6, మే 2021, గురువారం

ఆచార్య ఆత్రేయ - శత జయంతి స్మృత్యంజలి. - pencil sketch




 నా రేఖలు గీతల్లో ఆత్రేయ గారి pencil చిత్రం


'మనసు కవి/' ఆచార్య ఆత్రేయ శత జయంతి స్మృత్యంజలి - ఈ సందర్భంగా మిత్రులు డా. ప్రసాద్ కె.వి.యస్ గారు ఈ మహనీయుని గురించి చాలా అద్భుతంగా వివరించారు. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారందించిన వివరాలు నలుగురికీ తెలియాలనే సదుద్దేశ్యంతో యథాతధంగా ఇక్కడ పొందుపరుస్తున్నాను.


పగటికి రేయి - రేయికి పగలు - పలికే వీడ్కోలు
సెగ రేగిన గుండెకు చెబుతున్నా - నీ చెవిన పడితే చాలు
నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు
నను వలచావని తెలిపేలోగా - నివురైపోతాను.
భగ్న ప్రేమకు భాష్యం చెప్తున్న ఈ కవిత్వం అజరామరం.
ఇలాంటి సజీవ భావుకత ఓ కవి అంతరంగ మథనం తో రావాలంటే....మాటలు కాదు.
అనుభవైక భగ్న ప్రేమ నుండి పుట్టింది కనుకనే.....
అది మన గుండెను తాకి....
ఆత్మను పలకరించి...
అవ్యక్తానుభూతినిస్తుంది.
మంగళం పాడు లోని ఆ సందులో ఉన్న మన్మధ బాణం....వీణ... కటాక్ష వీక్షణాలే.....
ఆత్రేయ కలాన కవితా ఝరి అయి ఈ నాటికీ అలరిస్తున్నాయి!
సూర్య చంద్రులు వెలిగేవరకు..
తారలన్నీ మెరిసే వరకు
జాతి మతాలు సమసే వరకు
జన్మలన్నీ ముగిసేవరకు....
కలిసి ఉందామనుకున్న ఆత్రేయ -వీణ ల జంట కు...
కులమూ కులమూ...జాతి జాతి అని గాండ్రించిందా పెద్దతనం...
గుణమే కులమని...నీతే జాతని వాదించిందా యువతరం.
పెద్దరికమే నిలిచి గెలిచింది.
వలపు వాకిట్లోనే నిలిచింది
గడప దాటి ఇంట దీపించనే లేదది.
**********
తమల పాకు పాదాలైనా తాండవ నృత్యం చేయుటలేదా!
పిడికెడు గుండె మనిషికి ఉన్నా కడివెడు ప్రేమను మోయుట లేదా!
కళ్ళకు కాటుక హద్దవుతుందా! కమ్మని కలలను వద్దంటుందా!
తెల్లవారికది మిగిలుంటుందా! వెచ్చని ఎండకు వెన్నెల ఆగుతుందా!
చంద్రుడు కనబడ లేదని వెన్నెల వేరే చోటుకు వెళుతుందా!
మధుపం లేదని మందారం తన మధువును కందిరీగకు అందిస్తుందా!
కట్టుకున్న మేన కోడలు.....పద్మావతి కి న్యాయం చేయలేని జ్వలనం.....ఆయన హృదయం.
ఆ హృదయార్తి లోనుండే అమృత గుళికల్లాంటి పాటల నిధి తెలుగు వారి పెన్నిధిగా మిగిలింది.
ఆద్యంతమూ లేని ..అమరానందమే ప్రేమ
ఏ బంధమూ లేని .. తొలి సంబంధమే ప్రేమ
ప్రేమ దివ్యభావము .. ప్రేమ దైవరూపము
ప్రేమ జీవరాగము .. ప్రేమ జ్ఞానయోగము
మనసున పారే సెలయేరు ప్రేమ
అలసట తీర్చే చిరుగాలి ప్రేమ
హద్దులేవీ లేనిది అందమైన ప్రేమ.
ఆద్యంతాలు లేని ప్రేమ కు నిర్వచనం.
ఎండల్లే వచ్చాడు
మంచల్లే కరిగాను
ఆహా వెన్నెల్లు కురిశాడు
వేడెక్కిపోయాను
ఇది బాధందునా
ఇది హాయందునా
ఏది ఏమైననూ
నే తనదాననూ
తనదాననూ.
ఓ ప్రణయిని విరహపు నిట్టూర్పులు.
గాలిలోనా తేలిపోయే
చీరకట్టిన చిన్నదానా
జిలుగు వెలుగుల చీర శిల్పం
ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగు పాతల బరుగు బ్రతుకుల
నేతగాళ్ళే నేసినారు
చారిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక
తెలుసుకో.
సామాజిక అంతరాల ధిక్కార స్వరం.
అంతా మట్టేనని తెలుసు అదీ ఒక మాయేనని తెలుసు
అంతా మట్టేనని తెలుసు అదీ ఒక మాయేనని తెలుసు
తెలిసీ వలచి విలపించుటలో తియ్యదనం ఎవరికి తెలుసూ.
మాయా మేయమైన దేహికి తప్పని తియ్యని వలపు విలాపం!
*********
ఆచార్య ఆత్రేయ గా పేరొందిన ఆయన అసలు పేరు కిళాంబి వేంకట నరసింహా చార్యులు.
కృష్ణమాచార్యులు & సీతమ్మలకు.... శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా లోని సూళ్ళూరు పేట మండలంలోని...మంగళం పాడులో 7 మే 1921 లో జన్మించారు.....
ఆచార్య ఆత్రేయ గా పేరొందిన ఆయన అసలు పేరు కిళాంబి వేంకట నరసిం హా చార్యులు.
హై స్కూల్ లో చదువుతున్నప్పుడే.....దేవుళ్ళదంతా అన్యాయమే....అని ఓ కవిత వ్రాశాడు.
దేవుళ్ళే న్యాయంగా వ్యవహరిస్తే ఈ లోకం ఎందుకిలా ఉంటుంది? అని నిగ్గదీశాడు పసి వయసులోనే.
8 ఏళ్ళ వయస్సు లోనే.. తల్లి స్వర్గస్తులవడంతో...పెరిగింది మేనమామ జగన్నాథాచార్యుల వారింట.
తండ్రికి...మేనమామ కు...ఇద్దరికీ నాటికలు...నాటకాలంటే మక్కువే. ఆ చర్చలు...చిన్నారి ఆత్రేయను ప్రభావితం చేశాయి.
ఇంటర్ కాగానే....నెల్లూరు లోని కోర్టు గుమస్తా గా చేరి పోయాడాయన. ఆ అనుభవ సారమే.....ఎన్.జి.ఓ.....నాటకం.
ఇంకా...భయం, కప్పలు, ఈ నాడు, పరివర్తన, గౌతమ బుధ్ధ, విశ్వశాంతి & సామ్రాట్ అశోక......గొప్ప నాటకాలు వ్రాశారు.
అనుక్షణం మరణ భయం,
జీవన సమ్రంభణ భయం,
మనిషికి మనిషన్న భయం,
మనసంటే మనసుకే భయం,
సత్యమన్నచో సచ్చే భయం,
చచ్చుదాకా చావు భయం.
భయం....నాటకం కోసం వ్రాసుకున్న ఈ పాట....ఇప్పటి కరోనా పరిస్థితి కి అద్దం పడుతోంది!
*********
దేశ విభజన టైం లో ....ఈ నాడు....అనే మత సామరస్యం ప్రభోధించే నాటకం వ్రాసి...1948 జనవరి 30 న నెల్లూరు లో ప్రదర్శిస్తున్న నాటకంలో....
ఓ హిందూ పాత్ర....ముస్లిం స్నేహితుడికి గాంధీ బొమ్మ ఒకటి బహుమతి ఇస్తాడు....స్వతంత్రం వచ్చిన సంబరంలో.
ఆ నాటకం చివరలో ఓ మతోన్మాది విసిరే కత్తి తగిలి గాంధీ విగ్రహం ముక్కలవుతుంది.
సరిగ్గా అదే రోజు గాంధీ మహాత్ముని పై అలాగే దాడి జరిగి మరణించడం ....
ఆత్రేయ ను మానసికంగా కృంగ తీసింది.
గౌతమ బుధ్ధ...పరివర్తన....నాటకాలు వేస్తున్న కాలంలోనే.....గుడివాడలో అక్కినేని &, దుక్కిపాటి మధుసూధన రావు ల పరిచయం.
కె.ఎస్.ప్రకాశరావు గారు పట్టు పట్టి తన మూవీ దీక్ష(1950) కోసం...మొట్ట మొదటి పాట వ్రాయించుకున్నాడు.
అదే....పోరా బాబు పో...పోయి చూడు లోకం పోకడ.....అనే పాట.
అలా సినీ రంగాన కాలూనిన ఆత్రేయ కు.....సినీరంగం ఇరుకు మనస్తత్వాలు.... కరకుగా తోచింది.
కల్పిత మబ్బులకు....నెమలి నాట్యమాడటం ఎలాంటిదో....సినీ వాతావరణంలో కవిత్వం వ్రాయడం కూడా అంతే అనేవారాయన!
అందుకే.....ఆత్రేయ వ్రాయడానికి....చాలా కాలం తీసుకునేవారు.
వ్రాయకుండా నిర్మాతలను....వ్రాసి ప్రేక్షకులను ఏడిపిస్తాడు ఆత్రేయ అనే అపప్రధను మోస్తూ.....
వ్రాయడానికి ఇక్కడ నేనెంత ఏడిస్తానో...ఎవరికీ తెలియదు మరి అని చమత్కరించేవారు!
***********
ఇక సినీరంగాన....దాదాపు ఆత్రేయ తోనే రంగ ప్రవేశం చేసిన ....కొసరాజు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆరుద్ర, శ్రీ.శ్రీ, మాల్లాది రామకృష్ణ శాస్త్రి లాంటి వారే కాక...
అప్పటికే ఉన్న మహా కవులు....పింగళి, సముద్రాల సీనియర్ & జూనియర్లు....ఎంత మంది ఉన్నారో!
ఇక చిత్ర జగత్తులో....భగ్న కవికి....మనశ్శాంతికి మార్గం.....మదిర.....ఇంకా మగువ.
అందుకే ప్రేమ నగర్ లో డైలాగులు.....అంత గొప్పగా కుదిరాయి!
ఏం తీశాడురా.....ఏం చేశాడురా...అనే వారు ....క్రొత్తగా ఏం వ్రాశాడురా ఆత్రేయ.....అన్నారు మొట్ట మొదటి సారిగా!
మదిర అలవాటు లేని వారు చిత్రసీమలో అరుదు.
ఇక మగువలూ మామూలే.....నిజం చెప్పాలంటే!
వారిలో....ఆత్రేయ మనస్సును గేలం వేసి పట్టుకున్నది....కమల.....నల్ల కలువల్లే మెరిసి పోయేదట.
ముగ్గురు స్త్రీమూర్తులు.....ఆత్రేయ జీవితాన్ని నిర్దేశించారు.
అందని ప్రేయసి వీణ.......
కట్టుకున్న అనాఘ్రాత భార్య పద్మావతి......
పొందులో స్వర్గం చూపుతున్న కమల.....
ఆత్రేయ ఏం వ్రాసినా.......వీరి ముగ్గురి ప్రభావమే!
ఈ వీణకు శృతి లేదు....ఎందరికో హృదయం లేదు....
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే...
అది ఒక ఇదిలే ఆమెకె తగులే....
పాడుతా తియ్యగా చల్లగా...
నా పాట నీనోట పలకాల చిలకా....
ప్రేమ లేదని...ప్రేమించరాదని...
ఎదుట నీవె ఎదలోనా నీవే....
కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు...
విధి చేయు వింతలన్ని మతి లేని చేతలేనని..
మౌనమె నీభాష ఓ మూగ మనసా!....
మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు!
మనసు లేని బ్రతుకొక నరకం..మరువలేని మనసొక నరకం...
మనదొక మధు కలశం..పగిలే వరకే అది నిత్య సుందరం....
నిన్ను మరచి పోవాలని అన్ని విడిచి వెళ్ళాలని...
నీ సుఖమే నే కోరుతున్నా...నిను వీడి అందుకే వెళుతున్నా...
పదహారేళ్ళకు...నీలో నాలో ఆప్రాయం చేసే చిలిపి పనులకు...
*********
చందమామ మోము ....
చారెడేసి కళ్ళు...
దొండపండు పెదవి...
పండునిమ్మ పసిమి....
కడలి అలల కురులు....
కానరాని నడుము....
కన్నె సొగసులని .....
కవులన్నారు....
అవి ...అన్నో...కొన్నో ...
ఉన్న దానను...
అలతి పదాలతో అలవోకగా అలా అలా....చదివితే గద్యం.
పాడితే....చోద్యం! మనోహరం! అద్భుతం!
నిలిచిపోయే....కావ్యం!
కఠిన సమాస భూయిష్టమైన పదాలుండవు.అక్కడే ఆయన విశిష్టత! ప్రజల నోళ్ళలో ఈజీగా నానుతుంది. పాట సూపర్ హిట్ అవుతుంది. అది ఒక్క ఆయనకే చెల్లు!
నీలోని మగసిరి తోటి...
నాలోని సొగసుల పోటి...
వేయించి..నేనే ఓడి పోనీ పొమ్మంటి!
నేనోడి...నీవే గెలిచి....
నీ గెలుపు నాదని తలచి...
రాగాలు రంజిల్లు రోజే రాజీ రమ్మంటి!
శృంగారానికి పరాకాష్ట ఈ చరణాలు.
అర్థం చేసుకుంటే...మనోల్లాసమే!
ప్రాసల తో మామూలుగా ఆడుకునేది ఆరుద్ర గారు.
కానీ ఈ గీతంలో వీరి శృంగార చమత్కారం....ప్రాసలతోనే....శిఖరాగ్రాన్ని అంటింది!
పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు...
పాటలు పాడిన.....చిరుగాలులకు...
తెరచాటొసగిన...చెలులు శిలలకు...
దీవెన జల్లులు చల్లిన అలలకూ....
కోటి దండాలు....శతకోటి దండాలూ...
పదహారేళ్ళ పరువానికి...పరుగులు తీసే యవ్వనానికి...మెరుగులు...ఇంతకంటే ఎవరు దిద్దగలరు!
చీకటి గుహ నీవు...చింతల చెలి నీవు,
నాటకరంగానివే మనసా...తెగిన పతంగానివే....
ఎందుకు వలచేవో...ఎందుకు వగచేవో...
ఎందుకు రగిలేవో...ఏమై మిగిలేవో...
ఎందుకు రగిలేవో...ఏమై మిగిలేవో...
మౌనమె నీ భాష ఓ మూగ మనసా...
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు...
కల్లలు కాగానె...కన్నీరౌతావు...
సగటు మనిషి మనసుకు అద్దం పట్టిన ఈ గీతం ఎవరైనా మరువగలరా!
అందుకే అజరామరంగా నిలిచిందీ పాట.
**********
అన్నీ అందరికీ చేత కావు. ఆయన నిర్మాతగా...దర్శకునిగా...తీసిన ఒకే మూవీ వాగ్ధానం
పెద్దగా ఆడలేదనే చెప్పాలి.
ఘన విజయం మాత్రం కాదు!
పాటలన్నీ హిట్. పాటల రచయితగా...దాశరధిని మొట్టమొదట పరిచయం చేశారు.
నిర్మాత లకు....దర్శకులకు.....ఆత్రేయ....ప్రసూతి వైరాగ్యం రుచి చూపించేవారు!
ఆయనతో పాట రాయించుకోవడానికి దర్శకుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ను పెట్టేవాడు. అతను ఆత్రేయ గారి ఇంటనే కారు షెడ్డు లోనో...ఔట్ హౌస్ లోనో ఉంటూఉండేవాడు రేయింబవళ్ళు...పాట కోసం.
ఓ అర్ధరాత్రి సడన్ గా పాట తీసుకొచ్చి ఆ అసిస్టెంట్ చేతిలో పెట్తే...తెగ సంతోష పడి పోతున్న అతని ఉత్సాహానికి అడ్డు కట్ట వేసేవాడు!
ఆ పాట ఫలానా దర్శకుడిది. దాన్ని అర్జెంటుగా అతనికి డెలివరీ చేసేయ్. నీ పాట రేపో...ఎల్లుండో వ్రాస్తాలే అనేవారట!
ఈ బాధలన్నీ పడలేక...ఇక జన్మలో ఆత్రేయ తో పాటలు వ్రాయించుకోకూడదని నిర్మాత - దర్శకులు అనుకునేంతగా విదిగించేస్తారు!
కానీ ఒకసారి ఆ పాటలు...సినిమా....విడుదలయ్యాక....ఆ రెస్పాన్స్ చూసి....మళ్ళీ మామూలే. మళ్ళీ ఆత్రేయ వెంటే పడేవారు! ఇదేగా ప్రసూతి వైరాగ్యమంటే!
***********
షుమారు 1400లకుపైగా పాటలు రాసి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు.
పాటలన్నీ భావోద్వేగాల సమాహారంగా ఉండటంతో ఆత్రేయను....
మనసు కవి - మన సుకవి గా ప్రేక్షకులు, అభిమానులు అభివర్ణించారు.
ఎంతటి బరువైన భావాలనైనా అర్థవంతమైన తేలికైన పదాలతో పలికించడంతో ఆత్రేయ దిట్ట.
మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూశారు. పాటల్లో తన అనుభవాలను పొదిగి, గుండె బరువును దించుకునే వారు.
మరో వందేళ్ళు కాదు...వెయ్యేళ్ళైనా....ఆత్రేయ మన గుండెల్లో నిలిచిపోయేట్లు...
అజరామరమైన సినీ గీతాలను పూయించి....1989 - సెప్టంబర్ - 13 న అనంతంలో ఐక్యమయ్యారు మనసు కవి.....మన సుకవి......ఆత్రేయ గారు.
ఒకే ఒక్క నంది అవార్డ్ & అంబేద్కర్ యూనివర్సిటీ వారిచ్చిన డాక్టరేట్ మాత్రమే పురస్కారాలు వారికి!
అత్రేయకి నటుడు కొంగర జగ్గయ్య ఆప్తమిత్రుడు.
ఆత్రేయ వ్రాసిన పాటలు, నాటకాలు, నాటికలు, కథలు, కదంబాలు... మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య గారు తన మిత్రుడికి గొప్ప నివాళి సమర్పించారు.
మే - 7 న ఆత్రేయ గారి శత జయంతి.
నిత్య పరిమళం వెదజల్లే గీతాలను వెలయించిన మన మనసు కవి ఆత్రేయ వారికి....
శత జయంతి స్మృత్యంజలి.

