11, ఫిబ్రవరి 2021, గురువారం

డా. సి. ఆనందారామం.. నివాళి


 ఆనందరామం  ఇకలేరు!

ప్రముఖ రచయిత్రి సి.ఆనందరామం ఇవాళ ఉదయం హైదరాబాద్ లో  గుండెపోటుతో కనుమూశారు. ఆమె అసలు పేరు ఆనంద లక్ష్మి. భర్త రామం పేరు తన పేరు చివర జోడించి రచయిత్రి సి.ఆనందారామంగా తెలుగు సాహిత్య లోకం లో రాణించారు. ఆగస్టు 20వ తేదీ 1935వ సంవత్సరం  పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. 60 నవలలు, 100కు పైగా కథలు, కొన్ని విమర్శనా గ్రంథాలు  రాశారు. ఆమె రాసిన నవల ఆత్మబలి ...సంసార బంధం సినిమాగా, అదే నవల జీవన తరంగాలు టీవీ సీరియల్‌గా వచ్చింది. జాగృతి నవలను త్రిశూలం సినిమాగా, మమతల కోవెల నవలను జ్యోతి సినిమా గా తీశారు. ఏలూరులోని ఈదర వెంకట రామారెడ్డి స్కూలులో ప్రాథమిక విద్యను అభ్యసించి, ఇంటర్ వరకు చదివి బి.ఏ. ప్రైవేటుగా పూర్తి చేశారు.  సి.ఆర్.ఆర్.కాలేజీలో తెలుగు ట్యూటర్‌గా కొన్నాళ్లు పనిచేశారు. 1957లో వివాహం అయ్యాక హైదరాబాదుకు మకాంమార్చారు .1958-'60లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ. తెలుగు చేశారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి గైడ్ గా పి.హెచ్.డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. హోం సైన్స్ కాలేజీలోను, నవజీవన్ కాలేజీలోను కొంతకాలం పనిచేశాక 1972లో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చేరి ప్రొఫెసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. సుమారు 30మంది విద్యార్థులు ఈమె ఆధ్వర్యంలో పి.హెచ్.డి చేశారు. 2000లో పదవీ విరమణ పొందారు.

గృహలక్ష్మి స్వర్ణకంకణము - 1972

మాలతీ చందూర్ స్మారక అవార్డు -2013, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు - 1979 (తుఫాన్ నవలకు), మాదిరెడ్డి సులోచన బంగారు పతకం - 1997, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు - రెండు పర్యాయాలు, సుశీలా నారాయణరెడ్డి పురస్కారం, 

గోపీచంద్ పురస్కారం,

అమృతలత జీవన సాఫల్య పురస్కారాలు ఆమెను వరించాయి!  ఆమె మృతితో  ఒక శకం ముగిసింది!  శాశ్వతంగా గుర్తుండిపోయే రచనలు చేసిన ఆనందరామం గారికి అశ్రు నివాళి🙏

- డాక్టర్ మహ్మద్ రఫీ

కామెంట్‌లు లేవు:

వావిలకొలను సుబ్బారావు - పండితకవులు - charcoal pencil sketch

పండితకవులు కీ. శే.    వావిలకొలను సుబ్బారావు -  నా charcoal పెన్సిల్ తో చిత్రీకరిణకుకున్న చిత్రం  వికీపీడియా సౌజన్యంతో ఈ క్రింది వివరాలు సేకర...