24, జనవరి 2021, ఆదివారం

జాతీయ బాలికా దినోత్సవం -



కంటికి రూపం,ఇంటికి దీపం,,మమతకు అపురూపం..నిండు గుండెకు ఆడపిల్లే మణిదీపం..





విద్యా విజ్ఞానాలే తోడుగా
ఆటంకాలను అధిగమిస్తూ
ఆత్మవిశ్వాసమే తరగని బలంగా
ఆశయాలను సాధిస్తూ
నీభవితను నీవే తీర్చిదిద్దుకో
నేటి బాలికా నీవే రేపటి ఏలిక..!!

(అనూశ్రీ)

జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 24న నిర్వహించబడుతుంది. సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై ఈ బాలికా దినోత్సవం రోజున అవగాహన కల్పిస్తారు.

ఆడపిల్ల అనగానే సమాజంలో చిన్నచూపు చూస్తున్నారు. అంతేకాకుండా కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. పుట్టిన తరువాత అనేక ఆంక్షలు విధిస్తున్నారు. వాటిని నిర్మూలించి ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టిసారించే దిశగా భారత ప్రభుత్వం ‘నేషనల్ గర్ల్స్ డెవలప్మెంట్ మిషన్‘ పేరుతో ఒక కార్యక్రమం రూపొందించింది. అందులో భాగంగా 2008లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంతో జాతీయ బాలికా దినోత్సవంను ప్రారంభించడం జరిగింది.

నాటి ఆడపిల్లే రేపటి సృష్టికి మూలమైన అమ్మ.. సృష్టికి మూలం స్త్రీ. ఆడపిల్ల భారం కాదని, అవకాశాలు అందిస్తే ఆకాశమే హద్దుగా ముందుకుపోతామని అనేకమంది మహిళలు నిరూపించారు. జాతికా బాలికా దినోత్సవం సందర్భంగా బాల్యదశా నుండే ఆడపిల్లలను అన్ని విషయాలలో ప్రోత్సహించి, బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం.


(నేను వేసిన చిత్రాలతో పాటు నేను సేకరించిన మంచి విషయాలు, అభిప్రాయాలు. నా చిత్రానికి కవిత రాసిన 'అనూశ్రీ' కి నా శుభాశీస్సులు.)
 

కామెంట్‌లు లేవు:

యామిజాల పద్మనాభస్వామి - బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు

నా పెన్సిల్ చిత్రం - (స్పష్టత లేని పురాతన  ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం) యామిజాల పద్మనాభస్వామి  బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితు...