10, మే 2024, శుక్రవారం

పినపాల వెంకట దాసు - సినిమా పంపిణీదారుడు, స్టూడియో అధినేత, సినీ నిర్మాత - charcoal pencil sketch


పినపాల వెంకటదాసు - charcoal pencil sketch


పి.వి.దాసు గా ప్రసిద్ధిచెందిన పినపాల వెంకటదాసు (1870 - 1936)  తొలి రోజుల్లో తెలుగు  సినిమా పంపిణీదారుడు, తొలి తెలుగు స్టూడియో అధినేత, సినీ నిర్మాత. 

వీరు బందరు, రేపల్లెలో సినిమా హాళ్ల నిర్మించడమే కాకుండా టి.రాజన్, సి.డి.సామి, సి.పి.సారథి, జయంతీలాల్ థాకరేలతో కలసి 1934లో వేలు పిక్చర్స్ ప్రారంభించారు.  మద్రాసులో  తొట్టతొలి టాకీ స్టూడియో వేల్ పిక్చర్స్ స్టూడియో. అంతకు ముందు సినీ నిర్మాతలు బొంబాయి, కలకత్తా, కొల్హాపూరు, పూణే లోని సాంకేతికులపై ఆధారపడేవారు. ఈ స్టూడియో నాలుగేళ్ళ పాటే నిలిచినా తమిళ, తెలుగు  సినీ నిర్మాణంతో మహోన్నతమైన పాత్రపోషించింది.  మద్రాసులోనే  నిర్మాణానికి కావలసిన అన్ని సౌకర్యాలు సమకూర్చి సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేసింది. వేల్ పిక్చర్స్ పతాకంపై వెంకటదాసు సీతాకళ్యాణం కృష్ణలీలలు, మాయాబజార్ మొదలైన చిత్రాలను నిర్మించారు. ప్రభాత్ పిక్చర్స్ వారి తమిళ సినిమా ఆధారంగా ఈయన తెలుగులో తీసిన సీతాకళ్యాణం సినిమా, మద్రాసులో నిర్మించబడిన తొలి తెలుగు చలన చిత్రం. .  . తన స్వస్థలమైన బందరులో మునిసిపల్ కౌన్సిల్ సభ్యులుగాను, జిల్లా బోర్డు సభ్యులుగాను పనిచేశారు. ఈయన మహోన్నతంగా తీయాలనుకున్న  మాయాబజార్  సినిమా నిర్మాణము ఇంకా పూర్తికాక మునుపే వెంకటదాసు   1936 మే 10  తేదీన పరమపదించారు. పి.వి.దాసు మరణానంతరం వేల్‌ పిక్చర్స్ కనుమరుగై నరసు స్టూడియోస్ పేరుతో రూపాంతరం చెందింది.


credit : Wikipedia 

కామెంట్‌లు లేవు:

సాలూరు రాజేశ్వరరావు - చలనచిత్ర సంగీత దిగ్గజం

నా పెన్సిల్ చిత్రం - రాజేశ్వరరావు గారి గురించి చాలా విషయాలు తెలియపరిచిన శ్రీ షణ్ముఖాచారి గారికి ధన్యవాదాలు .  _*ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ స...