31, ఆగస్టు 2020, సోమవారం

రంగస్థల ఘనాపాటి పీసపాటి నరసింహమూర్తి

 




శ్రీ పీసపాటి నరసింహమూర్తి గారు(1920 -2007) ప్రముఖ రంగస్థల నటుడు. తెలుగు నాటకరంగంపై శ్రీ కృష్ణుడుగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్న నటుడు.పద్యగానంలో తనకంటూ ఒక ఒరవడిని సృష్టించుకున్న నటుడు. శ్రీ పీసపాటి నరసింహమూర్తి గారు, విజయనగరం జిల్లా, బలిజపేట మండలం, వంతరం అనే గ్రామంలో 1920 జూలై 10 న జన్మించారు.


చాలా చిన్నప్పుడే నేను వీరి పేరు వినడమే కాకుండా వారు ప్రదర్శించిన నాటకం కూడా వీక్షించే అవకాశం లభించింది. చిత్రకారునిగా నేను ఎందరో ప్రముఖుల చిత్రాలను నా pencil తో చిత్రీకరించే అవకాశం లభించింది. అలాగే వీరి చిత్రం కూడా వేయాలని అనుకుంటుండగా నాకు వీరి కుటుంబ సభ్యుల పరిచయ భాగ్యం కలిగింది. వీరి కోడలు తమ మామగారైన పీసపాటి వారి చిత్రం చిత్రీకరించిన మని కోరడం, నేను వేయడం జరిగింది. నేను సేకరించిన వివరాలతో వారి చిత్రం facebook లో పోస్ట్ చెయ్యడం, దానికి విశేష స్పందన లభించింది.


ఇటీవల సాక్షి దినపత్రిక వారు నన్ను సంప్రదించి ఆ చిత్రాన్ని ఓ వ్యాసానికి ఆ చిత్రాన్ని తేసుకోవచ్చా అని అడిగారు. నాకు చాలా ఆనందం కలిగింది. నిన్న విడుదలైన సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఆ చిత్రంతో పాటు శ్రీ రాంభట్ల నరసింహమూర్తి గారి వ్యాసం ప్రచురించారు. ఈ వ్యాసం లింక్ ఇక్కడ ఇస్తున్నాను. చదవమని మనవి.

https://epaper.sakshi.com/2802835/Funday/30-08-2020#page/28/2


ధన్యవాదాలు

కామెంట్‌లు లేవు:

రాగ మాలిక - కథ

 మీ చిత్రం - నా కథ. రాగమాలిక రచన: మాలా కుమార్ మాలిక  కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి డ్రాయింగ్ రూం అంతా నీట్ గా సద్ది ఉంది. అమ్మ వంటింట్లో హడ...