29, జులై 2021, గురువారం

రాచకొండ విశ్వనాధ శాస్త్రి - Rachakonda Viswanadha Sastri


 


నివాళి - ప్రముఖ రచయిత "రాచకొండ విశ్వనాథశాస్త్రి" జయంతి నేడు. (My Pencil sketch)


రాచకొండ విశ్వనాధశాస్త్రి (జూలై 30, 1922 - నవంబర్ 10, 1993) వృత్తి రీత్యా న్యాయవాది. రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన ఆయన, కథల్లో కూడా న్యాయవాదే . నేటి సమాజంలో నిత్యమూ పై తరగతులవారి అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురై చిత్ర హింసలు పడుతున్న దీన, హీన ప్రజల తరపున తన ప్రతి రచనలోను వకాల్తా పుచ్చుకుని సాంఘిక (ఆర్థిక)న్యాయం కోసం "వాదించాడు". సమాజం అట్టడుగు పొరల్లో, అనుక్షణం భయపడుతూ జీవించే అథోజగత్సహొదరుల సమస్యలను, వాటివలన కలిగే దుఖాన్ని సూటిగా గుండెలకు నాటేలా చెప్పి పై జీవితం పట్ల పాఠకుల సానుభూతి "పిండ" గల ఏకైక ప్రతిభావంతుడు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మాండలికంలో, అట్టడుగు వర్గాల భాషలో, సొగసుగా, ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా, పాఠకుల హృదయాలకు హత్తుకు పోయేలా పదునైన రచనలు చేసాడు. (వికీపీడియా సౌజన్యంతో)

కామెంట్‌లు లేవు:

ఉదయరాగం

వేకువజామున మెత్తని బంగారు వర్ణపు కాంతిలో, కమల తన భుజంపై బరువైన లోహపు బిందెను సమతుల్యం చేసుకుంటూ ఆ దుమ్ము దారిలో నడుస్తోంది. గ్రామం ఇంకా నిద్...