28, ఏప్రిల్ 2023, శుక్రవారం

అబ్బూరి ఛాయాదేవి - రచయిత్రి




అబ్బూరి ఛాయాదేవి (జననం1933 - మరణం 2019) పలు పురస్కారాలు పొందిన ప్రముఖ రచయిత్రి

(Pencil sketch)
మధ్య తరగతి కుటుంబాలలోని స్త్రీలు ఎదుర్కొనే సమస్యల గురించి, పురుషాధిక్యతకు లోబడిన స్త్రీల గురించి చాలా కథలు రాసారు. వీరి కథల్లో బోన్‌సాయ్ బ్రతుకు, ప్రయాణం సుఖాంతం, ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్‌రోజ్ కథలు చాలా ప్రసిద్ధిపొందాయి. ఆడపిల్లల పెంపకంలోను, మగపిల్లల పెంపకంలోను వివక్ష చూపిస్తూ ఆడవాళ్ళ బ్రతుకుల్ని బోన్ సాయ్ చెట్టులా ఎదగనివ్వటం లేదని చెప్పే కథ బోన్ సాయ్ బ్రతుకు. ఈ కథని 2000 సంవత్సరంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది. (సౌజన్యం: వికీపీడియా)
(ఈ చిత్రం ఈ నెల "తెలుగుతల్లి కెనడా" పత్రికలో మూర్తిమంతమాయే శీర్షికలో ప్రచురిచబడింది. పత్రిక యాజమాన్యానికి ధన్యవాదాలు)

ఓహో రాకాసులాల వద్దుసుండి వైరము - అన్నమయ్య కీర్తన

 




ఓవో రాకాసులాల వొద్దు సుండి వైరము
దేవుని శరణనరో తెలుసుకోరో 

జగములో రాముడు జనియించె విష్ణుడదె
అగపడి లక్ష్మి సీతయై పుట్టెను
తగు శేష శంఖ చక్ర దైవసాధనములెల్ల
జిగి లక్ష్మనభరతాంచితశత్రుఘ్నులైరి

సురలు వానరులైరి సూర్యుడు సుగ్రీవుడు
మరిగి రుద్రుడే హనుమంతుడాయెను
సరుస బ్రహ్మదేవుడు జాంబవంతుడైనాడు
వెరవరి నలుడే విశ్వకర్మ సుండి

కట్టిరి సేతువపుడె ఘనులెల్ల దాటిరి
ముట్టిరి లంకానగరము నీదళము
యిట్టె శ్రీవేంకటేశుడితడై రావణుని జంపె 
వొట్టుక వరము లిచ్చీ నొనర దాసులకు


చిత్రం : పొన్నాడ మూర్తి


22, ఏప్రిల్ 2023, శనివారం

కంటిమి నేడిదె గరుడాచలపతి -- అన్నమయ్య కీర్తన


 సింహాచలేశుని చందనోత్సవం సందర్భంగా ఈ వారం అన్నమయ్య కీర్తన : కంటిమి నేడిదె గరుడాచలపతి.


కంటిమి నేడిదె గరుడాచలపతి

ఇంటి వేలుపగు యీశ్వరుండు ||


శ్రీనరసింహుడు చిన్మయకాంతుడు

దానవాంతకుడు దయానిధి

నానా మహిమల నమ్మిన వారిని

పూనుక కాచె పోషకుడితడు ||


దేవాది దేవుడు దినకర తేజుడు

జీవాంత రంగుడు శ్రీవిభుడు

దైవ శిఖామణి తలచిన వారిని

సేవలు గొనికాచె విభుడితడు ||


పరమమూర్తి హరి ప్రహ్లాద వరదుడు

కరుణానిధి బుధకల్పకము

పరగు శ్రీవేంకట పతి తనదాసుల

నరదుగ గాచేయనంతుడితడు ||


చిత్రం : Pvr Murty

15, ఏప్రిల్ 2023, శనివారం

పుడమి నిందరి బట్టెభూతము కడు- | బొడవైన నల్లనిభూతము - - అనమయ్య కీర్తన


 

పుడమి నిందరి బట్టెభూతము కడు- | బొడవైన నల్లనిభూతము -

ఈవారం అన్నమయ్య కీర్తన.

ప|| పుడమి నిందరి బట్టెభూతము కడు- | బొడవైన నల్లనిభూతము ||
చ|| కినిసి వోడమింగెడి భూతము | పునుకవీపు పెద్దభూతము |
కనలి కవియు చీకటిభూతము | పొనుగు సోమపుమోము భూతము ||
చ|| చేటకాళ్ళ మించినభూతము | పోటుదారల పెద్దభూతము |
గాటపుజడల బింకపుభూతము | జూటరినల్లముసుగు భూతము ||
చ|| కెలసి బిత్తలేతిరిగేటి భూతము | పొలుపుదాంట్ల పెద్దభూతము |
బలుపు వేంకటగిరిపై భూతము | పులుగుమీది మహాభూతము ||

భావం: ఇది ఒక పెద్ద భూతము. భువిలో వారు, వీరు అన్న భేదభావం లేకుండా అందరినీ ఆవహించింది. కోపముతో పైబడి పెద్ద ఓడనే అమాంతముగా మింగువేయు భూతమిది. వీపున ఈ పెనుభూతమునకు ఒక ఎముక చిప్ప కలదు. చీకటివలె నల్లనైన ఈ భూతము కోపముతో మీదపడే స్వభావము కలిగి యున్నది. విజృంభించు విక్రమముతో నిండిన ముఖము కలభూతమిది.
ఈ భూతము వెడల్పయిన పెద్ద కాళ్ళతో అతిశయించి యున్నది. ఇది పెద్ద బీరముగల పోటుదారు. దట్టమైన జడలు కలిగి బింకముగల భూతం. ఈ మాయదారి భూతము నల్లని ముసుగు వేసుకున్నది.
ఈ భూతము దిస మొలతో అడ్డమాక తిరుగుచుండును. అవలీలగా ఇటునటు లంఘించు వడిగల భూతమిది. ఇది సమున్నతమైన వెంకటాచలముపై నుండును. ఈ భూతము పక్షిపై నుండును.
ఈకీర్తనలో అన్నమయ్య స్వామిని పెద్ద భూతముతో పోల్చి చెప్పాడు. ఎందుకంటే పరమాత్ముడు దుష్ట శిక్షణార్ధము పెద్ద భూతము చేసే వికృత చేష్టలు చేసాడు. పొడవుగా నల్లగా ఉండటం, ఓడలవంటి పెద్ద పెద్ద వస్తువులు మ్రింగుట, ఎముకచిప్పని వీపుమీద మోసుకోవడం, కోపముతో పై కొనుట, భయంకరమైన ముఖము, చేటలవంటి కాళ్ళు, బిరుసైన జడలు, నల్లనిముసుగు కలిగి యుండుట, దిస మొలతో సంచరించుట, వడివడిగా దాటిపోవుట, కొండలపై నుండుట, పక్షిపై సంచరించుట మున్నగునవన్నీ పెద్ద భూతముల స్వభావాలే అనుట లోక ప్రసిద్ధము. స్వామిని అన్నమయ్య ఏ విధంగానైనా పోల్చుకోగలడు. విమర్శించ గలడు.
(కీ. శే. సాహిత్య శిరోమణి సముద్రాల లక్ష్మయ్య గారి వ్యాఖ్యానం ఆధారంగా.)

11, ఏప్రిల్ 2023, మంగళవారం

C. R. Rao - ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త

C.R.Rao - Pride of Telugu people, pride of Vizag.


