18, ఫిబ్రవరి 2016, గురువారం

తమిళ దేశమందు తరుణులు ధరియింత్రు, తలను మల్లె పూలు తప్పకుండ.

శ్రీమతి శశికళ  ఓలేటి గారి  పద్యాలు.



ఆ.వె 1. తమిళ దేశమందు తరుణులు ధరియింత్రు,
తలను మల్లె పూలు తప్పకుండ.
సంప్రదాయ రీతి చనుదురదె గుడికి
పట్టు చీర గట్టి పెట్టి విరులు.
………………………………………
కం.2. సార్ధక మాయెగ మల్లెలు
మార్ధవమగు మగువల జడ మరులొలకంగన్
స్వార్ధమె లేనివిగ విరులు
హార్ధిక పరిమళము లిచ్చి హాయిని గూర్చన్.
………………………………………
3.పూలు ముడవ నదియె పోగాల మొచ్చెనే!
పొట్టి జడల యందు పూలు కరువె!
లక్షణముగ నతివ లదిగొ పూలు ముడిచి,
వెడలు చుండె గుడికి విరియ భక్తి.

1 కామెంట్‌:

Zilebi చెప్పారు...


తల బిరుసోయను కొంటిని
"కొలవెరి" లాడుచు జిలేబి కొప్పును జూడన్
వెల సరసమాయె మల్లియ !
తల మ ల్లియగనె సొగసుగను తరుణిని జూడన్

జిలేబి

యామిజాల పద్మనాభస్వామి - బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు

నా పెన్సిల్ చిత్రం - (స్పష్టత లేని పురాతన  ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం) యామిజాల పద్మనాభస్వామి  బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితు...