4, ఆగస్టు 2020, మంగళవారం

ప్రజా గాయకుడు విప్లవ కవి వంగపడు ప్రసాదరావు


My pen sketch

నివాళి : ఈ రోజు మృతి చెందిన ప్రజాగాయకుడు, విప్లవ కవి వంగపండు ప్రసాదరావు (rapid pen sketch)

ప్రజా గాయకుడు, విప్లవ కవి వంగపండు ప్రసాదరావు;
పదునైన పదాలకు సొంపైన బాణీ కట్టి, తానే స్వయంగా కాలికి గజ్జె కట్టి ఆడి, పాడే వంగపండు ప్రసాదరావు శ్రీకాకుళం గిరిజన, రైతాంగ పోరాటం నుంచి ఉద్భవించిన వాగ్గేయకారుడు.
ఆ గజ్జెల శబ్దం ఇప్పుడు ఆగిపోయింది. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని తన స్వగృహంలో ఆయన మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
తన పాటలతో ఉత్తరాంధ్ర జానపద శైలిని తెలుగు నేల అంతటికీ పరిచయం చేసిన వంగపండు తన పాటలు, రచనలతో అనేక మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు.వంగపండు ప్రసాదరావు 1943లో జన్మించారు. పార్వతీపురం సమీపంలోని పెదబొండపల్లి ఆయన స్వగ్రామం. జగన్నాథం, చినతల్లి ఆయన తల్లిదండ్రులు.
విశాఖ షిప్ యార్డులో ఫిట్టర్‌గా పనిచేస్తూ ఆయన ప్రజా ఉద్యమాలవైపు నడిచారు. అనంతర కాలంలో తన ఉద్యోగానికి రాజీనామ చేసి పూర్తి సమయం ప్రజా ఉద్యమాలకే కేటాయించారు.
1969 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలో ఉవ్వెత్తున సాగిన గిరిజన, రైతాంగ పోరాట కాలంలో ఆయన తన కళా ప్రదర్శనలతో ప్రజాదరణ పొందారు.

కామెంట్‌లు లేవు:

తెలుగమ్మాయి - గజల్

  మూర్తిగారి తెలుగమ్మాయి బొమ్మకు స్పందనగా గజల్  రచన చల్లా రాంబాబు  పడుచుదనపు పరువాలతొ తెలుగమ్మాయి  అరవిరిసిన చిరునవ్వుతొ తెలుగమ్మాయి అచ్చతెల...