భారత సంతతికి చెందిన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణ రావు( Kalyampudi Radhakrishna Rao ) (సీఆర్ రావు)కు ఈ ఏడాదికి గాను స్టాటిస్టిక్స్‌లో అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఇది ఆ రంగంలో నోబెల్‌తో సమానం. (వీరి వయస్సు 102 సంవత్సరాలు) 


(Charcoal pencil sketch)

 

8, ఏప్రిల్ 2023, శనివారం

తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూఁగెఁగన చెల్లుబడినూఁగీని శ్రీరంగశిశువు - అన్నమయ్య కీర్తన


తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూఁగెఁగన చెల్లుబడినూఁగీని శ్రీరంగశిశువు - అన్నమయ్య కీర్తన 


కలికి కావేరి తరగల బాహులతలనే

తలఁగకిటు రంగమధ్యపు తొట్టెల

పలుమారుఁదనునూఁచి పాడఁగానూఁగీని

చిలుపాల సెలవితో శ్రీ రంగ శిశువు


అదివొ కమలజుని తిరువారాధనంబనఁగ

అదనఁ గమలభవాండమనుతొట్టెల

ఉదధులు తరంగములనూఁచఁగా మాఁగీని

చెదరని సిరులతోడ శ్రీ రంగశిశువు


వేదములె చేరులై వెలయంగ శేషుఁడే

పాదుకొను తొట్టెలై పరగఁగాను

శ్రీ దేవితోఁగూడి శ్రీ వేంకటేశుఁడై

సేద దేరెడి వాఁడె శ్రీ రంగశిశువు


శ్రీరంగంలో వెలసిన రంగనాధస్వామిపై అన్నమాచార్యులు చెప్పిన అమరమైన సంకీర్తన ఇది. స్వామిని శ్రీరంగ శిశువని కీర్తిస్తున్నారు. నాలుగు వేదములూ నాలుగు తాళ్ళులాగా కట్టుబడిన వుయ్యాలలో ఆదిశేషుడు తొట్టెగా అమర్చబడిన చక్కటి వూయలలో వూగుతున్నాడు. ఆ చక్కటి నల్లని శిశువు. వాడే శ్రీదేవితో కలిసి వేంకటాద్రిపై సేద తీరుతున్నాడట. ఆ శ్రీరంగ శిశువు కమలభవాండమను (బ్రహ్మాండమను) తొట్టెలో బ్రహ్మాండమైన నీటి తరంగాలలో వూపుతుండగా స్థిరమైన సిరులతో వూగుతున్నాడట.


భావామృతం:-


పూర్వం ఒక మఱ్ఱి ఆకు తొట్టెవలె భాసించి దానిపై శ్రీరంగనాధస్వామి శిశువు వలె వూగినాడు కదా! అట్లు చెల్లుబడియైన ఆ మహానుభావుని కీర్తించెదము.


కావేరీనది కలికివలె (యువతివలె) బాహులతలవంటి తన తరంగములపై నదీ మధ్యమంలో అమర్చబడిన వేదిక అనే తొట్టెలో ఈ శ్రీరంగ శిశువు వూగుచున్నాడు. తనను చూచి అనేక కీర్తనలు పాడుచుండగా, చిలుపాల సెలవితో (చిక్కగా మరగబెట్టిన పాలచారికలు మూతిపై గల) శ్రీరంగ శిశువు వూగుచున్నాడు.


(సేకరణ)


చిత్రం : Pvr Murty

4, ఏప్రిల్ 2023, మంగళవారం

తెర వెనుక కథలు... ఒక అద్భుత హిందీ పాట


 

"Behind the scenes.." తెర వెనుక కథలు (1)


"He rom rom mein basane waale raam. Jagata ke swaamee, he antayraamee, main tuz se kyaa maangoo." పాట కథ.


