15, ఆగస్టు 2021, ఆదివారం

కవి ప్రదీప్ - దేశభక్తి పాటల రచయిత


 భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశభక్తి గీతాల రచయిత

'కవి ప్రదీప్' ని స్మరించుకుందాం. (My pencil sketch of the lyrical legend)
కవి ప్రదీప్ (6 ఫిబ్రవరి 1915 - 11 డిసెంబర్ 1998). అసలు పేరు రామచంద్ర నారాయణ్‌జి ద్వివేది, ఆయన రచించిన దేశభక్తి పాట "ఏ మేరే వతన్ కే లోగోం" చైనా-భారత్ యుద్ధంలో అసువులుబాసిన భారతీయ సైనికులను ఉద్దేశిస్తూ రచించిన గేయం అత్యంత ప్రాశస్త్యాన్ని పొందడమే కాకుండా లతా మంగేష్కర్ ఈ పాట పాడినప్పుడు నాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్ర భావోద్వేగంతో కంటతడి పెట్టారు.
వీరు స్వయంగా రచించి పాడిన పాట 'దేఖ్ తెరే సంసార్ కి హాలత్ క్యా హోగయి భగవాన్ కిత్నా బదల్ గయా ఇన్శాన్' ఓ సూపర్ హిట్.
బంధన్ (1940) చిత్రానికి అతని దేశభక్తి సాహిత్యానికి అతని మొదటి గుర్తింపు వచ్చింది. భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలి స్వర్ణొత్సవ చిత్రం 'కిస్మత్' లో వారు రచించిన 'దూర్ హటో ఏ దునియావాలో" పాట ఓ పెద్ద సంచలనం సృష్టించడమే కాకుండా నాటి బ్రిటిష్ పాలకులను గడగడలాడించింది. వీరిని arrest చెయ్యాలని ఆదేశించిన కారణంగా కొన్నాళ్ళు ప్రదీప్ ఆజ్ఞాత జీవితం గడపవలసి వచ్చింది.
ఐదు దశాబ్దాల కెరీర్ వ్యవధిలో, కవి ప్రదీప్ దాదాపు 1,700 పాటలు మరియు జాతీయవాద కవితలు కొన్ని 72 చిత్రాలకు సాహిత్యంతో సహా వ్రాసారు, ఇందులో బంధన్ (1940) మరియు "ఆవో బచ్చో తుమ్హీన్ దిఖాయెన్" లోని "చల్ చల్ రే నౌజవాన్" వంటి ప్రభోదాత్మక, దేశభక్తి హిట్‌ పాటలు ఉన్నాయి. మరియు జాగృతి (1954) చిత్రంలో "దీ దీ హమే ఆజాది" 1958 తో పాటు 13 పాటల ఆల్బమ్‌ను HMV విడుదల చేసింది. అతను రాష్ట్రకవి (జాతీయ కవి) గా గుర్తించబడ్డాడు.
1997 లో జీవితకాల సాఫల్యానికి గాను 'దాదా సాహెబ్ ఫాల్కే' పురస్కారంతో భారతదేశం వీరిని సత్కరించింది. భారతీయ తపాలా శాఖ వీరి స్మృత్యర్ధం తపాలా బిళ్ళ విడుదల చేసింది.

కామెంట్‌లు లేవు:

నీతోడుతొ జీవితాన్ని గడపనివ్వు ఇలాగే ౹౹ మదినేలే రాణివలే గెలవనివ్వు ఇలాగే ౹౹ - గజల్

Pvr Murty బాబాయ్ గారి చిత్రానికి చిన్న ప్రయత్నం... నీతోడుతొ జీవితాన్ని గడపనివ్వు ఇలాగే ౹౹ మదినేలే రాణివలే గెలవనివ్వు ఇలాగే ౹౹ ఆలోచన అంతులేన...