25, జూన్ 2019, మంగళవారం

నీ వలపుల మాటలలో .. కవిత



నా చిత్రానికి శ్రీమతి పుచ్చా గాయత్రీ దేవి గారి కవిత


నీ వలపుల మాటలలో నేను తడిసిపోతున్న 

తేలికబడి మేఘమువలె కదిలిపోతూ నేఉన్నా.
అందమైన ఆంక్షలే నీకు నాకు సారధిగా.
గగనాన హరివిల్లె మన మధ్యన వారధిగా.

జతకూడిన కోకిలమ్మ మౌనమే తన భాషగా
కరబంధన దండలే అమరెను దరి చేర్పుగా.
చిగురించే కొత్త ఆశ మొలకొచ్చిన విత్తులా.
మన జీవన వాహినిలో సరి కొత్త సంగతిగా.

కనబడని మదనుడే నీ నవ్వుల శరము వేసే
జపియిస్తూ నీ పేరే మరో బ్రహ్మ అస్త్రముల.
చెలియలికట్టలే దాటినా ఈ ఆనందపు తరుణములో
అంబరమే అవధిగా సాగుదామా ఎచటికో.......
పి. గాయత్రిదేవి.. 

కామెంట్‌లు లేవు:

యామిజాల పద్మనాభస్వామి - బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు

నా పెన్సిల్ చిత్రం - (స్పష్టత లేని పురాతన  ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం) యామిజాల పద్మనాభస్వామి  బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితు...