16, జనవరి 2019, బుధవారం

మహాకవి గుర్రం జాషువ

9+


జతగూడిన ఇరు తనువులు  :
సాహిత్యానికి తగ్గ సంగీతం, సంగీతానికి దీటైన సాహిత్యం రెండూ పోటాపోటీలుగా కలవటం అరుదైన విషయం. మహాకవి గుర్రం జాషువా రచించిన నాలుగు పాపాయి పద్యాలను సంగీత దర్శకుడు, ఆంధ్రుల అమర గాయకుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు నాలుగు విభిన్న రాగాల్లో స్వరపరచి గానం చెయ్యటం తెలుగువారి అరుదైన అదృష్టమే. అప్పుడే పుట్టిన పాపాయిపై ఇంత రసాత్మకంగా కట్టిన పద్యాలు బహుశా తెలుగు.లో మరింక లేవేమో!
పాపాయి పద్యాలు
“అక్షయంబైన మాతృక్షీర మధుధార లన్నంబుగా తెచ్చుకొన్న యతిథీ ” అన్నది ఎంత అందమైన భావన. మనం రోజూ చూసే సామాన్యమైన విషయాల్లోంచి అందమైన కవిత్వాన్ని సృష్టిస్తాడు కవి. జాషువా చేసింది అదే! “అమృతమ్ము విషమను వ్యత్యాస మెరుగ కాస్వాదింప చను వెర్రిబాగులాడు” అని కానీ ” ఎవ్వరెరుంగ రితని దేదేశమో గాని, మొన్న మొన్న నిలకు మొలిచినాడు” అని కానీ అప్పుడే పుట్టిన పాపాయిని వర్ణించడం గొప్ప కవులు మాత్రమే చెయ్యగలరు. తల్లికి పిల్లలపై ఉన్న ప్రేమ గురించి గొప్ప కవులు ఆర్ద్రతతో ఎంతో సాహిత్యం సృష్టించారు కానీ, “అమ్మతో తనకెంత సంబంధమున్నదో, ఏడ్చి యూడిగము సేయించుకొనును” వంటి భావంతో తల్లి-బిడ్డల బంధాన్ని ఇంత చక్కగా వర్ణించటం జాషువా గారికే చెల్లింది.
ఈ పాపాయి పద్యాలలో ఇంత మంచి సాహిత్య సృష్టి జరిగింది. కానీ, ఆ సాహిత్యాన్ని అనుభవించి, పలవరించకపోతే అద్భుతమైన సంగీత సృష్టి అసాధ్యం. ఆ పని చేసి ఘంటసాల ఈ పద్యాలకు చిరాయువు కల్పించాడు. సంగీతాన్ని శాస్రీయంగా అభ్యసించిన అందరూ పద్యాలకు ఇంత అందంగా బాణీలు కట్టలేరు. అసలు సాహిత్యాన్ని చూడగానే (అందులో పద్యాలకి మరీను) ఇలా బాణీ కట్టాలని సంగీతకారుడుకి ఎలా తెలుస్తుందో!
(నాయనా! పురిటింటి తెరువరి! కులజ్యోతి! నీకు దీర్ఘాయువురా!)
నవమాసములు భోజనము నీరమెరుగక,
పయనించు పురిటింటి బాటసారి
చిక్కు చీకటి చిమ్ము జానెడు పొట్టలో,
నిద్రించి లేచిన నిర్గుణుండు
నును చెక్కిళుల బోసినోటి నవ్వులలోన,.
ముద్దులు చిత్రించు మోహనుండు
అక్షయంబైన మాతృక్షీర మధుధార
లన్నంబుగా తెచ్చుకొన్న యతిథీ
బట్ట కట్టడు, బిడియాన బట్టువడడు,
ధారుణీ పాఠశాలలో చేరినాడు, (కానీ)
వారమాయెనో లేదో మా ప్రకృతి కాంత
కరపి యున్నది వీని కాకలియు నిద్ర!
*సేకరణ చేసిన మిత్రులు శాయి గారికి కృతజ్ఞతలు.

కామెంట్‌లు లేవు:

యామిజాల పద్మనాభస్వామి - బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు

నా పెన్సిల్ చిత్రం - (స్పష్టత లేని పురాతన  ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం) యామిజాల పద్మనాభస్వామి  బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితు...