23, జూన్ 2021, బుధవారం

కరణం మల్లీశ్వరి


 తెలుగు మహిళ పద్మశ్రీ కరణం మల్లీశ్వరి గారికి  విశిష్ట గౌరవం.


ఆంధ్రప్రదేశ్ కి చెందిన ప్రముఖ వెయిట్ లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లీశ్వరి(46) ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్(వీసీ)గా నియమితులయ్యారు. ఈమేరకు ఢిల్లీ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి మొట్టమొదటి వీసీ కరణం మల్లీశ్వరే కావడం విశేషం. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.


ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన కరణం మల్లీశ్వరి 2000 సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్లో భారత్ కు కాంస్య పతకం సాధించారు. భారత్ తరుపున ఓలింపిక్స్ లో మెడల్ సాధించిన మొట్టమొదటి మహిళ కరణం మల్లీశ్వరే. 1994,1995లలో 54 కేజీల విభాగంలో రెండుసార్లు వరల్డ్ టైటిల్ సాధించి ఛాంపియన్గా నిలిచారు. 1994లో ఇస్తాంబుల్లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ సాధించారు. 1995లో కొరియాలో ఆసియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ సాధించారు.

(pencil sketch)


నా చిత్రానికి శ్రీమతి పద్మజ మంత్రాల తన పద్యం ద్వారా ఇలా స్పందించారు :



కరణం మల్లీశ్వరి యను
తరుణి బరువు లెత్తగ మును దక్కెను బిరుదుల్...
మురియగ నాంధ్రజనావళి
వరియించెను నేడు గొప్ప పదవియు నామెన్!

కామెంట్‌లు లేవు:

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...