16, జులై 2018, సోమవారం

అద్భుత గాయని - కె. రాణి (ఉషారాణి)

అద్భుత గాయని -  కె. రాణి (ఉషారాణి) - నా పెన్సిల్ చిత్రం

*ఎన్ని టేకులు తింటున్నావమ్మా....ఎందుకని ఈ రోజు సరిగ్గా పాడలేకపోతున్నావు!?* అంటూ సంగీత దర్శకుడు సుబ్బురామన్ గారు గట్టిగా అడిగేసరికి...10ఏళ్ళ ఆ అమ్మాయికి ఏడుపొచ్చినంత పనయ్యింది.*
*నిన్న అంతా భ్రాంతియేనా*....బాగా పాడావు. ఇప్పుడీ పాటకెందుకు...ఇలా...అంటూ ఉంటే....అప్పుడు చెప్పింది....*నాకు ఘంటసాల గారిని చూస్తుంటే....భయమేస్తుందండి. నేను పాడలేకపోతున్నాను!* అంటూ.*
*చూడూ...ఘంటసాల గారేం పులి కాదు....నిన్ను మింగెయ్యరు! ఈ సారి సరిగ్గా పాడకపోతే...నీ తల పైన తిరగకుండా ఉందే ...ఆ ఫాన్ ...దానిని ఊడదీసి...నీ మీద వేసేస్తాను...జాగ్రత్త!* అంటూ గదిమారు సుబ్బురామన్ గారు!*
*ఈ సారి బాగా పాడింది. చెలియలేదు...చెలిమి లేదు..వెలుతురే లేదు...అనే డ్యూయెట్ సాంగ్.*
*నిండా పదేళ్ళు లేని చిన్న పిల్ల ....మరి ఘంటసాల గారిని చూస్తే ...భయపడదా!
*అది ఓ పాఠం గా తీసుకుంది ఆ చిన్నారి గాయని కె.రాణి. (అసలు పేరు ఉషారాణి) ఇక ఎవ్వరినీ చూసి భయపడకూడదు. నాకు వచ్చినంతవరకు..నా డ్యూటీ లాగా పాడెయ్యాలి అని...నిర్ణయైంచుకుంది.
ఇక ఎప్పుడూ....మైక్ ముందు కానీ....ఘంటసాల తో కచేరీలలో గానీ...భయానికి...తావివ్వలేదిక!*
*కడప లో సెటిల్ అవడం వల్లో ఏమోగానీ...రాణి కి జంకు పోయింది. పాటల రికార్డింగ్ అప్పుడు....విరామ సమయంలో మెయిన్ సింగర్స్ కు ఓవల్టిన్లు....కోరస్ పాడే అమ్మాయిలకు టీ ఇచ్చేవారట! *తెస్తే..అందరికీ ఓవల్టిన్లు తీసుకురండి...లేకపోతే అసలక్కరలేదని...తిప్పిపంపేసి...అందరికీ ఓవల్టిన్లు తెప్పించేది!*
*అలాగే...విజయా గార్డెన్స్ లో గులాబీలు బాగా పూచేవి. ఓ రోజు 7 గురు అమ్మాయిలున్నారు ...రికార్డింగ్ కోసమని. 7 గులాబీలు తెంచి...తలా ఒకటి ఇచ్చేసింది. * ఎవరిని అడిగి కోసవే సీమటపాకాయ్* అని గార్డెన్ నిర్వాహకులు ..నిలదీస్తే....*ఎవరిని అడగాలి ? పూలుండేది ఆడపిల్లల కోసమే కదా! కోశాను. ఇచ్చాను. ఐ డోంట్ కేర్.* అంటూ రెక్లెస్ గా సమాధానమిచ్చేది...అందర్లోకి చిన్నపిల్ల అయిన రాణి.*
*1943 లోకర్ణాటక లోని తుముకూరు లో పుట్టిన రాణి....తండ్రి రైల్వే ఆఫీసర్ కావడం చేత....ఉత్తర హిందూస్థానం నుండి...దక్షిణ హిందూస్థానమంతా...తిరగవలసివచ్చింది. అదీ ఒకందుకు మేలయ్యింది. ఆయా రాష్ట్ర భాషలు....నేర్చుకోగలిగింది. అందుకే తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ, సిం హళ & ఉజ్బెక్ భాషలలో షుమారు 500 పాటలు పాడగలిగింది.*
*సిం హళ జాతీయగీతం.....మెయిన్ సింగర్ గా కె.రాణే గానం చేసింది. 1950లలో ఎక్కువగా...రావు బాలసరస్వతి గారు, జిక్కి & లీల గార్లు పాడేవారు. వారితో కంపేర్ చేస్తే.....రాణి ...చిన్న పిల్ల. శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదు. ఏదో దైవదత్తమైన కంఠస్వరముంది. ఇక సంగీత స్రష్టలు ఎం.ఎల్.వసంత కుమారి గారు, ఎ.పి.కోమల గార్లు ఉండనే ఉన్నారు. వీరితో పోటీ పడటమంటే....సామాన్యం కాదు కదా!*
*మాంచి ఘాటు పాటలు...రాణి బాగా పాడుతుంది*....అనేవారట ఘంటసాల గారు. *మిరపకాయ్* అని పిలిచేవారట!
*1952 లో ధర్మదేవత...తెలుగులో...తమిళం లో కూడా 3 పాటలు పాడింది. సావిత్రి నటించిన రూపవతి లో 2 పాటలు పేరు తెచ్చాయి. అన్నిటికంటే....ఇప్పటికీ....చిరస్థాయిగా నిలిచిన పాట....*అంతా భ్రాంతియేనా...దేవదాసు లోది. ఇక ఓ...దేవదా ....పాట వలన జిక్కి గారికి మనస్తాపం కలిగిన విషయం...మీకు తెలిసే ఉంటుంది. పాటంతా జిక్కి & రావు బాలసరస్వతు లతో పాడించి....ఒక్క హమ్మింగ్ మాత్రం.....ఓహొ హొ...ఓహో...అనే హమ్మింగ్ మాత్రం...కె.రాణి తో పాడించి...అలాగే చిత్రీకరించినా...టైటిల్స్ లో జిక్కి గారి పేరు వేయలేదు. రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదు! మరి మతలబు ఏమిటో చిన్న పిల్ల రాణి కేం తెలుస్తుంది.
*ఘంటసాల అంతటి వారికే తప్పలేదు. పాండురంగ మహాత్యం లో ఘంటసాల గారి పాటలు ఎంత పాపులరో అందరికీ తెలుసు. జయకృష్ణా ముకుందా మురారి, అమ్మా అని అరచినా పాటలు మరెవ్వరైనా పాడగలరా! టైటిల్స్ లో పొరబాటున...ఘంటసాల వారి పేరు వేయడం మరచిపోయారు! * పరవాలేదు....నా గొంతు ప్రజలకు తెలుసులెండి బాబు. నాపేరు లేకపోయినా పరవాలేదు!* అన్నారట మాస్టారు. నందమూరి క్షమాపణ కూడా చెప్పారట.*
*గొంతు ఎంత బాగున్నా....క్రమేణా...సంగీతదర్శకులకు....అనుగుణంగానే కాక...వాయిస్ ను....మెరుగు పరుచుకుంటూ పోవడంలో పి.సుశీల గారు, ఎస్.జానకి గారు ప్రఖ్యాతి గాంచి....ఇక వారి యుగం ప్రారంభమయ్యింది 1960ల నుండి.*
*కె.రాణి గారు...ఎక్కువగా తమిళం లోను, కన్నడ లోనే పాడారు. మద్రాస్ లో షిప్పింగ్ వ్యాపారస్తులు తమిళ ముస్లింస్ హనీఫా వారు కచేరీలు ఏర్పాట చేసేవారు. ఘంటసాల, తలత్ మహమూద్, ముఖేష్....లాంటి వారితో కలిసి....ఎన్నో కచేరీలు చేసేది రాణి. ఎక్కువ పాటలు రాణి చేతే పాడించేవారట ఘంటసాల వారు.*
*అలాంటి ఓ కచేరీలో...ఓ మైనే ప్యార్ కియా(జిస్ దేస్ మే గంగా బెహ్తీ హై), మై క్యాకరూరా ముఝే బుఢ్ఢా మిల్ గయా(సంగం) పాటలు రాణి పాడినప్పుడు...రాజ్ కపూర్ డప్పు వాయించడం...ఓ మరచిపోలేని జ్ఞాపకం కె.రాణి గారికి.*
*1966 లో జి.సీతారామిరెడ్డి గారితో వివాహం...కడపలో సెటిల్ అయ్యారు. హైదరాబాద్ లోని షమా థియేటర్ వద్ద....ఓ స్టూడియో ..సదరన్ స్టూడియో ఉండేది. అది వీరిదే. సతీ అరుంధతి(1968) & నిజంచెపితే నమ్మరు లాంటి మూవీస్ తీశారు. 1975 లో రెడ్డి గారు స్వర్గస్తులయ్యారు. ఆ వైభవాలు...ఆయనతోనే...అంతరించాయట!*
* ఇద్దరు కుమార్తెలు. ఒకరు హైదరాబాద్ లో...మరొకరు బెంగలూర్ లో సెటిల్ అయితే ...రాణి గారు షటిల్ సర్వీస్ చేస్తుండేవారు. పాడటం ఎప్పుడో మానుకున్నాను. ప్రశాంతంగా జీవితం గడుపుతున్న...రాణి గారు నిన్న 13 జూలైన (75 ఏళ్ళు) కాలధర్మం చెందారు.*
*ఇప్పటి పాటల గురించి అడిగితే....వాయిద్య ఘోష ఎక్కువయ్యింది. పాటలలో క్లారిటీ ఉండడం లేదు. అసలు అర్థం కావడంలేదని...అమూల్య మైన అభిప్రాయం చెప్పారు!*
*అంతా భ్రాంతియేనా...జీవితానా వెలుగింతేనా......పాట మాత్రం చిరస్థాయిగా మిగిలిపోయింది!
(ఈ వివరాలు facebook లో అందించిన మిత్రులు శ్రీ Prasad Kvs గారికి ధన్యవాదాలు)




కామెంట్‌లు లేవు:

"మహామహోపాధ్యాయ" తాతా సుబ్బరాయశాస్త్రి

తాతా సుబ్బరాయశాస్త్రి - charcoal pencil sketch  ఈనాడు నా పెన్సిల్ తో చిత్రీకరించుకున్న చిత్రం. ఈ మహానీయుని గురించి వివరాలు క్రింది లింకు క్ల...