12, నవంబర్ 2022, శనివారం

కరి పద్మనాభాచార్యులు - ప్రముఖ నాటక కర్త


కరి పద్మనాభాచార్యులు Pencil sketch


నట కొలనులో వికసించిన 'పద్మం' శ్రీమాన్ కరి పద్మనాభాచార్యులు, Pride of Visakhapatnam.
'కొండ అద్దమందు కొంచమై ఉండదా' అని వేమన చెప్పినట్టు సమాజంలో ఎందరో లబ్దప్రతిష్టులు, ప్రతిభావంతులు అతి సామాన్యులుగానే దర్శనమిస్తారు. వారిని పలుకరించి, అనుభవాలు, జ్ఞాపకాల దొంతరలు కదిపితే కానీ వారి విశ్వరూపం మనకు అవగతం కాదు. అలాంటి ప్రతిభామూర్తి 'పద్మం' అని సన్నిహితులు పిలుచుకొనే కరి పద్మనాభాచార్యులు, ప్రచారార్భాటాలకు దూరంగా, తను ఆరాధించే నాటకరంగానికి పరిపూర్ణంగా అంకితమైన కొద్దిమందిలో ఒకరు. (ఆంధ్రజ్యోతి దినపత్రికలో వీరి గురించి రాసిన ముందుమాటలు).
శ్రీమాన్ కరి పద్మనాభాచార్యులు Visakhapatnam Port Trust లో పనిచేసిన విశ్రాంత ఉద్యోగి, బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రసిధ్ధ నాటక, సినీ నటులు జె. వి. సోమయాజులు దర్శకత్వంలో, గురజాడ అప్పారావు 'కన్యాశుల్కం' లో పలుపర్యాయాలు అగ్నిహోత్రావధానులుగా అవతారమెత్తారు. ఈ నాటకం వీరి జీవితంలో అంతర్భాగమైపోయింది. ఉద్యోగం చేసుకుంటూనే పలు చోట్ల కన్యాశుల్కంతో పాటు ఇంకా ఎన్నో దేశవ్యాప్తంగా ఎన్నో నాటక ప్రదర్శనలు ఇచ్చారు. పలు పురస్కారాలు పొందారు.
ఇటీవల వీరి తొంభయ్యవ పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నంలో తన నాటక ప్రస్థానంలో తోడుగా నిలిచిన నలభైమందిని పద్మనాభాచార్యులు సత్కరించుకున్నారు.
ఈ సందర్భంగా వారి చిత్రపటం నా pencil తో చిత్రీకరించి వారికే సమర్పించుకునే భాగ్యం కలిగింది. చిత్రకారునిగా వారిచే సత్కరించబడి, ఓ జ్ఞాపికను వారి చేతులు మీదుగా పొందడం నేను చేసుకున్న అదృష్టం.
 

కామెంట్‌లు లేవు:

నీతోడుతొ జీవితాన్ని గడపనివ్వు ఇలాగే ౹౹ మదినేలే రాణివలే గెలవనివ్వు ఇలాగే ౹౹ - గజల్

Pvr Murty బాబాయ్ గారి చిత్రానికి చిన్న ప్రయత్నం... నీతోడుతొ జీవితాన్ని గడపనివ్వు ఇలాగే ౹౹ మదినేలే రాణివలే గెలవనివ్వు ఇలాగే ౹౹ ఆలోచన అంతులేన...