14, డిసెంబర్ 2022, బుధవారం

మనసు తంత్రులను శృతిచేస్తూ బ్రతుకు గీతం పాడాలి - కవిత


నా చిత్రానికి వర్ధమాన కవయిత్రి సునీతా జోషి రచించిన కవిత.

మనసు తంత్రులను శృతిచేస్తూ
బ్రతుకు గీతం పాడాలి
వేదనెంతో మోదమెంతో
గుండెతోనే పలకాలి
జీవితపు సారాన్ని రంగరించి
ఎత్తు పల్లాలనే పదనిసలుగా
స్వర జతులను పలికించి
సప్తస్వర సంగీత మాధుర్యాన్ని
భావితరాలకు అందించాలి
ఆస్వాదించే హృదయానికి
నిత్యం ఆమని చేరువౌతుంది
ఆకు రాల్చుకునే శిశిరం కూడా
ఆమడదూరం జరగుతుంది
మమతల మాధుర్యాన్ని
అణువణువున నింపుకున్న
ఆ కళాత్మక హృదయానికి
ఈ జగతి కళావేదిక కావాలి
రసానుభూతి చెందే మనసు
తన సొంతమైతే....
ఆపగలదా వయసు అలసట
హద్దులెరుగని అనంతమైన
భావాల విహంగానికి స్వేచ్ఛనిస్తే
తన స్వర మాధుర్యంతో....
విజేతై నిలవదా...ఈ జగతి నేలదా ......
...సునీతా జోషి.



nd 15 ot

కామెంట్‌లు లేవు:

బి. గోపాలం - సంగీత దర్శకుడు, , నటుడు

బి గోపాలం - సంగీత దర్శకుడు గాయకుడు నటుడు  (my charcoal pencil sketch)  Facebook మిత్రులు వీర నరసింహారాజు గారి వాల్ నుండి సేకరణ యధాతధంగా. వార...