పగటికి రేయి - రేయికి పగలు - పలికే వీడ్కోలు

సెగ రేగిన గుండెకు చెబుతున్నా - నీ చెవిన పడితే చాలు
నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు
నను వలచావని తెలిపేలోగా - నివురైపోతాను.
భగ్న ప్రేమకు భాష్యం చెప్తున్న ఈ కవిత్వం అజరామరం.
ఇలాంటి సజీవ భావుకత ఓ కవి అంతరంగ మథనం తో రావాలంటే....మాటలు కాదు.
అనుభవైక భగ్న ప్రేమ నుండి పుట్టింది కనుకనే.....
అది మన గుండెను తాకి....
ఆత్మను పలకరించి...
అవ్యక్తానుభూతినిస్తుంది.
మంగళం పాడు లోని ఆ సందులో ఉన్న మన్మధ బాణం....వీణ... కటాక్ష వీక్షణాలే.....
ఆత్రేయ కలాన కవితా ఝరి అయి ఈ నాటికీ అలరిస్తున్నాయి!
సూర్య చంద్రులు వెలిగేవరకు..
తారలన్నీ మెరిసే వరకు
జాతి మతాలు సమసే వరకు
జన్మలన్నీ ముగిసేవరకు....
కలిసి ఉందామనుకున్న ఆత్రేయ -వీణ ల జంట కు...
కులమూ కులమూ...జాతి జాతి అని గాండ్రించిందా పెద్దతనం...
గుణమే కులమని...నీతే జాతని వాదించిందా యువతరం.
పెద్దరికమే నిలిచి గెలిచింది.
వలపు వాకిట్లోనే నిలిచింది
గడప దాటి ఇంట దీపించనే లేదది.
**********
తమల పాకు పాదాలైనా తాండవ నృత్యం చేయుటలేదా!
పిడికెడు గుండె మనిషికి ఉన్నా కడివెడు ప్రేమను మోయుట లేదా!
కళ్ళకు కాటుక హద్దవుతుందా! కమ్మని కలలను వద్దంటుందా!
తెల్లవారికది మిగిలుంటుందా! వెచ్చని ఎండకు వెన్నెల ఆగుతుందా!
చంద్రుడు కనబడ లేదని వెన్నెల వేరే చోటుకు వెళుతుందా!
మధుపం లేదని మందారం తన మధువును కందిరీగకు అందిస్తుందా!
కట్టుకున్న మేన కోడలు.....పద్మావతి కి న్యాయం చేయలేని జ్వలనం.....ఆయన హృదయం.
ఆ హృదయార్తి లోనుండే అమృత గుళికల్లాంటి పాటల నిధి తెలుగు వారి పెన్నిధిగా మిగిలింది.
ఆద్యంతమూ లేని ..అమరానందమే ప్రేమ
ఏ బంధమూ లేని .. తొలి సంబంధమే ప్రేమ
ప్రేమ దివ్యభావము .. ప్రేమ దైవరూపము
ప్రేమ జీవరాగము .. ప్రేమ జ్ఞానయోగము
మనసున పారే సెలయేరు ప్రేమ
అలసట తీర్చే చిరుగాలి ప్రేమ
హద్దులేవీ లేనిది అందమైన ప్రేమ.
ఆద్యంతాలు లేని ప్రేమ కు నిర్వచనం.
ఎండల్లే వచ్చాడు
మంచల్లే కరిగాను
ఆహా వెన్నెల్లు కురిశాడు
వేడెక్కిపోయాను
ఇది బాధందునా
ఇది హాయందునా
ఏది ఏమైననూ
నే తనదాననూ
తనదాననూ.
ఓ ప్రణయిని విరహపు నిట్టూర్పులు.
గాలిలోనా తేలిపోయే
చీరకట్టిన చిన్నదానా
జిలుగు వెలుగుల చీర శిల్పం
ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగు పాతల బరుగు బ్రతుకుల
నేతగాళ్ళే నేసినారు
చారిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక
తెలుసుకో.
సామాజిక అంతరాల ధిక్కార స్వరం.
అంతా మట్టేనని తెలుసు అదీ ఒక మాయేనని తెలుసు
అంతా మట్టేనని తెలుసు అదీ ఒక మాయేనని తెలుసు
తెలిసీ వలచి విలపించుటలో తియ్యదనం ఎవరికి తెలుసూ.
మాయా మేయమైన దేహికి తప్పని తియ్యని వలపు విలాపం!
*********
ఆచార్య ఆత్రేయ గా పేరొందిన ఆయన అసలు పేరు కిళాంబి వేంకట నరసింహా చార్యులు.
కృష్ణమాచార్యులు & సీతమ్మలకు.... శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా లోని సూళ్ళూరు పేట మండలంలోని...మంగళం పాడులో 7 మే 1921 లో జన్మించారు.....
ఆచార్య ఆత్రేయ గా పేరొందిన ఆయన అసలు పేరు కిళాంబి వేంకట నరసిం హా చార్యులు.
హై స్కూల్ లో చదువుతున్నప్పుడే.....దేవుళ్ళదంతా అన్యాయమే....అని ఓ కవిత వ్రాశాడు.
దేవుళ్ళే న్యాయంగా వ్యవహరిస్తే ఈ లోకం ఎందుకిలా ఉంటుంది? అని నిగ్గదీశాడు పసి వయసులోనే.
8 ఏళ్ళ వయస్సు లోనే.. తల్లి స్వర్గస్తులవడంతో...పెరిగింది మేనమామ జగన్నాథాచార్యుల వారింట.
తండ్రికి...మేనమామ కు...ఇద్దరికీ నాటికలు...నాటకాలంటే మక్కువే. ఆ చర్చలు...చిన్నారి ఆత్రేయను ప్రభావితం చేశాయి.
ఇంటర్ కాగానే....నెల్లూరు లోని కోర్టు గుమస్తా గా చేరి పోయాడాయన. ఆ అనుభవ సారమే.....ఎన్.జి.ఓ.....నాటకం.
ఇంకా...భయం, కప్పలు, ఈ నాడు, పరివర్తన, గౌతమ బుధ్ధ, విశ్వశాంతి & సామ్రాట్ అశోక......గొప్ప నాటకాలు వ్రాశారు.
అనుక్షణం మరణ భయం,
జీవన సమ్రంభణ భయం,
మనిషికి మనిషన్న భయం,
మనసంటే మనసుకే భయం,
సత్యమన్నచో సచ్చే భయం,
చచ్చుదాకా చావు భయం.
భయం....నాటకం కోసం వ్రాసుకున్న ఈ పాట....ఇప్పటి కరోనా పరిస్థితి కి అద్దం పడుతోంది!
*********
దేశ విభజన టైం లో ....ఈ నాడు....అనే మత సామరస్యం ప్రభోధించే నాటకం వ్రాసి...1948 జనవరి 30 న నెల్లూరు లో ప్రదర్శిస్తున్న నాటకంలో....
ఓ హిందూ పాత్ర....ముస్లిం స్నేహితుడికి గాంధీ బొమ్మ ఒకటి బహుమతి ఇస్తాడు....స్వతంత్రం వచ్చిన సంబరంలో.
ఆ నాటకం చివరలో ఓ మతోన్మాది విసిరే కత్తి తగిలి గాంధీ విగ్రహం ముక్కలవుతుంది.
సరిగ్గా అదే రోజు గాంధీ మహాత్ముని పై అలాగే దాడి జరిగి మరణించడం ....
ఆత్రేయ ను మానసికంగా కృంగ తీసింది.
గౌతమ బుధ్ధ...పరివర్తన....నాటకాలు వేస్తున్న కాలంలోనే.....గుడివాడలో అక్కినేని &, దుక్కిపాటి మధుసూధన రావు ల పరిచయం.
కె.ఎస్.ప్రకాశరావు గారు పట్టు పట్టి తన మూవీ దీక్ష(1950) కోసం...మొట్ట మొదటి పాట వ్రాయించుకున్నాడు.
అదే....పోరా బాబు పో...పోయి చూడు లోకం పోకడ.....అనే పాట.
అలా సినీ రంగాన కాలూనిన ఆత్రేయ కు.....సినీరంగం ఇరుకు మనస్తత్వాలు.... కరకుగా తోచింది.
కల్పిత మబ్బులకు....నెమలి నాట్యమాడటం ఎలాంటిదో....సినీ వాతావరణంలో కవిత్వం వ్రాయడం కూడా అంతే అనేవారాయన!
అందుకే.....ఆత్రేయ వ్రాయడానికి....చాలా కాలం తీసుకునేవారు.
వ్రాయకుండా నిర్మాతలను....వ్రాసి ప్రేక్షకులను ఏడిపిస్తాడు ఆత్రేయ అనే అపప్రధను మోస్తూ.....
వ్రాయడానికి ఇక్కడ నేనెంత ఏడిస్తానో...ఎవరికీ తెలియదు మరి అని చమత్కరించేవారు!
***********
ఇక సినీరంగాన....దాదాపు ఆత్రేయ తోనే రంగ ప్రవేశం చేసిన ....కొసరాజు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆరుద్ర, శ్రీ.శ్రీ, మాల్లాది రామకృష్ణ శాస్త్రి లాంటి వారే కాక...
అప్పటికే ఉన్న మహా కవులు....పింగళి, సముద్రాల సీనియర్ & జూనియర్లు....ఎంత మంది ఉన్నారో!
ఇక చిత్ర జగత్తులో....భగ్న కవికి....మనశ్శాంతికి మార్గం.....మదిర.....ఇంకా మగువ.
అందుకే ప్రేమ నగర్ లో డైలాగులు.....అంత గొప్పగా కుదిరాయి!
ఏం తీశాడురా.....ఏం చేశాడురా...అనే వారు ....క్రొత్తగా ఏం వ్రాశాడురా ఆత్రేయ.....అన్నారు మొట్ట మొదటి సారిగా!
మదిర అలవాటు లేని వారు చిత్రసీమలో అరుదు.
ఇక మగువలూ మామూలే.....నిజం చెప్పాలంటే!
వారిలో....ఆత్రేయ మనస్సును గేలం వేసి పట్టుకున్నది....కమల.....నల్ల కలువల్లే మెరిసి పోయేదట.
ముగ్గురు స్త్రీమూర్తులు.....ఆత్రేయ జీవితాన్ని నిర్దేశించారు.
అందని ప్రేయసి వీణ.......
కట్టుకున్న అనాఘ్రాత భార్య పద్మావతి......
పొందులో స్వర్గం చూపుతున్న కమల.....
ఆత్రేయ ఏం వ్రాసినా.......వీరి ముగ్గురి ప్రభావమే!
ఈ వీణకు శృతి లేదు....ఎందరికో హృదయం లేదు....
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే...
అది ఒక ఇదిలే ఆమెకె తగులే....
పాడుతా తియ్యగా చల్లగా...
నా పాట నీనోట పలకాల చిలకా....
ప్రేమ లేదని...ప్రేమించరాదని...
ఎదుట నీవె ఎదలోనా నీవే....
కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు...
విధి చేయు వింతలన్ని మతి లేని చేతలేనని..
మౌనమె నీభాష ఓ మూగ మనసా!....
మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు!
మనసు లేని బ్రతుకొక నరకం..మరువలేని మనసొక నరకం...
మనదొక మధు కలశం..పగిలే వరకే అది నిత్య సుందరం....
నిన్ను మరచి పోవాలని అన్ని విడిచి వెళ్ళాలని...
నీ సుఖమే నే కోరుతున్నా...నిను వీడి అందుకే వెళుతున్నా...
పదహారేళ్ళకు...నీలో నాలో ఆప్రాయం చేసే చిలిపి పనులకు...
*********
చందమామ మోము ....
చారెడేసి కళ్ళు...
దొండపండు పెదవి...
పండునిమ్మ పసిమి....
కడలి అలల కురులు....
కానరాని నడుము....
కన్నె సొగసులని .....
కవులన్నారు....
అవి ...అన్నో...కొన్నో ...
ఉన్న దానను...
అలతి పదాలతో అలవోకగా అలా అలా....చదివితే గద్యం.
పాడితే....చోద్యం! మనోహరం! అద్భుతం!
నిలిచిపోయే....కావ్యం!
కఠిన సమాస భూయిష్టమైన పదాలుండవు.అక్కడే ఆయన విశిష్టత! ప్రజల నోళ్ళలో ఈజీగా నానుతుంది. పాట సూపర్ హిట్ అవుతుంది. అది ఒక్క ఆయనకే చెల్లు!
నీలోని మగసిరి తోటి...
నాలోని సొగసుల పోటి...
వేయించి..నేనే ఓడి పోనీ పొమ్మంటి!
నేనోడి...నీవే గెలిచి....
నీ గెలుపు నాదని తలచి...
రాగాలు రంజిల్లు రోజే రాజీ రమ్మంటి!
శృంగారానికి పరాకాష్ట ఈ చరణాలు.
అర్థం చేసుకుంటే...మనోల్లాసమే!
ప్రాసల తో మామూలుగా ఆడుకునేది ఆరుద్ర గారు.
కానీ ఈ గీతంలో వీరి శృంగార చమత్కారం....ప్రాసలతోనే....శిఖరాగ్రాన్ని అంటింది!
పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు...
పాటలు పాడిన.....చిరుగాలులకు...
తెరచాటొసగిన...చెలులు శిలలకు...
దీవెన జల్లులు చల్లిన అలలకూ....
కోటి దండాలు....శతకోటి దండాలూ...
పదహారేళ్ళ పరువానికి...పరుగులు తీసే యవ్వనానికి...మెరుగులు...ఇంతకంటే ఎవరు దిద్దగలరు!
చీకటి గుహ నీవు...చింతల చెలి నీవు,
నాటకరంగానివే మనసా...తెగిన పతంగానివే....
ఎందుకు వలచేవో...ఎందుకు వగచేవో...
ఎందుకు రగిలేవో...ఏమై మిగిలేవో...
ఎందుకు రగిలేవో...ఏమై మిగిలేవో...
మౌనమె నీ భాష ఓ మూగ మనసా...
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు...
కల్లలు కాగానె...కన్నీరౌతావు...
సగటు మనిషి మనసుకు అద్దం పట్టిన ఈ గీతం ఎవరైనా మరువగలరా!
అందుకే అజరామరంగా నిలిచిందీ పాట.
**********
అన్నీ అందరికీ చేత కావు. ఆయన నిర్మాతగా...దర్శకునిగా...తీసిన ఒకే మూవీ వాగ్ధానం
పెద్దగా ఆడలేదనే చెప్పాలి.
ఘన విజయం మాత్రం కాదు!
పాటలన్నీ హిట్. పాటల రచయితగా...దాశరధిని మొట్టమొదట పరిచయం చేశారు.
నిర్మాత లకు....దర్శకులకు.....ఆత్రేయ....ప్రసూతి వైరాగ్యం రుచి చూపించేవారు!
ఆయనతో పాట రాయించుకోవడానికి దర్శకుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ను పెట్టేవాడు. అతను ఆత్రేయ గారి ఇంటనే కారు షెడ్డు లోనో...ఔట్ హౌస్ లోనో ఉంటూఉండేవాడు రేయింబవళ్ళు...పాట కోసం.
ఓ అర్ధరాత్రి సడన్ గా పాట తీసుకొచ్చి ఆ అసిస్టెంట్ చేతిలో పెట్తే...తెగ సంతోష పడి పోతున్న అతని ఉత్సాహానికి అడ్డు కట్ట వేసేవాడు!
ఆ పాట ఫలానా దర్శకుడిది. దాన్ని అర్జెంటుగా అతనికి డెలివరీ చేసేయ్. నీ పాట రేపో...ఎల్లుండో వ్రాస్తాలే అనేవారట!
ఈ బాధలన్నీ పడలేక...ఇక జన్మలో ఆత్రేయ తో పాటలు వ్రాయించుకోకూడదని నిర్మాత - దర్శకులు అనుకునేంతగా విదిగించేస్తారు!
కానీ ఒకసారి ఆ పాటలు...సినిమా....విడుదలయ్యాక....ఆ రెస్పాన్స్ చూసి....మళ్ళీ మామూలే. మళ్ళీ ఆత్రేయ వెంటే పడేవారు! ఇదేగా ప్రసూతి వైరాగ్యమంటే!
***********
షుమారు 1400లకుపైగా పాటలు రాసి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు.
పాటలన్నీ భావోద్వేగాల సమాహారంగా ఉండటంతో ఆత్రేయను....
మనసు కవి - మన సుకవి గా ప్రేక్షకులు, అభిమానులు అభివర్ణించారు.
ఎంతటి బరువైన భావాలనైనా అర్థవంతమైన తేలికైన పదాలతో పలికించడంతో ఆత్రేయ దిట్ట.
మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూశారు. పాటల్లో తన అనుభవాలను పొదిగి, గుండె బరువును దించుకునే వారు.
మరో వందేళ్ళు కాదు...వెయ్యేళ్ళైనా....ఆత్రేయ మన గుండెల్లో నిలిచిపోయేట్లు...
అజరామరమైన సినీ గీతాలను పూయించి....1989 - సెప్టంబర్ - 13 న అనంతంలో ఐక్యమయ్యారు మనసు కవి.....మన సుకవి......ఆత్రేయ గారు.
ఒకే ఒక్క నంది అవార్డ్ & అంబేద్కర్ యూనివర్సిటీ వారిచ్చిన డాక్టరేట్ మాత్రమే పురస్కారాలు వారికి!
అత్రేయకి నటుడు కొంగర జగ్గయ్య ఆప్తమిత్రుడు.
ఆత్రేయ వ్రాసిన పాటలు, నాటకాలు, నాటికలు, కథలు, కదంబాలు... మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య గారు తన మిత్రుడికి గొప్ప నివాళి సమర్పించారు.
మే - 7 న ఆత్రేయ గారి శత జయంతి.
నిత్య పరిమళం వెదజల్లే గీతాలను వెలయించిన మన మనసు కవి ఆత్రేయ వారికి....
శత జయంతి స్మృత్యంజలి.

(ప్రసాద్ కె.వి.యస్)

పిఠాపురం నాగేశ్వరరావు


 My pencil sketch of Pithapuram Nageswara Rao, an excellent singer of Telugu cinema


పుట్టిన ఊరు నే ఇంటి పేరుగా మార్చుకున్న పిఠాపురం (పాతర్లగడ్డ} నాగేశ్వరరావు జయంతి సందర్భంగా నా చిత్ర నివాళి.

తెలుగు సినిమా రంగంలో జంట గాయకులుగా పేరు తెచ్చుకున్న మాధవపెద్ది - పిఠాపురంను సంగీత ప్రియులు ఎప్పటికీ మరువలేరు. తెలుగు సినీ స్వర్ణ యుగంలో హాస్య పాత్రధారులకూ హాయిని గొల్పే పాటలను రచయితలు రాసేవారు, దర్శకులు చిత్రీకరించే వారు. మరి వారి హావభావాలకు తగ్గట్టుగా పాటలు పాడే గాయనీ గాయకులూ ఎంతోమంది అలనాడు చిత్రసీమలో ఉన్నారు. ఆ కోవలే హాస్య గీతాల గాయనీ గాయకులుగా మాధవపెద్ది - పిఠాపురం పేరు తెచ్చుకున్నారు. బాల్యంలోనే తండ్రి ప్రోత్సాహంతో నటన పట్ల ఆకర్షితులైనా, స్టేజ్ మీద పాడలేని వారికి నేపథ్యం గానం అందించే అలవాటు యుక్తవయసులోనే ఆయనకు అబ్బింది. అదే ఆ తర్వాత ఆయనకు జీవనోపాధిగా మారిపోయింది. 1946లో 'మంగళసూత్రం' సినిమాతో ఆయన నేపథ్య గాయకునిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. పదహారేళ్ళ ప్రాయంలోనే 'చంద్రలేఖ' చిత్రంలో పాట పాడే అవకాశం రావడంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు. వివిధ భాషలలో వేలాది పాటలను పిఠాపురం పాడారు. ఘంటసాలతో కలిసి 'అవేకళ్ళు' చిత్రంలో పాడిన 'మా ఊళ్ళో ఒక పడుచుకుంది', మాధవపెద్ది తో కలిసి 'కులగోత్రాలు' కోసం పాడిన 'అయ్యయ్యో... జేబులో డబ్బులు పోయెనే' ఇంకా 'వెంకటేశ్వర మహత్యం' చిత్రం లో 'పదవే పోదాము గౌరీ పరమేశ్వరుని చూడ..' వంటి పాటలు పిఠాపురానికి మంచి పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. వీరు మంచి రంగస్థల నటుడు కూడా. చివరగా 1978లో 'బొమ్మరిల్లు' సినిమాలో ఓ పాట పాడారు. పిఠాపురం నాగేశ్వరరావు 1996 మార్చి 5న కన్నుమూశారు. అయితే తెలుగు సినిమా పాట ఉన్నంత కాలం ఆయన సంగీత ప్రియుల గుండెల్లో చిరంజీవి! (సేకరణ : ఇక్కడా అక్కడా)

facebook లో ఈ పోస్ట్ చూసిన మిత్రులు శ్రీ సాయి గణేష్ పురాణం గారు నాకు తెలియని విషయాలు కొన్ని తెలియజేశారు. వారి నా పోస్ట్ కి ఇచ్చిన వ్యాఖ్య ని క్రిందన యథాతధంగా పొందుపరుస్తున్నాను. వారికి నా ధన్యవాదాలు:


"విజయనగరం పనిమీద వెళ్ళినప్పుడు తప్పకుండా సుశీలమ్మ నాన్నగార్ని కలిసేవారు పిఠాపురం. సుశీలమ్మ టాలెంట్ ను గమనించి పెండ్యాలకు చెప్పేరు. పెండ్యాల నాకు ఆ అమ్మాయి తెలుసు పాడిద్దాం అని చెప్పి సుశీలమ్మకు కన్నతల్లి సినిమాలో పాడించాడు. ఆ తరువాత జరిగింది చరిత్రే. అందుకే ఈరోజుకీ సుశీలమ్మ పిఠాపురం కుటుంబం అంటే ఎంతో ఆప్యాయంగా ఉంటుంది.
అలాగే ఉమాసుందరి సినిమాలో మాష్టారితో పాడిన పాట "నమ్మకురా ఇల్లాలు పిల్లలు" పాటకి మాష్టారు ముగ్ధులైపోయారు. ఎంతగానో పిఠాపురంను అభినందించారు."

4, మే 2021, మంగళవారం

అమ్మే తొలి దైవంగా కీర్తించే ఘనతమనది! - తెలుగు గజల్


 అమ్మే తొలి దైవంగా కీర్తించే ఘనతమనది!

అమ్మాఅని మొదటిపదం పలికించే ఘనతమనది!
అమ్ముంటే చాలుకదా అమ్మలేని డబ్బువృధా!
పరస్త్రీని తల్లివలే మన్నించే ఘనతమనది!
జగత్తునే కాపాడే మమతున్నది అమ్మలో
అమ్మతనం ఎచటున్నా పూజించే ఘనతమనది !
మాతృభూమి లో అమ్మను చూచుకునే హృదయాలివి
మాతుఝేసలామంటూ నినదించే ఘనతమనది !
అమ్మచేయి పట్టుకునే అడుగులేసి ఎదుగుతాము
గుండెల్లో అమ్మబొమ్మ చిత్రించే ఘనత మనది !
కానీ...... ...... .......
అమ్మకేది ఒక్కసెలవ ! పనిచేసే యంత్రమైంది.
కవితల్లో మాత్రమిలా రచియించే ఘనత మనది.
కడుపుబరువు మోసినట్లు కాడిమోయ గలదు వనిత
అది తెలిసీ వంటింటికి బంధించే ఘనత మనది !
నాగరికుల మంటూనే నారిని అణిచేస్తున్నాం
అమ్మపాత్ర నాటకాన తగ్గించే ఘనత మనది!
బొమ్మలు చెక్కే శిల్పిని శిల్పంగా మార్చేసాం
అమ్మలకై ఒకరోజును ప్రకటించే ఘనతమనది!
~~~~~~~~~~~~
గజల్ సౌజన్యం డా. ఉమాదేవి జంధ్యాల

2, మే 2021, ఆదివారం

పుస్తక పఠనం

 



మరుగునపడ్డ ఓ అలనాటి బాపు గారి నలుపు తెలుపుల రేఖా చిత్రాన్ని, నేను నా రేఖలు రంగుల్లో మళ్ళీ చిత్రీకరించాను. నా సేకరణలో శిధిలావస్థలో ఉన్న బాపు గారి కొన్ని చిత్రాల్ని పునరుధ్ధరించాలనే నా తపన కి మిత్రుల సహకారం, స్పందన నాకు కొండంత బలాన్ని ఇస్తుంది.


ఈ చిత్రానికి facebook లో వచ్చిన పద్య స్పందన ఇక్కడ పొందుపరుస్తున్నాను. ధన్యవాదాలు.


శ్రీమతి పద్మజ మంత్రాల గారి పద్యం

కందము

తీరైన వంపు సొంపులు

బారెడు జడ గలిగినట్టి భామ సొగసుగా...
చేరిచి చెంపకు కరమును
బోరగిలి పఠించుచుండె పొత్తము నౌరా!
(పొత్తము=పుస్తకము

-------------------------------------------------------------------------------------------

శ్రీ వేంకటేశ్వర రావు గారు రచించిన పద్యం:

ఆటవెలది -

చదువు కొనిన యువతి సంస్కారి యౌచును
చక్కదీర్చు నిల్లు నిక్కముగను
విలువ నెరిగి నిత్య విదార్ధి యై తాను
చదివి చదువు జెప్పు సంతతి కిని

-- సేకరణ : పొన్నాడ మూర్తి


1, మే 2021, శనివారం

అన్నమయ్య జననం




 (నా దగ్గర ఉన్న కొన్ని అరుదైన బాపు గారి చిత్రాల్ని రంగుల్లో చిత్రీకరించదలిచాను. అందులో భాగంగా అన్నమయ్య, అన్నమయ్య కీర్తనలకు సంబంధించిన చిత్రాలు వేయ సాహసిస్తున్నాను. మిత్రుల ప్రోత్సాహం నాకు కొండంత బలాన్ని ఇస్తుంది.)

సంతానంలేక తీవ్ర వ్యధకు గురైన భాగవతసేవా పరాయణులైన నారాయణసూరి, లక్కమాంబ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రణామం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని గాథ. కొండలయ్య తాను ధరించే "బిరుదు గజ్జియల ముప్పిడి కఠారాన్ని" వారికందజేశాడట. అలా పుట్టిన శిశువే అన్నమయ్య.

పుస్తకమా నీకు జోహార్లు


పుస్తకమా నీకు జోహారులు ! (రచన : సౌజన్యం : శ్రీ పొన్నాడ ఉమామహేశ్వరరావు)
చిత్రం నేను వేసినదే .. !

"తల్లీ నిన్ను దలంచి పుస్తకమున్ చేతన్ బట్టితిన్ " అని చిన్నప్పుడు తెలుగు వాచకంలో చదువుకున్న పద్యం. పుస్తకం చేత పట్టడమే చదువుల తల్లికి పూజా పుష్పం సమర్పించడంతో సమానం.

విషయ వస్తువు ఏదైనా సరే, పుస్తకం పట్టుకుంటే చాలు, మస్తకం పరుగులు తీస్తుంది. పుస్తకాలు నవ్విస్తాయి, కవ్విస్తాయి, ఏడిపిస్తాయి, ఓదారుస్తాయి. ఒకప్పుడు, అంటే. టీవీలు, ఇంటర్నెట్ అందుబాటులో లేని రోజుల్లో, పుస్తకాలే ప్రజలకి మిత్రులు. కాలక్షేప సాధనాలు. స్వంతంగా పుస్తకాలు కొనుక్కోలేని వారికి పుస్తకాలు అద్దెకి తెచ్చుకొని చదువుకొనే సౌలభ్యం ఆ రోజుల్లో ఉండేది. ఆ రోజుల్లో విరివిరిగా వచ్చిన కొమ్మూరి సాంబశివ రావు, టెంపోరావు, భగవాన్ మొదలైన వారి అపరాధ పరిశొధన నవలలు అద్దెకు తెచ్చుకొని కాలేజీ కుర్ర కారు విపరీతంగా చదివే వారు.

పుస్తక పఠనం పట్ల ప్రజలకి ఆసక్తి తగ్గిపోయింది అనడం నిజం కాదు. మాధ్యమం మారిందేమో గాని, పఠనాసక్తి గల చదువరుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కంప్యూటర్ తెరలు, ల్యాప్ టాప్ లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు ఈ మ్యాగజైన్లు, ఈ బుక్స్, .. ఇలా ఈ నాటి తరం ఎదో రకంగా చదువుతూనే ఉన్నారు.

ఎన్నిప్రత్యామ్నాయాలు వచ్చినా పుస్తకం పుస్తకమే. హాయిగా వాలుకుర్చీలో కాళ్ళు జాపుకొని కూర్చునో, మంచంమీద వ్రాలో, పుస్తకం చదువుకోవడం ఎంత ఆనందదాయకం? చదువుతూ, చదువుతూ, పుస్తకాన్ని గుండెల మీద పెట్టుకొని ఓ చిన్న కునుకు కూడా తీయవచ్చు. ల్యాప్ టాప్లు, ట్యాబ్లెట్లతో ఈ సౌకర్యం చచ్చినా రాదు కదా?

ఇంటికి ఎవరైనా అతిధులు వస్తే, చదువుతున్న పుస్తకం మూసి పక్కన పెట్టి, వచ్చిన వాళ్ళు వెళ్ళి పోయాక తిరిగి చదువుకునే సౌకర్యం ఒక్క పుస్తకానికే ఉంది. అదే ఏ టీవీ చూస్తున్నప్పుడో అతిధులు వస్తే, చూస్తున్న టవీని కట్టెయ్యలేక, వచ్చిన వారిని పొమ్మనలేక ముళ్ళమీద కూర్చున్నట్టు కూర్చోవడం ఎంత ఇబ్బంది?

కొన్నిపుస్తకాలు తట్టి లేపుతాయి. కొన్ని జోకొట్టి నిద్రపుచ్చుతాయి! కొంతమందికి పుస్తకాలు అత్యంత విలువైన ఆస్తి. కొత్తగా కొన్న పుస్తకానికి అట్టవేసి, దాని మీద పేరు వ్రాసి, కొత్త పేళ్ళికూతురిలా ముస్తాబు చేసి మురిసి పోతారు కొందరు. పుస్తకం విలువ తెలియని వాళ్ళు పాత దిన పత్రికలు, చిత్తుకాగితాలతో పాటు పుస్తకాలని అమ్ముకుంటారు.

"చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కాని ఓ మంచి పుస్తకం కొనుక్కో " అని వీరేశ లింగం గారి ఉవాచ. "పుస్తకమే సమస్తమనే చాదస్తపు యువకులు" ఉంటారని సి.నా.రె గారు ఒక సినిమా పాటలో ప్రస్తావించారు.

ఎక్కువగా చదివే వారిని "పుస్తకాల పురుగు" అనడం నిందా స్తుతి!.
కొంత మంది అదే పనిగా పుస్తకాలు కొంటూనే ఉంటారు. చదివినా, చదవకా పోయినా, పుస్తకాలు కొని ఇంట్లో పెట్టుకోక పోతే వీరికి నిద్ర పట్టదు. కొంత మంది అదే పనిగా పుస్తకాలు చదువుతూనే ఉంటారు. రోజు ఏదో ఒక పుస్తకం చదవక పోతే ఉండలేరు. రోజూ రాత్రి పడుకొనే ముందు నాలుగైదు పేజీలు చదివితే గాని నిద్ర పోలేని వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారు.
మాటలు రాని పుస్తకాలకి భాష ఉంటుంది.. ఎన్ని కబురులో, ఎన్ని ఊసులో ఎంత విఙ్నానమో, ఎంత ఉల్లాసమో వాటి ద్వారా మనకి అందుతూనే ఉంటాయి. అందుకే దాశరధి గారు "మూగ పుస్తకాలలోని రాగాలని పాడుకో" అన్నారు ఒక పాటలో!

స్వర్గీయ గాడిచర్ల హరిసర్వోత్తమ రావు లాంటి మహాను భావులు మొదలు పెట్టిన గ్రంధాలయ ఉద్యమం ద్వారా తెలుగు నాట జిల్లా, తాలూకా స్థాయిలో అనేక గ్రంధాలయాలు వెలసి, తెలుగు వారిని పుస్తకాల ప్రియులను చేసాయి.. స్వంతంగా పుస్తకాలు కొనుక్కునే ఆర్థిక స్థోమత లేని వారికి ఈ గ్రంధాలయాలు చాలా ఉపయోగ పడేవి.

కొందరికి పుస్తకాలు చదవడం సత్కాలక్షేపం. మరి కొందరికి అది వ్యసనం. పుస్తకం పట్టుకుంటే ప్రపంచాన్ని మరచిపోయే వ్యక్తులు ఉంటారు. మా అమ్మమ్మ గారు ఒక సారి చారు కాచాలని తగరపు గిన్నెలో నీళ్ళు పోసి కుంపటి మీద పెట్టి ఓ పుస్తకం పట్టుకొని ప్రపంచాన్ని మరచి పోతే, గిన్నెలోని నీళ్ళన్నీ మరిగి ఇగిరిపోయి, చివరికి తగరపుగిన్నె కరిగి కుంపట్లో కలసిపోయినా ఆవిడకి తెలియలేదుట. పుస్తకం ఇచ్చే మత్తు అలాంటిది మరి!

మా చిన్నప్పుడు, జాషువా గారి ఖండ కావ్యాలు, కరుణశ్రీ, విశ్వనాధ వంటి మహనీయుల పుస్తకాలు రైల్వే స్టేషన్లలో హిగ్గిన్ బాదమ్స్ , ఏ.హెచ్ వీలర్ లాంటి బుక్ స్టాల్సులో దొరికేవి అంటే ఇప్పుడు ఆశ్చర్యంగానే ఉంటుంది. అప్పటి ప్రజల అభిరుచి అలాంటిది.

ఈ రోజుల్లో ప్రతి వాడి చేతిలోనూ సెల్ ఫోనులు వచ్చాయి గాని, ఒకప్పుడు "పుస్తకమే హస్త భూషణం" గా ఉండేది. పుస్తకాలు యువతీ యువకులకి ప్రేమలేఖలని మోసుకెళ్ళే పల్లకీలుగా ఉపయోగ పడేవి. కొండొకచో ఆ ప్రయత్నాలు ఫలించి పెళ్ళీదాకా దారితీస్తే మరి కొన్ని సందర్భాలలో వికటించి విపరీత పరిణామాలకి దారి తీసేవి.

పుస్తకాలు సంబంధ బాంధవ్యాలని పెంచడమే కాదు, చెడగొడతాయి కూడా! అపురూపంగా కొనుక్కున పుస్తకం ఎవరైనా అడిగితే ఇచ్చారనుకోండి. దానిని తీసుకున్న వాళ్ళు , కావాలనో, మరిచిపోయో, తిరిగి ఇవ్వక పోతే, ఒక వేళ ఇచ్చినా, ఆ పుస్తకం నలిగిపోయో, చిరిగిపోయో వస్తే ఇక చూసుకోండి! బంధువులైనా, మిత్రులైనా వాళ్ళిద్దరూ మాటా మాటా అనుకొని, చెడా మడా తిట్టేసుకొని, మాట్లాడుకోవడం మానేసిన సందర్భాలు ఉంటాయి.

మహాకవి శ్రీశ్రీ కవితల సంపుటి "మూడు యాభైలు " మొదటి పేజీలో ఒకే ఒక వ్యాక్యం ఉంటుంది " "ఎవరు బ్రతికేరు మూడు యాభైలు" అని. పుస్తకం మూడు యాభైలు బ్రతుకుతుందని నర్మ గర్భంగా ఆ వాక్యం ద్వారా చెప్పేరు శ్రిశ్రి గారు. భాష, లిపి పుట్టిన ఎన్ని ఏళ్ళకి పుస్తకం పుట్టిందో తెలియదు గాని, తాళపత్రాల నుంచి అత్యంత ఆధునిక ముద్రణా రీతుల దాకా ఈ పుస్తకం ఎంత దూరం ప్రయాణించిందో! ఇంకా ఎంత దూరం ప్రయాణిస్తుందో!

కొస మెరుపు: ఇది నిజమో, కల్పితమో తెలియదు గాని, ఈ సంగతి ఎక్కడో చదివాను. ప్రముఖ రచయిత చలం గారి ఇంట్లో ఒకసారి దొంగలు పడ్డారుట. ఆ కబురు తెలిసిన మరో ప్రముఖ రచయిత, కవి, సంజీవ్ దేవ్ గారు చలం గారికి ఓ పోస్టు కార్డు మీద రెండు వాక్యాలు ఇలా వ్రాసారుట. "మీ ఇంట్లో దొంగలు పడ్డారని తెలిసి చాలా విచారించాను. ఇంతకీ పుస్తకాలేమీ పోలేదు కద?"
పుస్తకాలని సంపదగా భావించే మహానుభావులు ఎందరో? ఆందరికీ వందనాలు!

-పొన్నాడ ఉమామహేశ్వర రావు

అమ్మకే అమ్మ అమ్మమ్మ

 ​ అమ్మకే అమ్మ అమ్మమ్మ (pen sketch) ఆ గుండె చప్పుడు వింటూ ఒదిగిపోతా, నీ దీవెనల నీడలో పెరిగి పెద్దవుతా. తరాలు దాటిన మన ప్రేమానుబంధం, ఈ సృష్టి...