11, మార్చి 2014, మంగళవారం

మిత్రులు Nandiraju Radhakrishna గారి ఈ క్రింది పోస్ట్ చదివాక ఇలా సరదాగా బొమ్మ వేసుకోవాలనిపించింది. వారికి నా ధన్యవాదాలు.

జననం తరువాత మూడురోజుల బాలారిష్ట దశ దాటి 11 రోజులకు లేదా 21 రోజుకు కాని నామకరణం చెయ్యరు సామాన్యంగా. తరువాత అన్నప్రాశన.. ఆపై అక్షరాభ్యాసం వగైరా తంతులన్నీ .. కాని తెలుగునేలపై పుట్టని పార్టీకి ఈ రోజే పెరెట్టేశారు. రేపు గోదావరి ఒడ్డున పురుడుపోసుకుంటుంది-ట.

1983 తరువాత నాదెండ్ల్ భాస్కర రావు, లక్ష్మిపార్వతి, ఎమ్‌వి భాస్కరరావు, హరికృష్ణ, విజయశాంతి, దేవెందర్‌గౌడ్, చిరంజీవి, పాల్... పార్టీలు పెట్టి పల్టీలు కొట్టారు. దుకాణాలు బంద్. అదృశ్యాలు, విలీనాలు, గల్లంతులు, నిమజ్జనాలు పూర్తయ్యయి. ఇవిగాక అనేకానేక పార్టీలు ఆవిర్భవించాయి. మఖలో పుట్టి పుబ్బలో మబ్బుల్లో కలిసిపోయాయి. ఈ కొత్త సంబరమూ చూద్దాం!!

మాజీలందరూ తాజాగా తెరమీదకు వచ్చారు. పార్టీ రంగేమిటో తెలీదు. హంగుమాత్రం ముందే ఉంది. సభ్యులతో పని లేకుండా వ్యవస్థాపక అధ్యక్షుడు, అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి తెరమీదకు వచ్చేశారు. అదేంటో! రాజమండ్రి సెంటిమెంటు??

కామెంట్‌లు లేవు:

రాగ మాలిక - కథ

 మీ చిత్రం - నా కథ. రాగమాలిక రచన: మాలా కుమార్ మాలిక  కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి డ్రాయింగ్ రూం అంతా నీట్ గా సద్ది ఉంది. అమ్మ వంటింట్లో హడ...