కదిలించివేసింది.

"యే కూచే, యె నీలామ్ ఘర్ దిల్‌కషీ కే,
యె లుట్‌తే హువే కారవాఁ జిందగీ కే,
కహాఁ హైఁ, కహాఁ హైఁ ముహాఫిజ్ ఖుదీ కే,
జిన్‌హే నాజ్ హై హింద్ పర్ వో కహాఁ హైఁ,

సాహిర్ వ్రాసిన కొన్ని పాటలు;

  • ఆనా హై తొ ఆ (आना है तो आ) - నయా దౌర్ (1957) - స్వరకల్పన ఓ.పి.నయ్యర్.

  • యె దునియా అగర్ మిల్ భి జాయే తొ క్యా హై (ये दुनिया अगर मिल भी जाए तो क्या है) (ప్యాసా -1957), స్వరకల్పన ఎస్.డి.బర్మన్.

  • తూ హిందు బనేగా న ముసల్మాన్ బనేగా, ఇన్సాన్ కి ఔలాద్ హై ఇన్సాన్ బనేగా (तु हिंदु बनेगा ना मुसलमान बनेगा) - ధూల్ కా ఫూల్ (1959), స్వరకల్పన దత్తా నాయక్.

  • యే ఇష్క్ ఇష్క్ హై (ये ईश्क ईश्क है ) - బర్సాత్ కి రాత్ (1960), స్వరకల్పన రోషన్.

  • నాతో కారవాఁకీ తలాష్ హై (ना तो कारवाँ की तलाश है) - బర్సాత్ కీ రాత్ (1960), స్వరకల్పన రోషన్.

  • అల్లా తేరో నామ్, ఈశ్వర్ తేరో నామ్ (अल्ला तेरो नाम ईश्वर तेरो नाम) - హమ్ దోనో (1961), స్వరకల్పన జయదేవ్.

  • చలో ఎక్ బార్ ఫిర్ సే అజ్‌నబీ బన్ జాయేఁ హమ్ దోనో (चलो ईक बार फिर से अजनबी बन जाए हम दोनो ) - గుమ్‌రాహ్ (1963 ) - స్వరకల్పన రవి.

  • మన్ రే తూ కాహే న ధీర్ ధరే (मन रे तु काहे ना धीर धरे?) - చిత్రలేఖ (1964) - స్వరకల్పన రోషన్.

  • సంసార్ సే భాగే ఫిర్తే హో, భగవాన్ కో తుమ్ క్యా పావో గే (संसारसे भागे फिरते हो, भगवान को तुम क्या पाओगे) - చిత్రలేఖ (1964) - స్వరకల్పన రోషన్.

  • ఈశ్వర్ అల్లా తేరే నామ్ (ईश्वर अल्ला तेरे नाम) - నయా రాస్తా (1970) - స్వరకల్పన దత్తానాయక్.
  • మైఁ పల్ దో పల్ కా షాయర్ హూఁ (मै पल दो पल का शायर हुँ) - కభీ కభీ (1976) - ముహమ్మద్ జహూర్ ఖయ్యాం.

  • కభీ కభీ (कभी कभी) - కభీ కభీ (1976) - ముహమ్మద్ జహూర్ ఖయ్యాం.

సాహిర్ రచించిన కొన్ని అద్భుతమైన సూపర్ హిట్ పాటలు ఈ క్రింది లింక్ క్లిక్ చేసి వినొచ్చు .. 


https://www.youtube.com/watch?v=outkSx58IjQ

19, మే 2021, బుధవారం

నీ ముసి ముసి నవ్వులు ఒలికే ముద్దు మోమె చాలులె!


 


మిత్రులు శ్రీ Suresh Ganti గారి గజల్ కి నా చిత్రం. అనుమతించిన సురేష్ గారికి ధన్యవాదాలు..


మనసిచ్చిన నెచ్చెలివని మనసు నీకె ఇచ్చాను
నీ ముసి ముసి నవ్వులు ఒలికే ముద్దు మోమె చాలులె!

నీ వలపన్నదె గెలుపని నే పోరాటమె చేస్తున్నా
నీ నులి సిగ్గుల మొగ్గలైన ఆ ముద్దు మోమె చాలులె!

కనురెప్పలె ప్రమిదలుగ ప్రేమ జ్యోతులు వెలిగించాను
నీ చిరునవ్వులు చిందించెడి ఆ ముద్దు మోమె చాలులె!

నా తలపులు నా వలపులు నీవేనని చెపుతున్నా!
మెరిసెడి కన్నుల నవ్వెడి నీ ముద్దు మోమె చాలులె!

ఈ జన్మకు ప్రతి జన్మకు నా ప్రేయసివిక నీవన్నా!
నీ అరచేతిలొ దాచుకున్న ఆ ముద్దు మోమె చాలులె!

నా తనువూ, మనసూ నీకై తహతహ మని అంటున్నా!
నీ ఎరుపెక్కిన బుగ్గలసిరి ముద్దు మోమె చాలులె!

నా కలలో, ఇలలో నీకై , కలవరపడి చూస్తున్నా!
మనసున మరులను రేపే నీ ముద్దు మోమె చాలులె!

రచన ~ సురేష్ గంటి. 

16, మే 2021, ఆదివారం

ముబారక్ బేగమ్ - కభీ తన్హాయియోమేఁ హమారీ యాద్ ఆయేగీ

ముబారక్ బేగమ్ - అద్భుత playback గాయని (my pencil drawing)

ఈమె పాడిన 'కభీ తన్హాయియోంమే హమరీ యాద్ ఆయేగీ' పాట ఓ సూపర్ హిట్. ఈ పాటను మిత్రురాలు, ప్రముఖ గాయకుడు కీ.శే. KBK మోహన్ రాజు గారి కుమార్తె నా చిత్రం background తో చాలా చక్కగా పాడారు. ఆమె పాడిన పాట, తదితర వివరాలతో ఉన్న facebook link క్రిందన ఇస్తున్నాను.  వీక్షించమని మనవి. ధన్యవాదాలు.





 

మన మహనీయులు : సర్ ఆర్థర్ కాటన్ - శ్రీ వీణం వీరన్న





post courtesy : "I Love West Godavari" group from Facebook.
Sketch of Sir Arthur Cotton drawn by me.

 కాటన్ దొర అంటున్నామే గానీ ఆయనకు సహకరించిన తొలి తెలుగు ఇంజనీర్ వీరన్న గారిని విస్మరిస్తే ఎలా.. ? కొన్ని విషయాలను గూగుల్ నుండి సేకరించాను

కింద మేటర్ చూసి సగం మందికి పైనే పూర్తిగా చదవను కూడా చదవరు ... కానీ ఈ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ చదవాల్సిన, తెలుసుకోవాల్సిన విషయం ఇది ...

మన గోదావరి జిల్లాల ప్రాంతాలు ఈరోజు  సస్యశ్యామలంగా ఉన్నాయంటే దానికి #ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కారణం మరి దానికి కారణం ఎవరు అంటే మనం టక్కున శ్రీ సర్‌ ఆర్థర్‌ కాటన్‌ ( #కాటన్_దొర ) గారు అని తడుముకోకుండా చెప్పేస్తాం. ఈ గోదావరి జిల్లాలను ‘అన్నపూర్ణ’ లా మార్చిన కాటన్‌దొర గారికి  వెన్నెముకలా నిలిచిన ఇంజినీరు ఎవరు అంటే దాదాపు చాలా మందికి తెలియదు.


చరిత్ర ‘చీకట్ల’లో కలసిపోయిన ఆయన పేరే శ్రీ #వీణం_వీరన్న గారు ... ఎక్కడో బ్రిటిష్ వారు అయిన కాటన్ దొర కు  తనది కాని ప్రాంతంలో, తన భాష కాని వాళ్లతో అంత పెద్ద నిర్మాణ పనిని తలకెత్తుకున్న ఆయనకు తలలో నాలుకలా నిలిచారు వీరన్న గారు ... కాటన్‌ దొర గారికి వీరన్న గారు సాయం రాకపోతే ధవళేశ్వరం ఆనకట్ట ఎప్పటికి పూర్తయ్యేదో అన్నది ప్రశ్నర్ధకం ...!!

శ్రీ వీణం వీరన్న గారు వీరరాఘవమ్మ, కొల్లయ్య దంపతులకు 1794, మార్చి 3న జన్మించారు... తండ్రి కొల్లయ్య మచిలీపట్టణంలో బ్రిటిష్‌ ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగిగా చేసేవారు... దాంతో వీరన్న గారిని తల్లితోపాటు #రాజమండ్రిలో బంధువుల ఇంట్లో విడిచి ఉండేవారు... అలా వీరన్న గారి ప్రాథమిక విద్యను రాజమండ్రిలో పూర్తి చేసుకున్నారు. ధవళేశ్వరానికి చెందిన శ్రీమతి వెంకాయమ్మ గారితో వీరన్న గారికి వివాహమైంది. వారికి వెంకటరత్నం, జనార్దనస్వామి, కొల్లయ్య, సీతారామస్వామి, బాపమ్మలు సంతానం. 

మచిలీపట్టణం ఆంగ్లోఇండియన్‌ కళాశాలలో ఉన్నత విద్యను పూర్తిచేసిన వీరన్న గారు, తన తండ్రి సూచన మేరకు ఇంజినీరింగ్‌ చదివేందుకు బెంగాల్‌ వెళ్లారు. అప్పుడు ఆంగ్లేయుల ప్రధాన పాలన కేంద్రం కలకత్తా ...  ఇంజినీరుగా ఆయన శిక్షణ మాత్రం మద్రాసులో సాగింది. 

1840 నాటికి #రాజమండ్రి వచ్చి నీటిపారుదల శాఖలో ఉద్యోగ జీవితం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే... 1844లో గోదావరి పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చిన శ్రీ ఆర్థర్‌ కాటన్‌ గారితో #వీరన్న గారికి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి కాటన్‌ దొరకు సహాయకుడిగా వీరన్న కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కాటన్‌ దొర నివాస వ్యవహారాలు, నౌకర్లు, ఆరోగ్య, ఆహార విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవడం లాంటివి వీరన్న గారే  చూసుకునేవారు. తనకంటే వయసులో పెద్దవాడైన వీరన్న గారిని కాటన్‌ దొర సోదర సమానుడిగా గౌరవించేవారు ....

ప్రయాణ సౌకర్యాలు అంతగాలేని ఆ కాలంలో... కాటన్‌ దొర తో పాటు గోదావరి తీరం వెంబడి కాలినడకన, గుర్రాల మీద వెళ్తూ ఆనకట్ట నిర్మాణ పనులను #వీరన్న గారు పర్యవేక్షించారు. రాజమండ్రి నుంచి అటు గోదావరి పుట్టే త్య్రంబకం., ఇటు సముద్రంలో కలిసే వరకు దాదాపు 1500 కిలోమీటర్ల ఎగువ దిగువ పరివాహక ప్రాంతాల్లో కాటన్‌ దొర విస్తృతంగా పర్యటించారు. ఆ సమయంలో వీరన్న గారు ఆయన వెన్నంటి ఉన్నారు. భోజన సదుపాయాలు లేని మార్గాల్లో నెలల తరబడి ప్రయాణించిన వారిద్దరూ ... అరటి, మామిడి, జామపండ్లు తింటూ, గోదావరి నీళ్లు తాగుతూ ముందుకు సాగిపోయేవారు.

ఆనకట్ట నిర్మాణం సమయానికి తూర్పు- పశ్చిమ గోదావరి, #కృష్ణా_జిల్లాలు కలిసి రాజమండ్రి జిల్లాగా ఉండేవి. బ్రిటిష్‌ కాలంలో దేశాన్ని ఎన్నో కరవులు పీడించాయి. ఓ వైపు గోదావరి, కృష్ణా నదుల నీళ్లు వృథాగా సముద్రంలో కలిసేవి. మరోవైపు ప్రజలు కరవుల బారినపడి తీవ్ర ఇక్కట్ల పాలయ్యేవాళ్లు..

దానితో ఈ నదుల నీళ్లను వ్యవసాయ అవసరాలకు వినియోగించుకునేలా చేయాలని సంకల్పించింది ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం. ఈ పనిని కాటన్‌ దొర గారిని నియమించింది... దీనికోసం ప్రణాళిక సిద్ధం చేసుకుని కాటన్‌ గారితో కలిసి వీరన్న గారు మారుమూల ప్రాంతాల్లో సంచరిస్తూ ఆయా ప్రాంతాల రైతులను చైతన్యపరిచారు.

ఆనకట్ట పనులు ప్రారంభమైన తొలినాళ్లలో గోదావరి జిల్లాల నుంచి పనిచేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దానితో ఒడిశా, బెంగాల్‌ల నుంచి వందలమందిని ధవళేశ్వరానికి రప్పించారు. వీరన్న గారు వాళ్లకు కావాల్సిన శిక్షణ ఇస్తూ రోజువారీగా చెల్లించే కూలీ డబ్బుల్ని నిక్కచ్చిగా ఇచ్చేవారు . ఇది గ్రహించిన గోదావరి ప్రజలే కాకుండా కృష్ణా, గుంటూరు శ్రామికులు కూడా తమంత తాముగా ఆనకట్ట నిర్మాణానికి ముందుకువచ్చారు. వీరన్న గారు తన కుటుంబానికి ఉన్న పలుకుబడి పరిచయాలతో మన్యప్రాంతం కోయవారిని కూడా ఆనకట్ట పనులకు కూడగట్టారు. పనికి కొత్తయిన వాళ్లకు తగిన శిక్షణ ఇప్పించారు. కూలీలను ఉత్సాహపరిచేందుకు... పనిచేయని ఆదివారం కూలి సొమ్మును కూడా శనివారం సాయంత్రమే ఇచ్చేవాళ్లు. ఇది కూలీల్లో ఆనకట్ట నిర్మాణ అధికారులంటే విశ్వాసం పెరిగేలా చేసింది. వీరన్న గారు శ్రామికుల కోసం గోదావరి తీరాన నివాసాలు ఏర్పాటు చేసి వాళ్ల ఆరోగ్య రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తానికి 1851 నాటికి పదివేల మందికి పైగా శ్రామికులను సమకూర్చి ఈ మహాయజ్ఞం పూర్తయ్యేలా చేశారాయన.

1848, 1851లలో ప్రభుత్వం నుంచి సొమ్ము రావటం ఆలస్యమైనా పనులు ఆగకుండా శ్రామికులను వీరన్న గారు ఉత్తేజపరిచారు. వారికి కూలీ సొమ్ము చెల్లించి అటు అధికారులు, ఇటు శ్రామికులు ఒకరికొకరు సహకరించుకునేలా చేశారు. అప్పట్లో గోదావరి తీరపు జమీందారుల్లో కొంతమంది అభివృద్ధి వ్యతిరేకులు ఉండేవాళ్లు. దానికితోడు ఆనకట్ట నిర్మాణానికి కంకణబద్ధులైన కాటన్ దొర, వీరన్న గారి పట్ల ఆంగ్లేయ ( బ్రిటిష్ ) అధికారులకు అసూయ ఏర్పడింది. దాంతో వాళ్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసేవాళ్లు. వీటివల్ల ఒకానొక సందర్భంలో ఆనకట్ట నిర్మాణం ఆగిపోయిందనే వదంతులు కూడా వచ్చాయి. అలాంటి సమయంలోనూ వీరన్న గారు, కాటన్‌ దొరల మీద ఉన్న గౌరవం, విశ్వాసం శ్రామికులతో ఏ ఆటంకాలు లేకుండా పనిచేయించింది. ఇదంతా గమనించిన ప్రభుత్వం తన అభిప్రాయాన్ని మార్చుకుని ఆనకట్ట నిర్మాణానికి కావాల్సిన డబ్బు, ముడిసరకులను ఎప్పట్లా సరఫరా చేసింది. 

చివరికి 1852 మార్చి 31 నాటికి పని పూర్తయింది. ఆనకట్ట పూర్తయ్యాకే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పేర్లు వాడుకలోకి వచ్చాయి.

వీరన్న గారి సహకారం, కృషి, పట్టుదల, నిజాయతీ, అంకితభావం కారణంగానే తన కల నెరవేరిందని గ్రహించిన కాటన్‌ దొర ఆంగ్లంలో స్వదస్తూరితో ‘శ్రీ వీణెం వీరన్న అనే హైందవ పురుషోత్తముడు నాకు లభించకుండా ఉండి ఉంటే, నేను అనుకున్నట్లుగా ఇంతవేగంగా గోదావరి ఆనకట్టను పూర్తిచేయలేక పోయేవాణ్ని’ అని రాసుకున్నారు. ఇంతేకాకుండా వీరన్న గారి శ్రమకు ప్రతిఫలంగా ... ఆయనకు ఇంకా ఏదైనా మేలు చేయాల్సిందిగా ఈస్టిండియా కంపెనీని, విక్టోరియా మహారాణిని అభ్యర్థించారు. 

దాని ఫలితంగా కంపెనీ ఆనకట్టకు సమీపంలో ఉన్న మెర్నిపాడు గ్రామశిస్తును (ఆ రోజుల్లో రూ.500కు పైగా) వీరన్నకు శాశ్వతంగా దఖలుపరిచింది. అంతేకాదు ఆయనకు ‘#రాయబహుదూర్‌’ బిరుదునిచ్చి సత్కరించింది... ఆనకట్ట నిర్మాణ సమయంలో అనేక పర్యాయాలు కాటన్‌ దొర అస్వస్థతకు గురయ్యారు. ఆస్ట్రేలియా, లండన్‌లకు నెలల తరబడి వెళ్లేవారు. అయినా వీరన్న గారు కూలీలను సమన్వయపరుస్తూ నిర్మాణ పనులు సమర్థంగా నిర్వహించారు. నిర్మాణ సమయంలోనూ, అనంతరం కురిసిన వర్షాల కారణంగా గోదావరికి వరదలు వచ్చి... చిన్నాపెద్ద ప్రమాదాలు వచ్చి పడినా సకాలంలో ప్రభుత్వం ఆనకట్టకు తగిన మరమ్మతులు చేపట్టేలా చేశారాయన.

1852లో ఆనకట్ట నిర్మాణం పూర్తయిన నాటినుంచి 1867లో మరణించేవరకు ధవళేశ్వరం హెడ్‌లాక్‌ క్వార్టర్సే వీరన్న గారి చిరునామాగా ఉంది. ఆయన కోరిక మేరకు నేటి ధవళేశ్వరం హెడ్‌లాక్‌ ప్రాంతంలోనే ఆయన పార్థివ దేహానికి దహన సంస్కారాలు జరిపి అస్తికలను గోదావరిలో నిమజ్జనం చేశారు. అంతేకాదు ఆయనను దహనం చేసిన ప్రాంతంలో ఉన్న రాతిగోడ మీద వీరన్న గారి పేరును ఆంగ్లంలో  '‘వి.వీరన్న ,., రాయ్‌బహుదూర్,, సబ్‌ఇంజినీర్, 1867’ అని చెక్కించారు అప్పటి ఆనకట్ట ఉద్యోగులు. ఇప్పుడు ఆ  ప్రదేశం పిచ్చిమొక్కలతో నిండిపోయింది. 1940లో బులుసు సాంబమూర్తి కాటన్‌ దొర విగ్రహం దగ్గరే వీరన్న గారి వివరాలు తెలిపే శిలాఫలకాన్ని చెక్కించారు.

1986లో వచ్చిన వరదలో కాటన్‌ దొర విగ్రహంతోపాటు ఈ శిలాఫలకం కూడా కొట్టుకుపోయింది. 1988లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారి  ప్రోద్బలంతో ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర నిర్మించిన ‘కాటన్‌ మ్యూజియం’లో వీరన్న గారి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడది మసకబారిపోయింది. తనకెంతో సాయమందించిన వీరన్న గారిని కాటన్‌ దొర  మరచిపోలేదు. కానీ మనం మర్చిపోయాం.

ఇలాంటి మహానుభావుల గురించి చెప్పుకోవడం ఎంతో అదృష్టం ., అయితే భావి తరాలకు ఇలాంటి గొప్ప వారి గురించి తెలిసేలా ప్రభుత్వాలు ఆయన విగ్రహాన్ని ఏర్పరిచి ., ఆయన జీవితచరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి.

అన్నం పెట్టిన మనిషిని గౌరవించడమంటే .... మనల్ని మనం గౌరవించుకోవడమే కదండి..!

14, మే 2021, శుక్రవారం

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం


 


అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా, ప్రస్తుత కరోనా మహమ్మారి ప్రళయ తాండవం చేస్తున్న సందర్భంలో నేను వేసుకున్న చిత్రానికి నా మిత్రులు facebook లో చక్కని పద్య స్పందన ఇచ్చారు.  వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి పద్య రచనలను క్రిందన పొందుపరుస్తున్నాను.


అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మిత్రుల పద్య స్పందన, వారికి నా ధన్యవాదాలు. కరోనా మహమ్మారి నేపధ్యంలో చక్కని పద్యాలు రచించిన కవి మిత్రులకు నా ధన్యవాదాలు.
శ్రీ Purushothamaro Ravela
చంపకమాల:
*************
పవలునురేయిగాదనక ,బాధ్యతలెవ్వియువీడకుండగా
నవనవలాడు నవ్వులను,నాణ్యముగానిటబంచునెప్పుడున్
కువకువలాడు భాషణల,కూటమిగట్టుచు పావురమ్ములై
భువిదిగు దైవదూతలన , భూతలమందున నర్సులేసుమా!
ఉత్పలమాల:
--------------
ప్రాణములెక్కజేయకను,పావులుగానిటసేవజేయుచున్
కోణములెన్నిజూసినను,కోవిదులౌదురు యెందరున్న మీ
దానము ధర్మపున్ గుణము,దాసులుజేయును నెట్టివారలున్
మానముగల్గుభామినులు,మాకడ దేవతలన్న నర్సులే
శ్రీమతి Padmaja Mantrala
ఏ రోగి నీసడింపక
నోరిమితో సేవ సేతురుత్తమ రీతిన్...
తీరున యేమిచ్చుకొనిన?
మీ రుణమది నర్సులార! మీకివె ప్రణతుల్!
(ఈసడించు=అసహ్యించుకొను/కోపించు/నిందించు)
ఆ.వె
చెదరని దర హాస చేమంతులను పంచు
కత్తి పైన సాము వృత్తి తనకు
బ్రదుకు నాస నింపి పరిచర్య గావించు
నాక ముంచు గనుల నర్సు తాను
శ్రీ Venkateswara Prasad
ఆ.వె
చెదరని దర హాస చేమంతులను పంచు
కత్తి పైన సాము వృత్తి తనకు
బ్రదుకు నాస నింపి పరిచర్య గావించు
నాక ముంచు గనుల నర్సు తాను

పలుకుతేనెల తల్లి పవళించెను - గానం కే. శే. KBK Mohan Raju





"పలుకు తేనెల తల్లి పవళించెను" ఇదొక అద్భుతమైన అన్నమయ్య కీర్తన. ఈ కీర్తన పలువురు గాయకులు ఆలపించారు. నా మిత్రులు స్వరీయ KBK మోహన్ రాజు గారు కూడా పాడినట్లు నాకు తెలియదు. వారు పాడిన ఈ కీర్తన వారి కుమార్తె శ్రీమతి ఉషా మోహన్ రాజు నేను చిత్రీకరించిన చిత్రాన్ని జోడించి facebook లో పెట్టారు.

ఆ లింక్ ఈ క్రిందన ఇస్తున్నాను.  విని ఆనందించండి.


ధన్యవాదాలు.


 https://www.facebook.com/kbk.mohanraju/posts/3915024188581772?comment_id=3928328507251340&notif_id=1621012702714403&notif_t=mentions_comment&ref=notif

12, మే 2021, బుధవారం

Florence Nightingale - అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

 


My pencil sketch of Florence Nightingale, the founder of modern nursing.
 

కరోనా నేపథ్యంలో రేయనక పగలనక నిర్విరామంగా పనిచేస్తున్న నర్సమ్మలందరికీ International Nurses Day శుభాకాంక్షలు.

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మే 12న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. వైద్యరంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రజల ఆరోగ్యరక్షణలో నర్సులు అందించిన తోడ్పాటును ఈ దినోత్సవంనాడు గుర్తుచేసుకుంటారు.


ఫ్లోరెన్స్ నైటింగేల్ 1820, మే 12న ఇటలీలో జన్మించింది. 1853న లండన్‌ లోని ఓ స్త్రీల ఆస్పత్రిలో సూపరిండెంట్‌గా చేరిన నైటింగేల్, 1854లో క్రిమియా యుద్ధంలో టర్కీలో గాయపడిన సైనికులకు సేవలు చేయడానికి నర్సుల బృందాన్ని తీసుకొని వెళ్ళింది. 1859లో 'నోట్స్‌ ఆన్‌ నర్సింగ్‌' అనే పుస్తకాన్ని ప్రచురించిన నైటింగేల్‌, ప్రపంచంలోనే మొదటి నర్సుల శిక్షణ కాలేజీని కూడా స్థాపించింది. నైటింగేల్‌ సేవలను గుర్తించిన 'ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నర్సెస్‌' సంస్థ 1965 నుండి నైటింగేల్‌ పుట్టినరోజైన మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించారు.


(Details courtesy : wikipedia)

10, మే 2021, సోమవారం

ప్రముఖ తత్వవేత్త " జిడ్డు కృష్ణమూర్తి "

 

  • ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త 'జిడ్డు కృష్ణమూర్తి; - నా pencil చిత్రం.

ప్రస్తుతం  కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తోంది.   ఈ నేపథ్యంలో వీరు చెప్పిన కొన్ని అక్షర సత్యాలు మనసుకు సాంత్వన కలిగిస్తాయి. చదవండి. 




  • భయపడుతూ ఉన్నవాడే నమ్మకాన్ని నిరంతరం నిలబెట్టుకోవటానికి ప్రయత్నిస్తాడు.

  • మనస్సు, హృదయం నిశ్చలంగా వుంటే ఉత్సాహం లభిస్తుంది.

  • అనుభవించడం జరగగానే అది అనుభూతి అవుతుంది. అంటే గతానికి సంబంధించినది అయిపోతుంది. అది జ్ఞానం క్రింద చలామణి అవుతుంది.

  • అసలైన విప్లవం జరగవలసినది హృదయపు లోతులలో. మనిషిలో సమూలమైన పరివర్తన కలగపోతే ఈ యుద్దాలు, ఈ హింసాకాండ, ఈ విధ్వంసము ఇట్లాగే కొనసాగుతూ వుంటాయి.

  • రాజకీయ, ఆర్ధిక విప్లవాలు కానీ, సామాజిక సంస్కరణలు కానీ ఈ పరివర్తనను తేలేవు. నూతన ఆదర్శాలు, మతాత్మకమైన ఆశయాలు అవలంబించినా, కొత్త సిద్ధాంతాలతో, కొత్త పద్ధతులలో మనిషిని నిర్భందించినా ఇది జరగదు. తనని తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమౌతుంది.

  • ఒక చెట్టునుంచి రాలే ఆకు మృత్యువుకి భయపడుతుందా? ఒక పక్షి మృత్యువుకు భయపడుతూ జీవిస్తుందని అనుకుంటున్నావా? మృత్యువు ఎప్పుడు వస్తే అప్పుడు దానిని అది కలుసుకుంటుంది. అంతేగాని మృత్యువును గురించి ఆందోళన చెందదు. కీటకాలను పట్టుకు తింటూ, గూళ్ళు నిర్మించుకుంటూ, పాటలు పాడుకుంటూ, నిశ్చింతగా జీవించడానికి కుతూహలపడుతుంది. వాటంతట అవి విరామం లేకుండా ఆనందపడుతున్నట్లు కనిపిస్తాయి. వాటికి మృత్యువును గురించి చింతే ఉండదు. మృత్యువు ఆసన్నమైందా, రానీ వాటి పని అవి చేస్తాయి. ముందు ఏంజరుగుతుందో అనే ఆందోళన ఉండదు. క్షణం క్షణం సజీవంగా ఉంటాయి. మనకే, మనుష్యులకే మృత్యువు అంటే భయం. ఎప్పుడూ భయపడుతూంటాం. వృద్ధులు మృత్యువుకు చేరువగా ఉంటారు. యువకులు కూడా దీనికి ఎంతో దూరంలో ఉండరు. మృత్యుభావంతో మనం నిమగ్నులమై ఉంటాం. ఎందుకంటే మనకు బాగా తెలిసిన దాన్నిగాని, సంగ్రహించి పెట్టుకున్న దాన్నిగాని పోగొట్టుకోడానికి భయపడతాం. చేసుకున్న భార్యనుగానీ, భర్తనుగానీ, బిడ్డనుగానీ, స్నేహితునిగానీ పోగొట్టుకోడానికి భయపడతాం. మనం తెలుసుకున్న దానిని పోగొట్టుకోడానికి భయపడతాం. సంపాదించుకున్న దానిని పోగొట్టుకోడానికి భయపడతాం. మనం ప్రోగుచేసుకున్న వాటినన్నిటినీ - మన స్నేహితులను, మన ఆస్తులను, సంపత్తులను, మన గుణాలనూ, శీలాన్ని కూడా తీసుకువెళ్ళగలిగినప్పుడు మనం మృత్యువు అంటే భయపడం. అందుకే మృత్యువు గురించి, దాని తరువాత జీవితాన్ని గురించి, ఎన్నెన్నో సిద్ధాంతాలను సృష్టించుకుంటాం. కానీ అసలు విషయం మృత్యువు అంటే అది అంతం. దీనిని అనుభవించడానికి సమ్మతించం. తెలిసిన దానిని వదలదలచుకోము. కాబట్టి తెలిసినదానికి అంటిపెట్టుకుని ఉండడం వల్ల మనలో భయం కలుగుతూంది. అంతేగానీ తెలియని దానివల్ల కాదు. తెలియని దానిని తెలిసిన దానితో గ్రహించలేం. కానీ మన మనస్సు తెలిసినవాటితో ఉండి "నేను అంతం అయిపోతున్నాను" అన్నప్పుడు భయపడిపోతుంది.

9, మే 2021, ఆదివారం

సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ



మిత్రులు కృష్న దువ్వూరి గారు 'మాతృదినోత్సవం' సందర్భంగా నా చిత్రాలతో చేసిన ఓ చక్కటి వీడియో క్రింది లింక్ క్లిక్ చేసి తిలకించండి.


https://www.facebook.com/100001757057958/videos/4037118923023303/ 


చిత్రం : అమ్మ రాజీనామా (1991)
సాహిత్యం : దాసరి నారాయణరావు 
సంగీతం : చక్రవర్తి 
గానం : కె.జె.జేసుదాసు


సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ

ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో...
ఈ సృష్టినే స్థంభింపచేసే తంత్రాలు ఎన్నో...

సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ

బొట్టు పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి
వయసు ముదిరి వట్టి పోతే గోవు తల్లే కోత కోత

బొట్టు పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి
వయసు ముదిరి వట్టి పోతే గోవు తల్లే కోత కోత

విత్తు నాటి చెట్టు పెంచితే చెట్టు పెరిగి పళ్ళు పంచితే
తిన్న తీపి మరిచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే

లోకమా ఇది న్యాయమా... లోకమా ఇది న్యాయమా

సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ

ఆకు చాటు పిందె ముద్దు
తల్లి చాటు బిడ్డ ముద్దు
బిడ్డ పెరిగి గడ్డమొస్తేకన్నతల్లే అడ్డు అడ్డు

ఆకు చాటు పిందె ముద్దు
తల్లి చాటు బిడ్డ ముద్దు
బిడ్డ పెరిగి గడ్డమొస్తేకన్నతల్లే అడ్డు అడ్డు

ఉగ్గు పోసి ఊసు నేర్పితే
చేయి పట్టి నడక నేర్పితే
పరుగు తీసి పారిపోతే
చేయి మార్చి చిందులేస్తే

లోకమా ఇది న్యాయమా... లోకమా ఇది న్యాయమా

సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ

ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో...
ఈ సృష్టినే స్థంభింపచేసే తంత్రాలు ఎన్నో...

సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ


6, మే 2021, గురువారం

ఆచార్య ఆత్రేయ - శత జయంతి స్మృత్యంజలి. - pencil sketch




 నా రేఖలు గీతల్లో ఆత్రేయ గారి pencil చిత్రం


'మనసు కవి/' ఆచార్య ఆత్రేయ శత జయంతి స్మృత్యంజలి - ఈ సందర్భంగా మిత్రులు డా. ప్రసాద్ కె.వి.యస్ గారు ఈ మహనీయుని గురించి చాలా అద్భుతంగా వివరించారు. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారందించిన వివరాలు నలుగురికీ తెలియాలనే సదుద్దేశ్యంతో యథాతధంగా ఇక్కడ పొందుపరుస్తున్నాను.


పగటికి రేయి - రేయికి పగలు - పలికే వీడ్కోలు
సెగ రేగిన గుండెకు చెబుతున్నా - నీ చెవిన పడితే చాలు
నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు
నను వలచావని తెలిపేలోగా - నివురైపోతాను.
భగ్న ప్రేమకు భాష్యం చెప్తున్న ఈ కవిత్వం అజరామరం.
ఇలాంటి సజీవ భావుకత ఓ కవి అంతరంగ మథనం తో రావాలంటే....మాటలు కాదు.
అనుభవైక భగ్న ప్రేమ నుండి పుట్టింది కనుకనే.....
అది మన గుండెను తాకి....
ఆత్మను పలకరించి...
అవ్యక్తానుభూతినిస్తుంది.
మంగళం పాడు లోని ఆ సందులో ఉన్న మన్మధ బాణం....వీణ... కటాక్ష వీక్షణాలే.....
ఆత్రేయ కలాన కవితా ఝరి అయి ఈ నాటికీ అలరిస్తున్నాయి!
సూర్య చంద్రులు వెలిగేవరకు..
తారలన్నీ మెరిసే వరకు
జాతి మతాలు సమసే వరకు
జన్మలన్నీ ముగిసేవరకు....
కలిసి ఉందామనుకున్న ఆత్రేయ -వీణ ల జంట కు...
కులమూ కులమూ...జాతి జాతి అని గాండ్రించిందా పెద్దతనం...
గుణమే కులమని...నీతే జాతని వాదించిందా యువతరం.
పెద్దరికమే నిలిచి గెలిచింది.
వలపు వాకిట్లోనే నిలిచింది
గడప దాటి ఇంట దీపించనే లేదది.
**********
తమల పాకు పాదాలైనా తాండవ నృత్యం చేయుటలేదా!
పిడికెడు గుండె మనిషికి ఉన్నా కడివెడు ప్రేమను మోయుట లేదా!
కళ్ళకు కాటుక హద్దవుతుందా! కమ్మని కలలను వద్దంటుందా!
తెల్లవారికది మిగిలుంటుందా! వెచ్చని ఎండకు వెన్నెల ఆగుతుందా!
చంద్రుడు కనబడ లేదని వెన్నెల వేరే చోటుకు వెళుతుందా!
మధుపం లేదని మందారం తన మధువును కందిరీగకు అందిస్తుందా!
కట్టుకున్న మేన కోడలు.....పద్మావతి కి న్యాయం చేయలేని జ్వలనం.....ఆయన హృదయం.
ఆ హృదయార్తి లోనుండే అమృత గుళికల్లాంటి పాటల నిధి తెలుగు వారి పెన్నిధిగా మిగిలింది.
ఆద్యంతమూ లేని ..అమరానందమే ప్రేమ
ఏ బంధమూ లేని .. తొలి సంబంధమే ప్రేమ
ప్రేమ దివ్యభావము .. ప్రేమ దైవరూపము
ప్రేమ జీవరాగము .. ప్రేమ జ్ఞానయోగము
మనసున పారే సెలయేరు ప్రేమ
అలసట తీర్చే చిరుగాలి ప్రేమ
హద్దులేవీ లేనిది అందమైన ప్రేమ.
ఆద్యంతాలు లేని ప్రేమ కు నిర్వచనం.
ఎండల్లే వచ్చాడు
మంచల్లే కరిగాను
ఆహా వెన్నెల్లు కురిశాడు
వేడెక్కిపోయాను
ఇది బాధందునా
ఇది హాయందునా
ఏది ఏమైననూ
నే తనదాననూ
తనదాననూ.
ఓ ప్రణయిని విరహపు నిట్టూర్పులు.
గాలిలోనా తేలిపోయే
చీరకట్టిన చిన్నదానా
జిలుగు వెలుగుల చీర శిల్పం
ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగు పాతల బరుగు బ్రతుకుల
నేతగాళ్ళే నేసినారు
చారిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక
తెలుసుకో.
సామాజిక అంతరాల ధిక్కార స్వరం.
అంతా మట్టేనని తెలుసు అదీ ఒక మాయేనని తెలుసు
అంతా మట్టేనని తెలుసు అదీ ఒక మాయేనని తెలుసు
తెలిసీ వలచి విలపించుటలో తియ్యదనం ఎవరికి తెలుసూ.
మాయా మేయమైన దేహికి తప్పని తియ్యని వలపు విలాపం!
*********
ఆచార్య ఆత్రేయ గా పేరొందిన ఆయన అసలు పేరు కిళాంబి వేంకట నరసింహా చార్యులు.
కృష్ణమాచార్యులు & సీతమ్మలకు.... శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా లోని సూళ్ళూరు పేట మండలంలోని...మంగళం పాడులో 7 మే 1921 లో జన్మించారు.....
ఆచార్య ఆత్రేయ గా పేరొందిన ఆయన అసలు పేరు కిళాంబి వేంకట నరసిం హా చార్యులు.
హై స్కూల్ లో చదువుతున్నప్పుడే.....దేవుళ్ళదంతా అన్యాయమే....అని ఓ కవిత వ్రాశాడు.
దేవుళ్ళే న్యాయంగా వ్యవహరిస్తే ఈ లోకం ఎందుకిలా ఉంటుంది? అని నిగ్గదీశాడు పసి వయసులోనే.
8 ఏళ్ళ వయస్సు లోనే.. తల్లి స్వర్గస్తులవడంతో...పెరిగింది మేనమామ జగన్నాథాచార్యుల వారింట.
తండ్రికి...మేనమామ కు...ఇద్దరికీ నాటికలు...నాటకాలంటే మక్కువే. ఆ చర్చలు...చిన్నారి ఆత్రేయను ప్రభావితం చేశాయి.
ఇంటర్ కాగానే....నెల్లూరు లోని కోర్టు గుమస్తా గా చేరి పోయాడాయన. ఆ అనుభవ సారమే.....ఎన్.జి.ఓ.....నాటకం.
ఇంకా...భయం, కప్పలు, ఈ నాడు, పరివర్తన, గౌతమ బుధ్ధ, విశ్వశాంతి & సామ్రాట్ అశోక......గొప్ప నాటకాలు వ్రాశారు.
అనుక్షణం మరణ భయం,
జీవన సమ్రంభణ భయం,
మనిషికి మనిషన్న భయం,
మనసంటే మనసుకే భయం,
సత్యమన్నచో సచ్చే భయం,
చచ్చుదాకా చావు భయం.
భయం....నాటకం కోసం వ్రాసుకున్న ఈ పాట....ఇప్పటి కరోనా పరిస్థితి కి అద్దం పడుతోంది!
*********
దేశ విభజన టైం లో ....ఈ నాడు....అనే మత సామరస్యం ప్రభోధించే నాటకం వ్రాసి...1948 జనవరి 30 న నెల్లూరు లో ప్రదర్శిస్తున్న నాటకంలో....
ఓ హిందూ పాత్ర....ముస్లిం స్నేహితుడికి గాంధీ బొమ్మ ఒకటి బహుమతి ఇస్తాడు....స్వతంత్రం వచ్చిన సంబరంలో.
ఆ నాటకం చివరలో ఓ మతోన్మాది విసిరే కత్తి తగిలి గాంధీ విగ్రహం ముక్కలవుతుంది.
సరిగ్గా అదే రోజు గాంధీ మహాత్ముని పై అలాగే దాడి జరిగి మరణించడం ....
ఆత్రేయ ను మానసికంగా కృంగ తీసింది.
గౌతమ బుధ్ధ...పరివర్తన....నాటకాలు వేస్తున్న కాలంలోనే.....గుడివాడలో అక్కినేని &, దుక్కిపాటి మధుసూధన రావు ల పరిచయం.
కె.ఎస్.ప్రకాశరావు గారు పట్టు పట్టి తన మూవీ దీక్ష(1950) కోసం...మొట్ట మొదటి పాట వ్రాయించుకున్నాడు.
అదే....పోరా బాబు పో...పోయి చూడు లోకం పోకడ.....అనే పాట.
అలా సినీ రంగాన కాలూనిన ఆత్రేయ కు.....సినీరంగం ఇరుకు మనస్తత్వాలు.... కరకుగా తోచింది.
కల్పిత మబ్బులకు....నెమలి నాట్యమాడటం ఎలాంటిదో....సినీ వాతావరణంలో కవిత్వం వ్రాయడం కూడా అంతే అనేవారాయన!
అందుకే.....ఆత్రేయ వ్రాయడానికి....చాలా కాలం తీసుకునేవారు.
వ్రాయకుండా నిర్మాతలను....వ్రాసి ప్రేక్షకులను ఏడిపిస్తాడు ఆత్రేయ అనే అపప్రధను మోస్తూ.....
వ్రాయడానికి ఇక్కడ నేనెంత ఏడిస్తానో...ఎవరికీ తెలియదు మరి అని చమత్కరించేవారు!
***********
ఇక సినీరంగాన....దాదాపు ఆత్రేయ తోనే రంగ ప్రవేశం చేసిన ....కొసరాజు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆరుద్ర, శ్రీ.శ్రీ, మాల్లాది రామకృష్ణ శాస్త్రి లాంటి వారే కాక...
అప్పటికే ఉన్న మహా కవులు....పింగళి, సముద్రాల సీనియర్ & జూనియర్లు....ఎంత మంది ఉన్నారో!
ఇక చిత్ర జగత్తులో....భగ్న కవికి....మనశ్శాంతికి మార్గం.....మదిర.....ఇంకా మగువ.
అందుకే ప్రేమ నగర్ లో డైలాగులు.....అంత గొప్పగా కుదిరాయి!
ఏం తీశాడురా.....ఏం చేశాడురా...అనే వారు ....క్రొత్తగా ఏం వ్రాశాడురా ఆత్రేయ.....అన్నారు మొట్ట మొదటి సారిగా!
మదిర అలవాటు లేని వారు చిత్రసీమలో అరుదు.
ఇక మగువలూ మామూలే.....నిజం చెప్పాలంటే!
వారిలో....ఆత్రేయ మనస్సును గేలం వేసి పట్టుకున్నది....కమల.....నల్ల కలువల్లే మెరిసి పోయేదట.
ముగ్గురు స్త్రీమూర్తులు.....ఆత్రేయ జీవితాన్ని నిర్దేశించారు.
అందని ప్రేయసి వీణ.......
కట్టుకున్న అనాఘ్రాత భార్య పద్మావతి......
పొందులో స్వర్గం చూపుతున్న కమల.....
ఆత్రేయ ఏం వ్రాసినా.......వీరి ముగ్గురి ప్రభావమే!
ఈ వీణకు శృతి లేదు....ఎందరికో హృదయం లేదు....
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే...
అది ఒక ఇదిలే ఆమెకె తగులే....
పాడుతా తియ్యగా చల్లగా...
నా పాట నీనోట పలకాల చిలకా....
ప్రేమ లేదని...ప్రేమించరాదని...
ఎదుట నీవె ఎదలోనా నీవే....
కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు...
విధి చేయు వింతలన్ని మతి లేని చేతలేనని..
మౌనమె నీభాష ఓ మూగ మనసా!....
మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు!
మనసు లేని బ్రతుకొక నరకం..మరువలేని మనసొక నరకం...
మనదొక మధు కలశం..పగిలే వరకే అది నిత్య సుందరం....
నిన్ను మరచి పోవాలని అన్ని విడిచి వెళ్ళాలని...
నీ సుఖమే నే కోరుతున్నా...నిను వీడి అందుకే వెళుతున్నా...
పదహారేళ్ళకు...నీలో నాలో ఆప్రాయం చేసే చిలిపి పనులకు...
*********
చందమామ మోము ....
చారెడేసి కళ్ళు...
దొండపండు పెదవి...
పండునిమ్మ పసిమి....
కడలి అలల కురులు....
కానరాని నడుము....
కన్నె సొగసులని .....
కవులన్నారు....
అవి ...అన్నో...కొన్నో ...
ఉన్న దానను...
అలతి పదాలతో అలవోకగా అలా అలా....చదివితే గద్యం.
పాడితే....చోద్యం! మనోహరం! అద్భుతం!
నిలిచిపోయే....కావ్యం!
కఠిన సమాస భూయిష్టమైన పదాలుండవు.అక్కడే ఆయన విశిష్టత! ప్రజల నోళ్ళలో ఈజీగా నానుతుంది. పాట సూపర్ హిట్ అవుతుంది. అది ఒక్క ఆయనకే చెల్లు!
నీలోని మగసిరి తోటి...
నాలోని సొగసుల పోటి...
వేయించి..నేనే ఓడి పోనీ పొమ్మంటి!
నేనోడి...నీవే గెలిచి....
నీ గెలుపు నాదని తలచి...
రాగాలు రంజిల్లు రోజే రాజీ రమ్మంటి!
శృంగారానికి పరాకాష్ట ఈ చరణాలు.
అర్థం చేసుకుంటే...మనోల్లాసమే!
ప్రాసల తో మామూలుగా ఆడుకునేది ఆరుద్ర గారు.
కానీ ఈ గీతంలో వీరి శృంగార చమత్కారం....ప్రాసలతోనే....శిఖరాగ్రాన్ని అంటింది!
పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు...
పాటలు పాడిన.....చిరుగాలులకు...
తెరచాటొసగిన...చెలులు శిలలకు...
దీవెన జల్లులు చల్లిన అలలకూ....
కోటి దండాలు....శతకోటి దండాలూ...
పదహారేళ్ళ పరువానికి...పరుగులు తీసే యవ్వనానికి...మెరుగులు...ఇంతకంటే ఎవరు దిద్దగలరు!
చీకటి గుహ నీవు...చింతల చెలి నీవు,
నాటకరంగానివే మనసా...తెగిన పతంగానివే....
ఎందుకు వలచేవో...ఎందుకు వగచేవో...
ఎందుకు రగిలేవో...ఏమై మిగిలేవో...
ఎందుకు రగిలేవో...ఏమై మిగిలేవో...
మౌనమె నీ భాష ఓ మూగ మనసా...
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు...
కల్లలు కాగానె...కన్నీరౌతావు...
సగటు మనిషి మనసుకు అద్దం పట్టిన ఈ గీతం ఎవరైనా మరువగలరా!
అందుకే అజరామరంగా నిలిచిందీ పాట.
**********
అన్నీ అందరికీ చేత కావు. ఆయన నిర్మాతగా...దర్శకునిగా...తీసిన ఒకే మూవీ వాగ్ధానం
పెద్దగా ఆడలేదనే చెప్పాలి.
ఘన విజయం మాత్రం కాదు!
పాటలన్నీ హిట్. పాటల రచయితగా...దాశరధిని మొట్టమొదట పరిచయం చేశారు.
నిర్మాత లకు....దర్శకులకు.....ఆత్రేయ....ప్రసూతి వైరాగ్యం రుచి చూపించేవారు!
ఆయనతో పాట రాయించుకోవడానికి దర్శకుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ను పెట్టేవాడు. అతను ఆత్రేయ గారి ఇంటనే కారు షెడ్డు లోనో...ఔట్ హౌస్ లోనో ఉంటూఉండేవాడు రేయింబవళ్ళు...పాట కోసం.
ఓ అర్ధరాత్రి సడన్ గా పాట తీసుకొచ్చి ఆ అసిస్టెంట్ చేతిలో పెట్తే...తెగ సంతోష పడి పోతున్న అతని ఉత్సాహానికి అడ్డు కట్ట వేసేవాడు!
ఆ పాట ఫలానా దర్శకుడిది. దాన్ని అర్జెంటుగా అతనికి డెలివరీ చేసేయ్. నీ పాట రేపో...ఎల్లుండో వ్రాస్తాలే అనేవారట!
ఈ బాధలన్నీ పడలేక...ఇక జన్మలో ఆత్రేయ తో పాటలు వ్రాయించుకోకూడదని నిర్మాత - దర్శకులు అనుకునేంతగా విదిగించేస్తారు!
కానీ ఒకసారి ఆ పాటలు...సినిమా....విడుదలయ్యాక....ఆ రెస్పాన్స్ చూసి....మళ్ళీ మామూలే. మళ్ళీ ఆత్రేయ వెంటే పడేవారు! ఇదేగా ప్రసూతి వైరాగ్యమంటే!
***********
షుమారు 1400లకుపైగా పాటలు రాసి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు.
పాటలన్నీ భావోద్వేగాల సమాహారంగా ఉండటంతో ఆత్రేయను....
మనసు కవి - మన సుకవి గా ప్రేక్షకులు, అభిమానులు అభివర్ణించారు.
ఎంతటి బరువైన భావాలనైనా అర్థవంతమైన తేలికైన పదాలతో పలికించడంతో ఆత్రేయ దిట్ట.
మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూశారు. పాటల్లో తన అనుభవాలను పొదిగి, గుండె బరువును దించుకునే వారు.
మరో వందేళ్ళు కాదు...వెయ్యేళ్ళైనా....ఆత్రేయ మన గుండెల్లో నిలిచిపోయేట్లు...
అజరామరమైన సినీ గీతాలను పూయించి....1989 - సెప్టంబర్ - 13 న అనంతంలో ఐక్యమయ్యారు మనసు కవి.....మన సుకవి......ఆత్రేయ గారు.
ఒకే ఒక్క నంది అవార్డ్ & అంబేద్కర్ యూనివర్సిటీ వారిచ్చిన డాక్టరేట్ మాత్రమే పురస్కారాలు వారికి!
అత్రేయకి నటుడు కొంగర జగ్గయ్య ఆప్తమిత్రుడు.
ఆత్రేయ వ్రాసిన పాటలు, నాటకాలు, నాటికలు, కథలు, కదంబాలు... మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య గారు తన మిత్రుడికి గొప్ప నివాళి సమర్పించారు.
మే - 7 న ఆత్రేయ గారి శత జయంతి.
నిత్య పరిమళం వెదజల్లే గీతాలను వెలయించిన మన మనసు కవి ఆత్రేయ వారికి....
శత జయంతి స్మృత్యంజలి.

పగటికి రేయి - రేయికి పగలు - పలికే వీడ్కోలు

సెగ రేగిన గుండెకు చెబుతున్నా - నీ చెవిన పడితే చాలు
నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు
నను వలచావని తెలిపేలోగా - నివురైపోతాను.
భగ్న ప్రేమకు భాష్యం చెప్తున్న ఈ కవిత్వం అజరామరం.
ఇలాంటి సజీవ భావుకత ఓ కవి అంతరంగ మథనం తో రావాలంటే....మాటలు కాదు.
అనుభవైక భగ్న ప్రేమ నుండి పుట్టింది కనుకనే.....
అది మన గుండెను తాకి....
ఆత్మను పలకరించి...
అవ్యక్తానుభూతినిస్తుంది.
మంగళం పాడు లోని ఆ సందులో ఉన్న మన్మధ బాణం....వీణ... కటాక్ష వీక్షణాలే.....
ఆత్రేయ కలాన కవితా ఝరి అయి ఈ నాటికీ అలరిస్తున్నాయి!
సూర్య చంద్రులు వెలిగేవరకు..
తారలన్నీ మెరిసే వరకు
జాతి మతాలు సమసే వరకు
జన్మలన్నీ ముగిసేవరకు....
కలిసి ఉందామనుకున్న ఆత్రేయ -వీణ ల జంట కు...
కులమూ కులమూ...జాతి జాతి అని గాండ్రించిందా పెద్దతనం...
గుణమే కులమని...నీతే జాతని వాదించిందా యువతరం.
పెద్దరికమే నిలిచి గెలిచింది.
వలపు వాకిట్లోనే నిలిచింది
గడప దాటి ఇంట దీపించనే లేదది.
**********
తమల పాకు పాదాలైనా తాండవ నృత్యం చేయుటలేదా!
పిడికెడు గుండె మనిషికి ఉన్నా కడివెడు ప్రేమను మోయుట లేదా!
కళ్ళకు కాటుక హద్దవుతుందా! కమ్మని కలలను వద్దంటుందా!
తెల్లవారికది మిగిలుంటుందా! వెచ్చని ఎండకు వెన్నెల ఆగుతుందా!
చంద్రుడు కనబడ లేదని వెన్నెల వేరే చోటుకు వెళుతుందా!
మధుపం లేదని మందారం తన మధువును కందిరీగకు అందిస్తుందా!
కట్టుకున్న మేన కోడలు.....పద్మావతి కి న్యాయం చేయలేని జ్వలనం.....ఆయన హృదయం.
ఆ హృదయార్తి లోనుండే అమృత గుళికల్లాంటి పాటల నిధి తెలుగు వారి పెన్నిధిగా మిగిలింది.
ఆద్యంతమూ లేని ..అమరానందమే ప్రేమ
ఏ బంధమూ లేని .. తొలి సంబంధమే ప్రేమ
ప్రేమ దివ్యభావము .. ప్రేమ దైవరూపము
ప్రేమ జీవరాగము .. ప్రేమ జ్ఞానయోగము
మనసున పారే సెలయేరు ప్రేమ
అలసట తీర్చే చిరుగాలి ప్రేమ
హద్దులేవీ లేనిది అందమైన ప్రేమ.
ఆద్యంతాలు లేని ప్రేమ కు నిర్వచనం.
ఎండల్లే వచ్చాడు
మంచల్లే కరిగాను
ఆహా వెన్నెల్లు కురిశాడు
వేడెక్కిపోయాను
ఇది బాధందునా
ఇది హాయందునా
ఏది ఏమైననూ
నే తనదాననూ
తనదాననూ.
ఓ ప్రణయిని విరహపు నిట్టూర్పులు.
గాలిలోనా తేలిపోయే
చీరకట్టిన చిన్నదానా
జిలుగు వెలుగుల చీర శిల్పం
ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగు పాతల బరుగు బ్రతుకుల
నేతగాళ్ళే నేసినారు
చారిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక
తెలుసుకో.
సామాజిక అంతరాల ధిక్కార స్వరం.
అంతా మట్టేనని తెలుసు అదీ ఒక మాయేనని తెలుసు
అంతా మట్టేనని తెలుసు అదీ ఒక మాయేనని తెలుసు
తెలిసీ వలచి విలపించుటలో తియ్యదనం ఎవరికి తెలుసూ.
మాయా మేయమైన దేహికి తప్పని తియ్యని వలపు విలాపం!
*********
ఆచార్య ఆత్రేయ గా పేరొందిన ఆయన అసలు పేరు కిళాంబి వేంకట నరసింహా చార్యులు.
కృష్ణమాచార్యులు & సీతమ్మలకు.... శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా లోని సూళ్ళూరు పేట మండలంలోని...మంగళం పాడులో 7 మే 1921 లో జన్మించారు.....
ఆచార్య ఆత్రేయ గా పేరొందిన ఆయన అసలు పేరు కిళాంబి వేంకట నరసిం హా చార్యులు.
హై స్కూల్ లో చదువుతున్నప్పుడే.....దేవుళ్ళదంతా అన్యాయమే....అని ఓ కవిత వ్రాశాడు.
దేవుళ్ళే న్యాయంగా వ్యవహరిస్తే ఈ లోకం ఎందుకిలా ఉంటుంది? అని నిగ్గదీశాడు పసి వయసులోనే.
8 ఏళ్ళ వయస్సు లోనే.. తల్లి స్వర్గస్తులవడంతో...పెరిగింది మేనమామ జగన్నాథాచార్యుల వారింట.
తండ్రికి...మేనమామ కు...ఇద్దరికీ నాటికలు...నాటకాలంటే మక్కువే. ఆ చర్చలు...చిన్నారి ఆత్రేయను ప్రభావితం చేశాయి.
ఇంటర్ కాగానే....నెల్లూరు లోని కోర్టు గుమస్తా గా చేరి పోయాడాయన. ఆ అనుభవ సారమే.....ఎన్.జి.ఓ.....నాటకం.
ఇంకా...భయం, కప్పలు, ఈ నాడు, పరివర్తన, గౌతమ బుధ్ధ, విశ్వశాంతి & సామ్రాట్ అశోక......గొప్ప నాటకాలు వ్రాశారు.
అనుక్షణం మరణ భయం,
జీవన సమ్రంభణ భయం,
మనిషికి మనిషన్న భయం,
మనసంటే మనసుకే భయం,
సత్యమన్నచో సచ్చే భయం,
చచ్చుదాకా చావు భయం.
భయం....నాటకం కోసం వ్రాసుకున్న ఈ పాట....ఇప్పటి కరోనా పరిస్థితి కి అద్దం పడుతోంది!
*********
దేశ విభజన టైం లో ....ఈ నాడు....అనే మత సామరస్యం ప్రభోధించే నాటకం వ్రాసి...1948 జనవరి 30 న నెల్లూరు లో ప్రదర్శిస్తున్న నాటకంలో....
ఓ హిందూ పాత్ర....ముస్లిం స్నేహితుడికి గాంధీ బొమ్మ ఒకటి బహుమతి ఇస్తాడు....స్వతంత్రం వచ్చిన సంబరంలో.
ఆ నాటకం చివరలో ఓ మతోన్మాది విసిరే కత్తి తగిలి గాంధీ విగ్రహం ముక్కలవుతుంది.
సరిగ్గా అదే రోజు గాంధీ మహాత్ముని పై అలాగే దాడి జరిగి మరణించడం ....
ఆత్రేయ ను మానసికంగా కృంగ తీసింది.
గౌతమ బుధ్ధ...పరివర్తన....నాటకాలు వేస్తున్న కాలంలోనే.....గుడివాడలో అక్కినేని &, దుక్కిపాటి మధుసూధన రావు ల పరిచయం.
కె.ఎస్.ప్రకాశరావు గారు పట్టు పట్టి తన మూవీ దీక్ష(1950) కోసం...మొట్ట మొదటి పాట వ్రాయించుకున్నాడు.
అదే....పోరా బాబు పో...పోయి చూడు లోకం పోకడ.....అనే పాట.
అలా సినీ రంగాన కాలూనిన ఆత్రేయ కు.....సినీరంగం ఇరుకు మనస్తత్వాలు.... కరకుగా తోచింది.
కల్పిత మబ్బులకు....నెమలి నాట్యమాడటం ఎలాంటిదో....సినీ వాతావరణంలో కవిత్వం వ్రాయడం కూడా అంతే అనేవారాయన!
అందుకే.....ఆత్రేయ వ్రాయడానికి....చాలా కాలం తీసుకునేవారు.
వ్రాయకుండా నిర్మాతలను....వ్రాసి ప్రేక్షకులను ఏడిపిస్తాడు ఆత్రేయ అనే అపప్రధను మోస్తూ.....
వ్రాయడానికి ఇక్కడ నేనెంత ఏడిస్తానో...ఎవరికీ తెలియదు మరి అని చమత్కరించేవారు!
***********
ఇక సినీరంగాన....దాదాపు ఆత్రేయ తోనే రంగ ప్రవేశం చేసిన ....కొసరాజు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆరుద్ర, శ్రీ.శ్రీ, మాల్లాది రామకృష్ణ శాస్త్రి లాంటి వారే కాక...
అప్పటికే ఉన్న మహా కవులు....పింగళి, సముద్రాల సీనియర్ & జూనియర్లు....ఎంత మంది ఉన్నారో!
ఇక చిత్ర జగత్తులో....భగ్న కవికి....మనశ్శాంతికి మార్గం.....మదిర.....ఇంకా మగువ.
అందుకే ప్రేమ నగర్ లో డైలాగులు.....అంత గొప్పగా కుదిరాయి!
ఏం తీశాడురా.....ఏం చేశాడురా...అనే వారు ....క్రొత్తగా ఏం వ్రాశాడురా ఆత్రేయ.....అన్నారు మొట్ట మొదటి సారిగా!
మదిర అలవాటు లేని వారు చిత్రసీమలో అరుదు.
ఇక మగువలూ మామూలే.....నిజం చెప్పాలంటే!
వారిలో....ఆత్రేయ మనస్సును గేలం వేసి పట్టుకున్నది....కమల.....నల్ల కలువల్లే మెరిసి పోయేదట.
ముగ్గురు స్త్రీమూర్తులు.....ఆత్రేయ జీవితాన్ని నిర్దేశించారు.
అందని ప్రేయసి వీణ.......
కట్టుకున్న అనాఘ్రాత భార్య పద్మావతి......
పొందులో స్వర్గం చూపుతున్న కమల.....
ఆత్రేయ ఏం వ్రాసినా.......వీరి ముగ్గురి ప్రభావమే!
ఈ వీణకు శృతి లేదు....ఎందరికో హృదయం లేదు....
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే...
అది ఒక ఇదిలే ఆమెకె తగులే....
పాడుతా తియ్యగా చల్లగా...
నా పాట నీనోట పలకాల చిలకా....
ప్రేమ లేదని...ప్రేమించరాదని...
ఎదుట నీవె ఎదలోనా నీవే....
కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు...
విధి చేయు వింతలన్ని మతి లేని చేతలేనని..
మౌనమె నీభాష ఓ మూగ మనసా!....
మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు!
మనసు లేని బ్రతుకొక నరకం..మరువలేని మనసొక నరకం...
మనదొక మధు కలశం..పగిలే వరకే అది నిత్య సుందరం....
నిన్ను మరచి పోవాలని అన్ని విడిచి వెళ్ళాలని...
నీ సుఖమే నే కోరుతున్నా...నిను వీడి అందుకే వెళుతున్నా...
పదహారేళ్ళకు...నీలో నాలో ఆప్రాయం చేసే చిలిపి పనులకు...
*********
చందమామ మోము ....
చారెడేసి కళ్ళు...
దొండపండు పెదవి...
పండునిమ్మ పసిమి....
కడలి అలల కురులు....
కానరాని నడుము....
కన్నె సొగసులని .....
కవులన్నారు....
అవి ...అన్నో...కొన్నో ...
ఉన్న దానను...
అలతి పదాలతో అలవోకగా అలా అలా....చదివితే గద్యం.
పాడితే....చోద్యం! మనోహరం! అద్భుతం!
నిలిచిపోయే....కావ్యం!
కఠిన సమాస భూయిష్టమైన పదాలుండవు.అక్కడే ఆయన విశిష్టత! ప్రజల నోళ్ళలో ఈజీగా నానుతుంది. పాట సూపర్ హిట్ అవుతుంది. అది ఒక్క ఆయనకే చెల్లు!
నీలోని మగసిరి తోటి...
నాలోని సొగసుల పోటి...
వేయించి..నేనే ఓడి పోనీ పొమ్మంటి!
నేనోడి...నీవే గెలిచి....
నీ గెలుపు నాదని తలచి...
రాగాలు రంజిల్లు రోజే రాజీ రమ్మంటి!
శృంగారానికి పరాకాష్ట ఈ చరణాలు.
అర్థం చేసుకుంటే...మనోల్లాసమే!
ప్రాసల తో మామూలుగా ఆడుకునేది ఆరుద్ర గారు.
కానీ ఈ గీతంలో వీరి శృంగార చమత్కారం....ప్రాసలతోనే....శిఖరాగ్రాన్ని అంటింది!
పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు...
పాటలు పాడిన.....చిరుగాలులకు...
తెరచాటొసగిన...చెలులు శిలలకు...
దీవెన జల్లులు చల్లిన అలలకూ....
కోటి దండాలు....శతకోటి దండాలూ...
పదహారేళ్ళ పరువానికి...పరుగులు తీసే యవ్వనానికి...మెరుగులు...ఇంతకంటే ఎవరు దిద్దగలరు!
చీకటి గుహ నీవు...చింతల చెలి నీవు,
నాటకరంగానివే మనసా...తెగిన పతంగానివే....
ఎందుకు వలచేవో...ఎందుకు వగచేవో...
ఎందుకు రగిలేవో...ఏమై మిగిలేవో...
ఎందుకు రగిలేవో...ఏమై మిగిలేవో...
మౌనమె నీ భాష ఓ మూగ మనసా...
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు...
కల్లలు కాగానె...కన్నీరౌతావు...
సగటు మనిషి మనసుకు అద్దం పట్టిన ఈ గీతం ఎవరైనా మరువగలరా!
అందుకే అజరామరంగా నిలిచిందీ పాట.
**********
అన్నీ అందరికీ చేత కావు. ఆయన నిర్మాతగా...దర్శకునిగా...తీసిన ఒకే మూవీ వాగ్ధానం
పెద్దగా ఆడలేదనే చెప్పాలి.
ఘన విజయం మాత్రం కాదు!
పాటలన్నీ హిట్. పాటల రచయితగా...దాశరధిని మొట్టమొదట పరిచయం చేశారు.
నిర్మాత లకు....దర్శకులకు.....ఆత్రేయ....ప్రసూతి వైరాగ్యం రుచి చూపించేవారు!
ఆయనతో పాట రాయించుకోవడానికి దర్శకుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ను పెట్టేవాడు. అతను ఆత్రేయ గారి ఇంటనే కారు షెడ్డు లోనో...ఔట్ హౌస్ లోనో ఉంటూఉండేవాడు రేయింబవళ్ళు...పాట కోసం.
ఓ అర్ధరాత్రి సడన్ గా పాట తీసుకొచ్చి ఆ అసిస్టెంట్ చేతిలో పెట్తే...తెగ సంతోష పడి పోతున్న అతని ఉత్సాహానికి అడ్డు కట్ట వేసేవాడు!
ఆ పాట ఫలానా దర్శకుడిది. దాన్ని అర్జెంటుగా అతనికి డెలివరీ చేసేయ్. నీ పాట రేపో...ఎల్లుండో వ్రాస్తాలే అనేవారట!
ఈ బాధలన్నీ పడలేక...ఇక జన్మలో ఆత్రేయ తో పాటలు వ్రాయించుకోకూడదని నిర్మాత - దర్శకులు అనుకునేంతగా విదిగించేస్తారు!
కానీ ఒకసారి ఆ పాటలు...సినిమా....విడుదలయ్యాక....ఆ రెస్పాన్స్ చూసి....మళ్ళీ మామూలే. మళ్ళీ ఆత్రేయ వెంటే పడేవారు! ఇదేగా ప్రసూతి వైరాగ్యమంటే!
***********
షుమారు 1400లకుపైగా పాటలు రాసి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు.
పాటలన్నీ భావోద్వేగాల సమాహారంగా ఉండటంతో ఆత్రేయను....
మనసు కవి - మన సుకవి గా ప్రేక్షకులు, అభిమానులు అభివర్ణించారు.
ఎంతటి బరువైన భావాలనైనా అర్థవంతమైన తేలికైన పదాలతో పలికించడంతో ఆత్రేయ దిట్ట.
మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూశారు. పాటల్లో తన అనుభవాలను పొదిగి, గుండె బరువును దించుకునే వారు.
మరో వందేళ్ళు కాదు...వెయ్యేళ్ళైనా....ఆత్రేయ మన గుండెల్లో నిలిచిపోయేట్లు...
అజరామరమైన సినీ గీతాలను పూయించి....1989 - సెప్టంబర్ - 13 న అనంతంలో ఐక్యమయ్యారు మనసు కవి.....మన సుకవి......ఆత్రేయ గారు.
ఒకే ఒక్క నంది అవార్డ్ & అంబేద్కర్ యూనివర్సిటీ వారిచ్చిన డాక్టరేట్ మాత్రమే పురస్కారాలు వారికి!
అత్రేయకి నటుడు కొంగర జగ్గయ్య ఆప్తమిత్రుడు.
ఆత్రేయ వ్రాసిన పాటలు, నాటకాలు, నాటికలు, కథలు, కదంబాలు... మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య గారు తన మిత్రుడికి గొప్ప నివాళి సమర్పించారు.
మే - 7 న ఆత్రేయ గారి శత జయంతి.
నిత్య పరిమళం వెదజల్లే గీతాలను వెలయించిన మన మనసు కవి ఆత్రేయ వారికి....
శత జయంతి స్మృత్యంజలి.

(ప్రసాద్ కె.వి.యస్)

నిరీక్షణ

"బొమ్మ నాది భావాలు మీవి" అనే శీర్షికకు  నా ఈ  చిత్రానికి బావుక ఫేస్బుక్ గ్రూప్ లో పలువురు తమ రచనలతో స్పందిస్తున్నారు. పైన ఇచ్చిన చ...