"Neel Kamal"  చిత్రంలో కథానాయిక వహీదా రెహమాన్ పై ఓ సన్నివేశంలో  ఓ పాట చిత్రీకరించాలి, అది కూడా శ్రీరాముని ఉద్దేశించి. మరి పాట ఎవరు రాయాలి. దర్శకుడు రామ్ మహేశ్వరి ఈ సన్నివేశానికి సాహిర్ లూధియాన్వి సమర్ధుడు అని తోచింది. కానీ సాహిర్ నాస్తికుడు. అయినా ఆయన్ని సంప్రదించారు. "నాకు రామాయణం గురించి ఏమీ తెలియదు. నేను ఎలా రాయగలను" ఈ పాట అని తన అసమర్ధతను చెప్పుకున్నాడు సాహిర్. " నాకు మీ మీద నమ్మకం ఉంది. మంచి భావజాలంతో రాయగల సమర్థులు మీరే" అన్నాడు రామ్ మహేశ్వరి. కాదనలేక "నాకు , రెండు రోజులు సమయం ఇవ్వండి" అని అడిగాడు సాహిర్. వెంటనే రామాయణ భారతాలు బాగా తెలిసిన తన స్నేహితుని సంప్రదించాడు. తత్ఫలితంగా  "హే రోమ్ రోమ్ మే బస్నే వాలే రామ్" అనే పాట రాశాడు.  దర్శక నిర్మాతలకు ఈ పాట చాలా నచ్చేసింది. సంగీత దర్శకుడు రవి స్వరపరిచిన ఈ పాటని దర్శకుడు రామ్ మహేశ్వరి  అద్భుతంగా చిత్రీకరించారు. సినిమా, ఆశా భోంస్లే పాడిన ఈ పాట రెండూ సూపర్ హిట్. 


దూరదర్శన్ "రంగోలి" కార్యక్రమం ద్వారా ఈ ఆసక్తికర విషయం తెలుసుకున్నాను.

2, ఏప్రిల్ 2023, ఆదివారం

అబ్బూరి ఛాయాదేవి - రచయిత్రి (pencil sketch)


Pencil sketch


అబ్బూరి ఛాయాదేవి (అక్టోబరు 131933 - జూన్ 282019తెలుగు కథా రచయిత్రి, స్త్రీవాద రచయిత. మె భర్త అబ్బూరి వరదరాజేశ్వరరావు కూడా తెలుగు రచయిత.


ఛాయాదేవి రాజమహేంద్రవరంలో1933 అక్టోబరు 13 లో సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 1951-53 మధ్య నిజాం కళాశాల నుండి ఎం.ఏ. చదివారు. 1953లో కాలేజీ మాగజైన్ లో ప్రచురించిన అనుభూతి వీరి మొదటి కథ. అప్పటి నుంచి ఛాయాదేవి గారు చాలా వరకు మధ్య తరగతి కుటుంబాలలోని స్త్రీలు ఎదుర్కొనే సమస్యల గురించి, పురుషాధిక్యతకు లోబడిన స్త్రీల గురించి చాలా కథలు రాసారు. కొన్ని కథలు హిందీతమిళమరాఠికన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి. వీరి కథల్లో బోన్‌సాయ్ బ్రతుకు, ప్రయాణం సుఖాంతం, ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్‌రోజ్ కథలు చాలా ప్రసిద్ధిపొందాయి. ఆడపిల్లల పెంపకంలోను, మగపిల్లల పెంపకంలోను వివక్ష చూపిస్తూ ఆడవాళ్ళ బ్రతుకుల్ని బోన్ సాయ్ చెట్టులా ఎదగనివ్వటం లేదని చెప్పే కథ బోన్ సాయ్ బ్రతుకు. ఈ కథని 2000 సంవత్సరంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది. సుఖాంతం అనే కథ నేషనల్ బుక్ ట్రస్ట్ వారి కథాభారతి అనే సంకలనంలో 1972లో ప్రచురించబడింది.

ఛాయాదేవి వృత్తిరీత్యా న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో డిప్యూటీ లైబ్రేరియన్ గా పనిచేసి 1982లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు.

1993లో వాసిరెడ్డి రంగనాయకమ్మ సాహిత్య పురస్కారం, 1996లో మృత్యుంజయ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నారు. 2000 సంవత్సరంలో కళాసాగర్ పందిరి సాహితీ పురస్కారాలు అందుకున్నారు. 2005 సంవత్సరంలో తనమార్గం అనే కథాసంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నది.


సౌజన్యం : వికీపీడియా

 

యామిజాల పద్మనాభస్వామి - బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు

నా పెన్సిల్ చిత్రం - (స్పష్టత లేని పురాతన  ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం) యామిజాల పద్మనాభస్వామి  బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితు...