13, సెప్టెంబర్ 2022, మంగళవారం

మధురవాణి

 



కన్యాశుల్కం 'మధురవాణి'

మిత్రులు రజా హుస్సేన్ గారు నా చిత్రానికి facebook లో రాసిన అద్భుత వ్యాసం. వారికి నా కృతజ్ణతలు.


*సాని ' దానికి మాత్రం నీతుండొద్దా ?

‘మధురవాణి ' నోట గురజాడ ' సుభాషితం !!
గురజాడ వారు ఏ ముహూర్తాన “ కన్యాశుల్కం "నాటకం రాశాడో కానీ,ఆంధ్రదేశంలో దాని ప్రకంప
నలు ఇంతవరకూ తగ్గలేదంటే అతిశయోక్తికాదు. అందుకే ‘కన్యాశుల్కం‌'నాటికీ ,నేటికీ దృశ్యకావ్యం
గా నిలిచివుంది. మరోవందేళ్ళయినా ఈ నాటకం
సజీవంగానే వుంటుంది. నాటకంలోని నాటిసామా
జిక సమస్య ఇప్పుడు లేదు.ఈ సమస్య సమసి
పోయిచాలా కాలం అయింది.అయినా,ఈనాటకం
ఇప్పుడు కూడా ఎవర్ గ్రీన్ గా వుందంటే దానికి
ప్రధాన కారణంనాటక కర్త ఇందులోని. పాత్రల్ని మలిచిన తీరు.!
కన్యాశుల్కం అనగానే నిలువెత్తు గిరీశం పాత్ర
మన కళ్ళముందు నిలుస్తుంది.అయితే “మధుర
వాణి "పాత్రే ఈ నాటకంలో సూత్రధారిలా కనిపి
స్తుంది. గిరీశం మాయలో పడి గురజాడ మధుర
వాణిని కాస్తంత నిర్లక్ష్యం చేశారనిపిస్తుంది.నాటకం ఆసాంతంలో ఆమె వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా ఆవి
ష్కరించలేక పోయారు గురజాడ. అలాగని‌ పూర్తి
గానిర్లక్ష్యం కూడా చేయలేదు.మన చేతికి ....
"తీగ” ఇచ్చి, ఇక మీ ఓపిక.(లాగినోళ్ళకిలాగి
నంత ) ఊహించుకున్నోళ్ళకి 'ఊహించుకున్నం
త'అన్నట్లుమధురవాణిని తాకీ తాక కుండా చిత్రించారనిపిస్తోంది.
ఏదైతేనేం ?.....నా దృష్టిలో మధురవాణి
"జీనియస్ " లోకం తీరు తెలిసిన జాణ.!
కరటక శాస్త్రి ఆమెను “త్రిలోక సుందరి “ గా వర్ణిం
చడాన్ని బట్టి ఆమె అందచందాల్ని అంచనా..... వెయ్యొచ్చు".సొగసు కత్తెల అలకలో కూడా అదో శృంగారం “ అని రామప్ప పంతులన్నాడంటే ... మధురవాణి ఎంత'సొగసైన'దోఊహించుకోవచ్చు
ఆమె అంత అందగత్తె కాబట్టే శిష్యుడు మధుర
వాణి “ నవ్వులో పట్టుబడాలని “ శిష్యుడు కోరు
కోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు.ఇక మధురవాణికి చదువు కూడా వుంది.గిరీశం దగ్గర కొంతకాలం ఇంగ్లీషు నేర్చుకోవడం వల్ల ఆమెకు విద్య కూడా వుందని నిర్థారించొచ్చు. ఆమెకు కేవలం ఇంగ్లీషే కాదు..సంస్కృతంలోని ‘ మృచ్ఛకటికం 'కూడా తెలుసన్న విషయం నాటకం చదివిన వారికెవరి
కైనా తెలుస్తుంది.’బుద్ధిమంతురాలైన తల్లి తర్ఫీ
దు వల్ల ఆమె విద్యావతి అయిందన్న ప్రస్తావన వుంది.” మా తల్లి ధర్మమా అని ,ఆమె నా చెవిలో గూడు కట్టుకొని బుద్ధులు చెప్పబట్టి “ తానింత దానైనట్లు" మధురవాణే చెబుతుంది.
ఇవన్నీ ఓ ఎత్తయితే ..లో మధురవాణి వ్యక్తిత్వం ఒక యెత్తు.కన్యాశుల్కం నాటకంలో కులానికి తక్కువైనాగుణానికి ఎంతో యెక్కువ. ఈ నాట
కంలో మధురవాణి కీలకమైన పాత్రే కాదు....! మొత్తాన్ని ఓ మలుపు తిప్పిన పాత్ర.ముఖ్యంగా ఆమె లౌక్యం గురించి చెప్పుకోవాలి.
గిరీశం కథను తారుమారు చేయాలని చూసినపు
డు ఆమె 'చక్రం ‘ అడ్డువేసి బుచ్చమ్మను ప్రమాదం
నుంచి కాపాడుతుంది.మరో మాట నాటకంలో పాత్రల మధ్య 'చిక్కు'వేసేది ఆమే,'చిక్కు ‘ విడగొ
ట్టేది ఆమే.రామప్ప పంతులు లౌక్యాన్ని, , కరటక శాస్త్రికార్యాలోచనను,గిరీశం సమయ స్ఫూర్తిని మిక్స్ చేసి గ్రైండర్ లో వేసి నూరితే వచ్చిందే ' మధురవాణి ' పాత్ర.!
‘వేశ్య'అనగానే చులకన,హేయ భావం స్ఫురిస్తుం
ది.సమాజంలో వేశ్యలది అథమస్థానం. అయితే మధురవాణిని చూసిన వారు ‌మాత్రం ‌ ఈ అభి
ప్రాయాన్ని ఖచ్చితంగా మార్చుకుంటారు.మధుర
వాణి వృత్తి చేత వేశ్య. అవకాశం వున్న మేరకు విటులవద్ద నుంచి‌సొమ్ము లాగుతుంది.అదివేశ్యా
ధర్మం.అంత మాత్రం చేత మధురవాణికి దయా
దాక్షిణ్యాలు సున్న అని తలవరాదు వేశ్యల్ని చుల
కనగాక చూసేవాళ్ళకు మధురవాణి మంచి చురకే అంటించింది.
"వేశ్య అనగానే అంత చులకనా ! పంతులు గారు .? సానిదానికి మాత్రం నీతి వుండొద్దా ?
అంటూ...ఎదురు ప్రశ్నిస్తుంది.
అసలు ఈ పాత్ర సృష్టి కర్త గురజాడ వారి అభి
ప్రాయం ఇది.గురజాడ వారు 1909 లో వంగ
వోలు ముని సుబ్రహ్మణ్యం కు రాసిన లేఖలో... వేశ్యల పట్ల తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
"వేశ్యలో మానుషత్వాన్ని మరిచిపోకండి. ఆమె
సుఖదుఃఖాలు మీవిగాని,నావిగాని అయిన సుఖ
దుఃఖాలకుప్రాముఖ్యతలో తీసిపోవు.సంఘంలో లెక్కలేని వ్యభిచారులైనా భర్తలు,భార్యలూవున్నా
రు.స్పష్టంగా తన వృత్తిని తెలియబరిచే వేశ్య...
వారందరికన్నా అథమురాలెట్లా అవుతుంది?
పైగా వేశ్య ఏ వివాహ ప్రమాణాన్నీ భగ్నంచేయడం
లేదు వీళ్ళవలె.”.!!
పై అభిప్రాయంతోనే మధురవాణి పాత్రను గుర
జాడ సృష్టించారు.అంతే కాదు కన్యాశుల్కం
నాటకంలో మధురవాణి పాత్రకు ఎంత పెద్ద పీట వేశారో చూడండి.
"మధురవాణి అంటూ ఒక వేశ్యాశిఖామణి
యీకళింగ రాజ్యంలో వుండకపోతే భగవంతు
డి సృష్టికి ఎంత లోపం వచ్చి వుండును‌".
అని ఓ సందర్భంలో... కరటక శాస్త్రి చేత చెప్పిస్తాడు గురజాడ.
మరి సానిది అంటే ...ఒళ్ళమ్ముకునేదేనా?
సానిదానికి మాత్రం ప్రేమ ,వలపు వుండదా?
అంటేదానికీ మధురవాణినే ఉదాహరణగా నిలబెట్టాడు గురజాడ. సౌజన్యారావును
మనసు పడుతుంది.ప్రేమిస్తుంది‌ మధురవాణి.
అయితే తన ప్రేమను వలపును వ్యక్తీకరించడా
నికి వృత్తి న్యూనత అడ్డొస్తుంది.అందుకే మనసులో ఇలా అనుకుంటుంది మధురవాణి.” సానిదాని వలపు మనసులోనే మణగాలి “.!!
మధురవాణికి మనసూ,రూపం మాత్రమే కాదు.
స్నేహం ,ప్రేమా కూడా వున్నాయి.శృంగారం వన్నె
చెడినదగ్గర్నుంచి బంగారం కదా తేటుతేవాలి?
ఆ బంగారాన్ని కరటక శాస్త్రికి ధారపోసింది.ఆమె స్నేహం ఎన్ననేల? ఇక వలపా? పాపం ఆమెకి
బ్రతుకే లేదు.హెడ్డు కానిస్టేబుల్ దగ్గర్నుంచి సౌంజ్ఞ చేసేవాడే.అసిరిగాడి దగ్గర్నుంచి పంతులు ఇంట్లో లేనప్పుడల్లా కనిష్టీబు మధురవాణితో వుంటాడ
ని చెప్పి నానా... యాగీ పెట్టే వారే.ఈగల్లాగ ముసి
రే మగరాజులందరిలోనూ ఆమె హృదయాన్ని చూరగొన్నది ఒక్క కరటకుడి శిష్యుడుమాత్రమే.!
"ఈ చిల్లంగి కళ్ళు నీకేదేవుడిచ్చాడని ",?
వాడ్ని ముద్దు పెట్టుకుంటుంది మధురవాణి.
సౌజన్యారావును పట్టి మంచిదాన్ననిపించుకుంది.
మొత్తానికి ' సానిదానిక్కూడా నీతి వుంటుందన్న' విషయాన్ని గురజాడవారు. 'మధురవాణి ' పాత్ర
ద్వారా బహుచక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు గురజాడ.
*దటీజ్ గురజాడ !!
చిత్రం...పొన్నాడ మూర్తి.
*ఎ.రజాహుస్సేన్!
హైదరాబాద్.

కామెంట్‌లు లేవు:

బి. గోపాలం - సంగీత దర్శకుడు, , నటుడు

బి గోపాలం - సంగీత దర్శకుడు గాయకుడు నటుడు  (my charcoal pencil sketch)  Facebook మిత్రులు వీర నరసింహారాజు గారి వాల్ నుండి సేకరణ యధాతధంగా. వార...