21, అక్టోబర్ 2023, శనివారం

ఎమ్. ఎస్. స్వామినాథన్ - హరిత విప్లవ పితామహుడు




ఎమ్. ఎస్. స్వామినాథన్  (charcoal pencil sketch)

వీరి గురించి క్లుప్తంగా :


మొన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ 
(1925 ఆగస్టు 7 - 2023 సెప్టెంబరు 28) భారత వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్ర నిపుణుడు. అతనిని భారతదేశంలో "హరిత విప్లవ పితామహుడు" గా పేర్కొంటారు. అతను "ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్" ను స్థాపించి దాని చైర్మన్ గా పనిచేశారు. అతను ప్రపంచంలో ఆకలి పేదరికం తగ్గించడంపై అతను ప్రధానంగా దృష్టి పెట్టారు. అలాగే ఇతర దేశాలకు చెందిన ఎన్నో మేలైన వరి రకాలను మన దేశంలోకి ప్రవేశపెట్టి, వాటి నుండి కొత్త వరి రకాలను ఉత్పత్తి చేశారు. వరి, గోధుమ మొదలైన పంటలపై ఈయన జరిపిన విశేష కృషి వలన భారతదేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించింది. స్వామినాథన్ ఎన్నో గొప్ప పదవులను సమర్ధవంతంగా నిర్వహించారు.
 

కామెంట్‌లు లేవు:

రాగ మాలిక - కథ

 మీ చిత్రం - నా కథ. రాగమాలిక రచన: మాలా కుమార్ మాలిక  కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి డ్రాయింగ్ రూం అంతా నీట్ గా సద్ది ఉంది. అమ్మ వంటింట్లో హడ...