13, జనవరి 2021, బుధవారం

నందా.. ప్రముఖ బాలీవుడ్ నటి



ఏహ్ సమా..సమా హై యే ప్యార్ కా
కిసి కే ఇంతజార్ కా... 
దిల్ న చురా లే కహి మేరా ...
మౌసమ్ బాహర్ కా .....

ప్రముఖ బాలీవుడ్ నటి కుమారి నందా .


కుమారి నందా మహారాష్ట్ర కుటుంబంలో 1939 జనవరి 8 న జన్మించారు.తండ్రి మాస్టర్ వినాయక్ విజయవంతమైన మరాఠీ నటుడు నిర్మాత దర్శకుడు.ప్రముఖ దర్శకుడు వి శాంతారాం కజిన్ అవుతారు.మాస్టర్ వినాయక్ మంగేష్కర్ కుటుంబానికి మంచి స్నేహితుడు.తన చిత్రం పహిలీ మంగళగౌర్ ద్వారా లత మంగేష్కర్ ను చిత్రసీమకు పరిచయంచేసారు.

మాస్టర్ వినాయక్ 41 సం.ల వయసులో 1947 లో మరణించారు.అప్పుడు నందా వయసు 8 సం.లు. తనకంటే చిన్నవారైన ఆరుగురు తమ్ముళ్ల చెల్లెళ్ళ పోషణభారం ఆమెపై పడింది. 1948 లో మందిర్ చిత్రంతో బాలనటిగా నటజీవితం ప్రారంభించింది.అప్పుడు ఆమెను బేబీ నందా అని పిలిచేవారు. 1948 నుండి 1956 వరకు బాలనటి గ నటించింది.నటజీవితంతో ఆమె చదువు కుంటుపడింది.పేరుపొందిన ఉపాధ్యాయుని ద్వారా ఇంటివద్దనే విద్యనభ్యసించింది. 

వి శాంతారాం గారు తన చిత్రం తూఫాన్ ఔర్ దియా ( 1956 )లో అవకాశమిచ్చారు.అందులో తనది అంధురాలైన చెల్లెలి పాత్ర. తరువాత 1959 లో ఎల్ వి ప్రసాద్ గారు నిర్మించిన చ్చోటి బహెన్ చిత్రంలో ఇద్దరు అన్నలకు అంధురాలైన చెల్లెలుగా నటించారు.ఈచిత్రం ఎంతో విజయవంతమయ్యింది.ఆమె పాత్రను అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రు గారు ఎంతో మెచ్చుకున్నారు.తాను రాజ్ కపూర్ రాజేంద్ర కుమార్ గార్లతో హీరోయిన్ గ నటించారు. 
కుమారి నందా వర్ధమాన నటులను ఎంతో ప్రోత్సహించేది.వర్ధమాన నటుడు శశి కపూర్ తో 8 చిత్రాలలో నటించారు. 

1965 లో సూరజ్ ప్రకాష్ అనే దర్శకుడు తో పెళ్లి ప్రస్తావన జరిగింది.కానీ అది సఫలీకృతం కాలేదు. 1992 లో తన నడివయసులో దర్శకుడు మన్ మోహన్ దేశాయ్ గారితో నిశ్చితార్ధం జరిగింది.కానీ ఆకస్మికంగా ఆయన కొద్దిరోజులకే మరణించటం జరిగింది. ఇలా ఆమె అవివాహితగానే మిగిలిపోయారు. 2014 మార్చ్ 25 న ముంబైలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు.
 

కామెంట్‌లు లేవు:

యామిజాల పద్మనాభస్వామి - బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు

నా పెన్సిల్ చిత్రం - (స్పష్టత లేని పురాతన  ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం) యామిజాల పద్మనాభస్వామి  బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితు...