9, అక్టోబర్ 2020, శుక్రవారం

అడివి బాపిరాజు - రచయిత, చిత్రకారుడు

అడవి బాపిరాజు గారి జయంతి సందర్భంగా నేను నా pencil తో వారి చిత్రం చిత్రీకరించాను. వారి గురించి నేను సేకరించిన వివరాలు క్రిందన పొందుపరుస్తున్నాను.

 అడివి బాపిరాజు (అక్టోబరు 81895 - సెప్టెంబరు 221952) బహుముఖ ప్రజ్ఞాశీలి. స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయితకళాకారుడు, నాటక కర్త. తెలుగు దేశమంతటా విస్తృతంగా ప్రచారంలోనున్న "బావా బావా పన్నీరు" పాట ఈయన వ్రాసిందే. సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా "బాపి బావ" అని పిలిచేవారు.

నారాయణరావు, గోనగన్నారెడ్డి, కోణంగి వంటి అద్భుతమైన నవలలు రాశారు. నవరంగ సంప్రదాయ పద్ధతిలో ఎన్నో చిత్రాలను చిత్రీకరించారు. ఇంకా రేడియో నాటికలు, పలు కధలు రచించారు. వీరి గురించి వికీపీడియా లింక్ క్లిక్ చేసి చదవండి.

https://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%A1%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BF_%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81


వారు రచించిన 'వడగళ్ళు' కధ గురించి, వారి గురించి మరిన్ని వివరాలు ప్రముఖ రచయిత, నటుడు కీ.శే. గొల్లపూడి మారుతీరావు గారు బాపిరాజు గారి కుమార్తె తో జరిపిన ఇంటర్వ్యూ లో మరిన్ని వివరాలు తెలుసుకోగలిగాను. ఈ క్రింది లింక్ క్లిక్ చూసి వీక్షించమని మనవు

.https://www.youtube.com/watch?v=elWUNK-dy-g


కామెంట్‌లు లేవు:

యామిజాల పద్మనాభస్వామి - బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు

నా పెన్సిల్ చిత్రం - (స్పష్టత లేని పురాతన  ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం) యామిజాల పద్మనాభస్వామి  బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితు...