28, సెప్టెంబర్ 2016, బుధవారం

మహాకవి జాషువా - పెన్సిల్ చిత్రం - Jashuva - Pencil sketch

నేడు మహాకవి గుర్రం జాషువా గారి జయంతి. నా పెన్సిల్ చిత్రం ద్వారా వారికి నా నివాళి.
ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా (సెప్టెంబర్ 28, 1895 - జూలై 24, 1971). సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు. (వికీపీడియా)

ఈ సందర్భంగా 'ఈమాట' అంతర్జాల పత్రికలో వచ్చిన ఈ వ్యాసం చదివి జాషువా గారి కొన్ని మచ్చుతునక పద్యాలు చదువుదాం, ఘంటసాల గారు వాటిని స్వరపరచి ఎంత అద్భుతంగా గానం చేసారో విని తరిద్దాం. దయచేసి ఈ క్రింది లింకు క్లిక్ చెయ్యండి. ఇంత చక్కని వ్యాసం అందించిన శ్రీ విష్ణుభొట్ల లక్ష్మన్న గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

http://eemaata.com/em/issues/200909/1464.html


కామెంట్‌లు లేవు:

జన్మల వరమై..పుడితివి కదరా..! గజల్

  కృత్రిమ మేధ సహకారంతో రంగుల్లో రూపు దిద్దుకున్న నా పెన్సిల్ చిత్రం. ఈ చిత్రానికి మిత్రులు,  ప్రముఖ గజల్ రచయిత ‌‌శ్రీ  మాధవరావు కొరుప్రోలు గ...